Y.S.R. Cuddapah

News May 7, 2024

కడప: ఆ రెండు స్థానాల్లో జనసేన కంటే NOTAకే ఎక్కువ ఓట్లు

image

NOTA గురించి అందరికీ తెలిసిందే. అభ్యర్థులకు ఓటర్లు ఓటు వేయదలచుకోనప్పుడు NOTAకు వేయొచ్చు. గత ఎన్నికల్లో రాయచోటి, జమ్మలమడుగు నియోజకవర్గాల్లోని ప్రజలు జనసేన కంటే నోటాకే ఎక్కువ ఓట్లు వేశారు. జమ్మలమడుగులో జనసేన-1038, నోటా- 2260 ఓట్లు పోలవ్వగా, రాయచోటిలో జనసేనకు 1480 మంది ఓటు వేస్తే, నోటాకు ఏకంగా 2226 మంది ఓటు వేశారు. ఈ రెండు స్థానాల్లో ఈసారి జనసేన పోటీలో లేదు.

News May 7, 2024

ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై కేసు నమోదు

image

జమ్మలమడుగు MLA సుధీర్ రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు సీఐ కరుణాకర్ తెలిపారు. ఈనెల 5వ తేదీన జమ్మలమడుగులోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటు వినియోగించుకునేందుకు ఉద్యోగులు బారులు తీరారు. ఆ సమయంలో ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పుకుని లోనికి వెళ్లారు. ఇది ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకం కాగా ఆర్వో శ్రీనివాసులు ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

News May 7, 2024

కమలాపురం: బిల్డింగ్‌పై పడి యువకుడి మృతి

image

కమలాపురం స్టేట్ బ్యాంక్‌ పైనుంచి ప్రమాదవశాత్తు కిందపడి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సూరజ్ కుమార్ మృతి చెందినట్లు ఎస్సై రిషికేశవరెడ్డి తెలిపారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, మహారాజ్ గంజి జిల్లాకు చెందిన సూరజ్ కుమార్ ఎస్బీఐ బ్యాంక్ నందు కార్పెంటర్ పనులు చేస్తున్నాడు. ప్రతిరోజు రాత్రి తన సహచరులతో కలిసి బ్యాంకు పైన నిద్రపోతున్నారు. సోమవారం రాత్రి ప్రమాదవశాత్తు కింద పడడంతో మృతి చెందాడని తెలిపారు.

News May 7, 2024

షర్మిలపై కేసు నమోదు చేసిన బద్వేలు పోలీసులు

image

ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై కేసు నమోదైంది. ఎన్నికల ప్రచారంలో వివేకా హత్యకేసు ప్రస్తావించారనే ఆరోపణలపై బద్వేలు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఎన్నిలు పూర్తయ్యే వరకు వివేకా హత్యపై ప్రచారాల్లో మాట్లాడకూడదని కడప కోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 7, 2024

ముగ్గురు CMలు మొదలు పెట్టిన పూర్తి కాని కడప ఉక్కు పరిశ్రమ

image

కడప జిల్లా ప్రజల దశాబ్దాల కల ఉక్కు పరిశ్రమ ఏర్పాటు. కానీ అది శంకుస్థాపనలకే పరిమితమై, ఆచరణకు నోచుకోలేదు. ఇప్పటి వరకు ముగ్గురు సీఎంలు శంకుస్థాపనలు చేశారు. 2007 జూన్ 10న YSR మొదటగా పరిశ్రమకు శంకుస్థాపన చేశారు. మళ్లీ పదేళ్లకు 2018లో చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఇక మూడోసారి జగన్ 2019 డిసెంబర్ 23న స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారు. దీంతో ఇది ఎప్పుడు పూర్తవుతుందో అని జిల్లా ప్రజలు ఎదురు చూస్తున్నారు.

News May 7, 2024

రాజంపేట ఎంపీ అభ్యర్థి నేను కాదు: నజీర్

image

రాజంపేట పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి తానేనని ప్రజలందరూ అనుకుంటున్నారని, అది నిజం కాదని మాజీ పీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నజీర్ అహ్మద్ స్పష్టం చేశారు. రాయచోటిలో ఆయన మాట్లాడుతూ.. పీసీసీ అధ్యక్షురాలు షర్మిలా రెడ్డి తన స్వార్థ రాజకీయాల కోసం, స్వలాభం కొరకు రాజంపేట పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచే అవకాశం ఉన్న తనని మార్చి పార్టీకి సంబంధం లేని వ్యక్తిని నిలబెట్టారన్నారు.

News May 6, 2024

కడప: పనిచేస్తున్న ప్రదేశంలో ఉపాధి కూలీ మృతి

image

జిల్లాలోని దువ్వూరు మండలం భీమునిపాడులో జక్కయ్య అనే ఉపాధి కూలీ సోమవారం ఉపాధి పనులకు వెళ్లారు. పనిచేస్తున్న ప్రదేశంలో తీవ్ర అస్వస్థతకు గురై గుండెపోటుతో మృతి చెందినట్లు తోటి కూలీలు తెలిపారు. మృతుని కుటుంబాన్ని గ్రామ సర్పంచ్, ఏపీవో వసంత కుమార్, ఈసీ, టెక్నికల్ అసిస్టెంట్ తదితరులు పరామర్శించి, తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.

News May 6, 2024

రాజంపేట: పిచ్చికుక్కలు దాడి.. చిన్నారికి గాయాలు

image

రాజంపేట మున్సిపల్ పరిధిలోని రాంనగర్‌లో చిన్నారిపై పిచ్చికుక్క దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. అనంతరం చిన్నారికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు 108లో రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్థానిక ప్రజలు మాట్లాడుతూ.. రాజంపేట మున్సిపల్ పరిధిలో కుక్కలు సైర విహారం చేస్తున్నాయని అన్నారు. ఇలాంటి ఘటనలు జరుగకుండా ఉండాలంటే మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టాలని ప్రజలు వాపోతున్నారు.

News May 6, 2024

అన్నమయ్య: హజ్ యాత్రికులకు వ్యాక్సినేషన్ క్యాంపులు

image

అన్నమయ్య జిల్లాలో ఈనెల 8, 9వ తేదీల వరకు నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం హజ్ యాత్రికులకు వ్యాక్సినేషన్ క్యాంపులు నిర్వహిస్తున్నామని జిల్లా డి.ఎమ్.హెచ్.ఓ డాక్టర్ కొండయ్య, జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ ఉషశ్రీ సంయుక్తంగా తెలిపారు. ఈ సంవత్సరం జరిగే హజ్ యాత్రలో పాల్గొనే యాత్రికులకు వ్యాక్సినేషన్ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా రెండు కేంద్రాలలో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

News May 6, 2024

కడప ఎయిర్‌పోర్టు వద్ద రోడ్డు ప్రమాదం

image

కడప ఎయిర్‌పోర్టు సమీపాన గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తిని వాహనం ఢీ కొట్టినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కడప రిమ్స్‌కు తరలించారు. వివరాలు తెలియాల్సి ఉంది.