Y.S.R. Cuddapah

News May 14, 2024

జిల్లాలో ఓటింగ్ ప్రశాంతంగా ముగిసింది: కడప కలెక్టర్

image

కడప జిల్లాలో ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసినట్లు కలెక్టర్ వి.విజయ్ రామరాజు సోమవారం రాత్రి పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాలలో ఓటింగ్ ప్రక్రియ సజావుగా సాగిందన్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ సమయం కాగా, నిర్ణీత సమయానికి పోలింగ్ కేంద్రంలో ఉన్న అందరికీ ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

News May 13, 2024

కడప: బార్ల వద్ద బారులు తీరిన ప్రజలు

image

ఎన్నికల పోలింగ్ సమయం ముగియడంతో కడపలో బార్ల వద్ద మద్యం కోసం మందుబాబులు బారులు తీరారు. పోలింగ్ కు 48 గంటల ముందు అన్ని వైన్ షాప్ లు, బార్లను ముందస్తు చర్యలలో భాగంగా మూసివేశారు. పోలింగ్ ముగియడంతో ఎప్పుడెప్పుడు తీరుస్తారా అని మద్యం కోసం ఎదురుచూస్తున్నారు. సాయంత్రం 7 గంటలకు తెరుస్తారన్న సమాచారంతో పెద్ద ఎత్తున ప్రజలు కాపలా కాస్తున్నారు.

News May 13, 2024

పోలింగ్ లో కడప జిల్లానే టాప్

image

ఉమ్మడి కడప జిల్లాలో చాలా చోట్ల ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే ఇప్పటివరకు కడప జిల్లాలో 27.02 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. రాష్ర్టంలోనే ఇప్పటివరకు అత్యధికంగా ఓటింగ్ నమోదైంది మన జిల్లాలోనే కావడం విశేషం. మరికొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. దీంతో పోలీసులు అక్కడ ఉక్కుపాదం మోపుతున్నారు.

News May 13, 2024

ఉమ్మడి కడప జిల్లాలలో 11 గంటలకు పోలింగ్ శాతం

image

☛ బద్వేలు: 30.35%
☛ జమ్మలమడుగు: 33.47%
☛ కడప: 20.68%
☛ కమలాపురం : 25.87%
☛ మైదుకూరు: 23.91%
☛ ప్రొద్దుటూరు: 24.87%
☛ పులివెందుల: 31.06
☛ రాజంపేట: 22.54%
☛ రాయచోటి: 25.20%
☛కోడూరు 25.59%

News May 13, 2024

కడప, అన్నమయ్య జిల్లాల పోలింగ్

image

ఉదయం 9 గంటలకు కడప పార్లమెంట్ పరిధిలో 12.09 శాతం నమోదైంది. అటు రాజంపేట పరిధిలో 10.36 నమోదు అయింది. కాగా పుల్లంపేట, చాపాడు, కమలాపురం ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బద్వేలు: 10.20% ✒ జమ్మలమడుగు: 16:39% ✒ కడప: 9.67% ✒ కమలాపురం :12.80% ✒ మైదుకూరు: 10.68% ✒ ప్రొద్దుటూరు: 12: 62% పులివెందుల: 12.44 ✒ రాజంపేట: 7.89% ✒ రాయచోటి: 10.50% ✒కోడూరు 10.31% నమోదు అయింది.

News May 13, 2024

కడప జిల్లాలో మొదలైన మాక్ పోలింగ్

image

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మాక్ పోలింగ్ అన్ని పోలింగ్ కేంద్రాలలో ప్రారంభమైంది. కడప జిల్లా వ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ అధికారుల ఆధ్వర్యంలో అన్ని పార్టీల ఏజెంట్ల సమక్షంలో పోలింగ్ ఎలా నిర్వహిస్తారో వారికి అవగాహన కల్పించారు. పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించి తిరిగి వెళ్లే వరకు తీసుకోవాల్సిన ప్రక్రియపై వారికి వివరించారు. ఏదైనా అనుమానాలు ఉంటే పోలింగ్ అధికారిని సంప్రదించాలంటూ తెలిపారు.

News May 13, 2024

కడప, అన్నమయ్య జిల్లాలకు ప్రత్యేక అధికారి నియామకం

image

వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల ఎన్నికల ప్రత్యేక అధికారిగా ఐపీఎస్ అధికారి అతుల్ సింగ్ ను నియమిస్తూ రాష్ట్ర డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కు సంబంధించి ఎన్నికలు సజావుగా జరిగేలా పర్యవేక్షణ చేస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రెండు జిల్లాలతో పాటు రాయలసీమ జిల్లాలకు ఈయనను ప్రత్యేక అధికారిగా నియమిస్తూ డీజీపీ ఆదేశాలు జారీ చేశారు.

News May 12, 2024

ఓటర్లకు ఆహ్వానం పంపిన కడప కలెక్టర్

image

ప్రజాస్వామ్య పండుగలో భాగంగా మే 13న జరిగే ఎన్నికల ఓటింగ్ కార్యక్రమంలో మీ కుటుంబంలోని ఓటర్లందరూ.. తమ ఓటు హక్కును సద్వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు ఒక ప్రకటన ద్వారా ఆహ్వానం పలికారు. ఓటు హక్కును పొందిన వారంతా తమ తమ నియోజకవర్గాల్లో ఓటర్ కార్డు కలిగిన పోలింగ్ కేంద్రాలలో ఈ నెల 13వ తేదీ ఉదయం 6 నుంచి సాయంత్రం 6 లోపు ఓటు వేసేందుకు తరలిరావాలని ఓటర్లను సూచించారు.

News May 12, 2024

నేడు కడపకు సీఎం.. రేపు ఓటు వేయనున్న సీఎం

image

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈరోజు సాయంత్రం కడప జిల్లాకు రానున్నారు. ఎన్నికలలో భాగంగా తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు తన సతీమణి భారతితో కలిసి ఈరోజు పులివెందుల రానున్నారు. ఈరోజు సాయంత్రం తాడేపల్లి నుంచి బయలుదేరి విమానంలో కడపకు చేరుకొని పులివెందులకు వెళ్తారు. రేపు ఉదయం పులివెందులలో వారి ఓటు హక్కును సీఎం జగన్ వినియోగించుకోనున్నారు. దీంతో పోలీసులు భద్రతను కట్టు దిట్టం చేశారు.

News May 12, 2024

కడప: ఎలక్షన్@2024.. పోలింగ్ శాతం పెరిగేనా..?

image

ఉమ్మడి కడప జిల్లాలో 2019లో పోలింగ్ శాతం ఇలా ఉంది. బద్వేల్-76.3, రాజంపేట-74.1, కడప-62.8, కోడూరు-74.8, రాయచోటి-74.9, పులివెందుల-89.5, కమలాపురం-81.9, జమ్మలమడుగు-85.7, ప్రొద్దుటూరు-76.9, మైదుకూరు- 81.3. అలాగే ఇటీవల జరిగిన పోస్టల్ బ్యాలెట్ ఎన్నికల్లో జమ్మలమడుగు, కడపలో 100%, మిగిలిన చోట్ల అంతా 90% పైగా ఓట్లు పోలయ్యాయి. అదే స్ఫూర్తితో ఈసారి ఆ శాతం పెరిగేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.