India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు చేపట్టిన డయల్ యువ కలెక్టర్ కార్యక్రమాన్ని రేపు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శివ శంకర్ తెలిపారు. రేపు ఉదయం 9.30 నుంచి 10.30గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమస్యలను నేరుగా ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని కలెక్టర్ తెలిపారు. వెంటనే అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు.
➤ రాజంపేట: ఇంటిలో అగ్నిప్రమాదం
➤ కడపలో ఆటోలకు పీసీ నంబర్ ఎక్కడ?
➤ కడప: రోడ్డు దాటుతుండగా దూసుకొచ్చిన మృత్యువు
➤ రేపు పుష్పగిరి క్షేత్రంలో గిరి ప్రదక్షిణ
➤ రైల్వే కోడూరు: పిచ్చికుక్క దాడిలో 25 మందికి గాయాలు
➤ కడప: మద్యం బాబులకు ఎస్పీ హెచ్చరిక
➤ రాయచోటి: ‘భర్త అనుమానం ముగ్గురిని బలి తీసుకుంది’
➤ కడప: 206 పోస్టులకు ముగిసిన కౌన్సెలింగ్
➤ కడప జిల్లా వీఆర్లో ఉన్న 15 మంది ఎస్సైలకు పోస్టింగులు
కడపలో ఆటో వారికి రూల్స్ లేవా? అని పలువురు విమర్శిస్తున్నారు. ఆటోకు ఎక్కడైనా ప్రమాదం జరిగితే నంబర్ ప్లేటుతో పాటు పోలీసులు ఇచ్చే PC నంబర్ కీలకం. అయితే కడపలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా కొన్ని ఆటోలకు PC నంబర్ లేకుండా రోడ్డు మీదకు వచ్చేస్తున్నాయి. దీనివల్ల ప్రమాదాలకు గురైనప్పుడు ఆటో ఎవరిది, ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందో తెలుసుకోవాలంటే కష్టం. పోలీసు అధికారులు స్పందించాలని పలువురు కోరుతున్నారు.
దువ్వూరు మండలం కానగూడూరు జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కృష్ణంపల్లెకు చెందిన షేక్ రఫీ (48) అక్కడికక్కడే మృతి చెందాడు. కృష్ణంపల్లెకు చెందిన రఫీ కానగూడూరు వద్ద రోడ్డు దాటుతుండగా కడప నుంచి కర్నూలు వైపు వెళ్తున్న కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఆయన మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వినోద్ కుమార్ తెలిపారు.
రైల్వే కోడూరులో ఒక పిచ్చి కుక్క అందరినీ కరుస్తూ వెళ్ళిపోయింది. చిన్న పిల్లలు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. కొంత మందికి పరిస్థితి తీవ్రంగా ఉండటంతో తిరుపతి ఆసుపత్రికి తరలించారు. చిట్వేల్ రోడ్ గర్ల్స్ హై స్కూల్ , పగడాల పల్లి, గాంధీనగర్, రంగనాయకులపేట ప్రాంతాల్లో కుక్క స్వైర విహారం చేసింది. స్థానికులు కుక్కను కొట్టి చంపారు.
కడప జిల్లాలోని బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు హెచ్చరించారు. ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలోని వివిధ స్టేషన్ల పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. 15 రోజుల్లో 1064 కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
రాయచోటి తొగటవీధిలో తల్లీబిడ్డలు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. గల్ఫ్లో ఉంటున్న రాజా భార్య రమాదేవిపై అనుమానంతో ఇంటికి సీసీ కెమెరాలు అమర్చాడు. దీని కారణంగా భార్యాభర్తల మధ్య శుక్రవారం అర్ధరాత్రి వరకూ ఫోన్లో గొడవ పడ్డారు. దీంతో మనస్తాపానికి గురైన రమాదేవి శనివారం ఉదయం గ్యాస్ లీక్ చేసి, మంట పెట్టుకుని తన ఇద్దరు బిడ్డలు మనోహర్, మన్వితతో కలిసి ఆత్మహత్య చేసుకున్నారని సీఐ చంద్రశేఖర్ వెల్లడించారు.
కడప మండలం చిన్నచౌక్లో 3 ఎకరాలకు పైబడిన ప్రభుత్వ స్థలం క్రమేపీ అన్యాక్రాంతమవుతోందని, భూ పరిరక్షణకు తగు చర్యలు చేపట్టాలని సీపీఐ నగర కార్యదర్శి వెంకట శివ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం కడప తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ నారాయణ రెడ్డికి వినతిపత్రం అందించారు. ఆయన మాట్లాడుతూ.. రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించి రూములు కట్టమంటున్నారన్నారు.
వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ కార్యాలయ పరిధిలో నిర్వహించిన కాంట్రాక్టు స్టాఫ్ నర్సుల నియామకాల ప్రక్రియ శనివారం ముగిసింది. మొత్తం 206 పోస్టులకు గాను రోజుకు 50 మంది చొప్పున కౌన్సెలింగ్ నిర్వహించారు. చివరి రోజు 43 మంది హాజరయ్యారు. నిబంధనల ప్రకారం నియామకాలను విజయవంతంగా పూర్తి చేసినట్లు ఆ శాఖ రీజినల్ డైరెక్టర్ శ్రీనివాసులు తెలిపారు.
జిల్లా ప్రజా పరిషత్ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగుల సాధారణ బదిలీలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని జెడ్పి సీఈవో సుధాకర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 19 నుంచి 31వ తేదీ లోపు సాధారణ బదిలీలు ఉంటాయని తెలిపారు. అర్హులైన ఎంపీడీవోలు, మినిస్ట్రీరియల్, 4వ తరగతి సిబ్బంది, 5 ఏళ్లు పూర్తయిన వారు, రిక్వెస్ట్ బదిలీలకు దరఖాస్తు ఫారాలను సంబంధిత అధికారుల అనుమతితో జిల్లా పరిషత్లో 25వ తేదీ లోపు అందజేయాలన్నారు.
Sorry, no posts matched your criteria.