Y.S.R. Cuddapah

News May 6, 2024

కడప: ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తాయి?

image

ఎన్నికలు తుది అంఖానికి చేరుకున్నాయి. మరో 7 రోజుల్లో పోలీంగ్ మొదలవుతుంది. దీంతో నాయకులు పథకాలు, హామీలతో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలోపడ్డారు. గత రెండు ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లాలో YCP పూర్తి పెత్తనం సాగింది. 2014 ఎన్నికలలో 9 స్థానాలు గెలవగా, 2019 ఎన్నికల్లో 10 స్థానాలు కైవసం చేసుకుంది. ఈసారి ప్రధాన పార్టీలైన YCP, TDP కూటమి, కాంగ్రెస్ కడప జిల్లాలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయని అనుకుంటున్నారు?

News May 6, 2024

కడప ఎయిర్‌పోర్టు వద్ద రోడ్డు ప్రమాదం

image

కడప ఎయిర్‌పోర్టు సమీపాన గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తిని వాహనం ఢీ కొట్టినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కడప రిమ్స్‌కు తరలించారు. వివరాలు తెలియాల్సి ఉంది.

News May 6, 2024

కడప: మాట వినకపోతే చంపేస్తా?

image

తన మాట వినకపోతే చంపేస్తానని వైసీపీ నాయకుడు వడ్ల దాదాపీర్ బెధిరిస్తున్నాడని యువతి ఆరోపించారు. ప్రొద్దుటూరుకు చెందిన ఓ యువతి దాదాపీర్ అనే వ్యక్తి ఇంట్లో అద్దెకు ఉండగా మాయమాటలు చెప్పి లైంగికంగా వేధించేవాడని తెలిపారు. పెళ్లి నిశ్చయమైతే పెళ్లి వారికి ఫొటోలు చూపించి బెదిరెంచేవాడని ఆరోపించారు. వేధింపులు తాళలేక ఇల్లు మారితే అక్కడ కూడా ఇలాగే కొనసాగించేవాడని ఆరోపించారు. దీంతో పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు.

News May 6, 2024

కడప: MLA అభ్యర్థి వాహనంపై దాడి

image

ఆదివారం సాయంత్రం ఎమ్మెల్యే అభ్యర్థి వాహనంపై దాడి జరిగింది. మాజీ మంత్రి వివేకా హత్య అప్రూవర్, జై భీంరామ్ భారత్ పార్టీ పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థి దస్తగిరి వాహనంపై పులివెందులలో కొందరు అల్లరి మూకలు దాడి చేశారని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రచార వాహనం ముద్దనూరు మీదగా వెళ్తుండగా, గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. పోలీసులు అల్లరిమూకలను చెదరొట్టారు.

News May 6, 2024

కడప: అధికారులకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం

image

ఎన్నికల విధుల్లో పాల్గొనే పోలింగ్ అధికారులు సోమవారం తమ పోస్టల్ బ్యాలెట్ ఓటు నమోదు చేసుకోవచ్చని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు ఆదివారం తెలిపారు. నేడు పోస్టల్ బ్యాలెట్ నమోదు చేసుకోలేక పోయిన ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, ఓపీఓలు, మైక్రో అబ్జర్వర్లు తమకు కేటాయించిన నియోజకవర్గ ఫెసిలిటేషన్ సెంటర్లలో ఉదయం 7 గం నుంచి ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News May 5, 2024

కడప: అత్యధికంగా రాజంపేటలో పోలింగ్

image

తొలి రోజు పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ముగిసింది. జిల్లాలోని ఆరు నియోజక వర్గాల్లో 70.03 శాతం ఓట్లు పోల్ అయ్యాయి. మొత్తం 14,389 ఓట్లకు గాను 10,077 ఓట్లు పడ్డాయి. అత్యధికంగా రాజంపేట నియోజకవర్గంలో 89.59 శాతం పోలింగ్ జరిగింది. ఆ తరువాత రాయచోటి నియోజకవర్గంలో 81.47 శాతం ఓట్లు వేశారు. మదనపల్లెలో 81.04 శాతం, రైల్వే కోడూరులో 80.70 శాతం ఓట్లు పోల్ అయ్యాయి. రాజంపేటలో 1, 386 ఓట్లు పోల్ అయ్యాయి.

News May 5, 2024

ఖాజీపేట: విద్యుదాఘాతంతో రైతు మృతి

image

ఖాజీపేట మండల పరిధిలోని సిద్ధాంతపురంలో ఆదివారం మధ్యాహ్నం విషాదం చోటు చేసుకుంది. రైతు కందుల రామిరెడ్డి పొలం వెళ్లి విద్యుత్తు మోటారు ఆన్ చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి గల గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 5, 2024

యర్రగుంట్లకు చేరుకున్న కేంద్ర మంత్రి

image

ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు కడప జిల్లాలోని యర్రగుంట్లకు కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ వచ్చారు. ఇందులో భాగంగా కూటమి జమ్మలమడుగు ఎమ్మెల్యే అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి, కడప ఎంపీ అభ్యర్థి భూపేశ్ రెడ్డి తరఫున ఆయన బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.

News May 5, 2024

షర్మిల నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి: రాఘవరెడ్డి

image

షర్మిల నోరు అదుపులో పెట్టుకొని విమర్శలు చేయాలని YSRTP నాయకుడు కొండ రాఘవరెడ్డి మండిపడ్డారు. నిన్న జగన్‌పై షర్మిలా చేసిన వ్యాఖ్యలకు ఇవాళ ఆయన కడపలో కౌంటర్ ఇచ్చారు. వివేకా హత్య కేసులో వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలన్నారు. సీఎంకు అద్దం చూపించడం కాదని.. ఒకసారి మీ ముఖం అద్దంలో చూసుకోవాలన్నారు. తెలంగాణలో మీరు చేసిన అక్రమాలతో వందల కుటుంబాలు నాశనం అయ్యాయన్నారు. వాస్తవాలు త్వరలో బయటపెడతా అన్నారు.

News May 5, 2024

కడప జిల్లాలో వడదెబ్బకు నలుగురి మృతి

image

జిల్లాలో నమోదవుతున్న అత్యధిక ఉష్ణోగ్రతలకు వృద్ధులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. శనివారం ఒక్క రోజే వడదెబ్బతో బి.కోడూరు-గురివిరెడ్డి, చాపాడు-ఓబుళమ్మ, సోగలపల్లె-కొండూరు వెంకటన్న, పోరుమామిళ్ల-వెంకట సుబ్బయ్య, ఖాజీపేట-వెంకటపతి మృతి చెందారు. వడదెబ్బతో వీరు మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. తీవ్ర వడగాలులకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు.