India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్ భాస్కర్ రెడ్డి శనివారం చంచల్ గూడ జైలు నుంచి విడుదలయ్యారు. కోర్ట్ విధించిన షరతులకు ఆయన శుక్రవారం అంగీకారం తెలిపారు. దీంతో శనివారం సాయంత్రం ఆయన విడుదల అయ్యారు.
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాధ్ సింగ్ నేడు కడప జిల్లాకు రానున్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా జమ్మలమడుగు కూటమి అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి తరఫున ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో భద్రత ఏర్పాట్లను పోలీసు అధికారులు పరిశీలించారు. ఇప్పటికే పర్యటనలో భాగంగా రోడ్ షో, బహిరంగ సభ ఏర్పాట్లను సంబంధించి నాయకులు పూర్తి చేశారు.
బద్వేలు మాజీ ఎమ్మెల్యే కమలమ్మ కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలోకి చేరుతుందని వస్తున్న కథనాలు అవాస్తవమని ఆమె అనుచరులు తెలిపారు. ఆమె కేవలం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలవడం జరిగిందని ఏ పార్టీలోకి చేరడం లేదని పేర్కొన్నారు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని ఆ పార్టీని వీడి ఎక్కడికి వెళ్ళమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి షర్మిలారెడ్డి గెలుపు కోసం కృషి చేస్తామన్నారు.
వైఎస్ఆర్ జిల్లాలో ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో భాగంగా చేపట్టే పోలీసు భద్రతా, నిఘా చర్యలను మరింత పటిష్టం చేయాలని రాష్ట్ర ప్రత్యేక పోలీసు పరిశీలకులు దీపక్ మిశ్రా ఎన్నికల నిర్వహణ అధికారులకు సూచించారు. కర్నూలు రేంజ్ డీఐజీ విజయ్ రావు, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.విజయ్ రామరాజు, ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్, జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు కునాల్ సిల్కు సమావేశం నిర్వహించారు.
తర్లుపాడు మండలం నాగేళ్లముడుపులో బీరపోగు సామ్రాజ్యం అనే వృద్ధురాలు మండుతున్న ఎండలు వేడిమి తాళలేక తీవ్ర అస్వస్థకు గురై మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు శనివారం తెలిపారు. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ సుబ్బమ్మ వృద్ధురాలి మృతదేహానికి నివాళులర్పించారు. అప్పటిదాకా ఆరోగ్యంగా ఉన్న సామ్రాజ్యం ఒకసారిగా స్పృహ కోల్పోయి మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
మిడుతూరు పంచాయితీ కి చెందిన మాజీ సర్పంచ్ దొడ్డవాండ్ల వెంకటపతి (75) వడదెబ్బతో మృతిచెందారు. గ్రామస్థులు, బంధువుల వివరాల మేరకు.. ఎండలు ఎక్కువగా వున్న క్రమంలో మృతి చెందినట్లు వారు తెలిపారు. మృతుడికి భార్య ఎర్రక్కతో పాటు కుమారుడు అంకయ్య ఉన్నాడన్నారు. పుట్టా సుధాకర్ యాదవ్ తనయుడు శ్రీనువాసులు సంఘటనా స్థలానికి చేరుకొని సంతాపం తెలిపారు. వెంకటపతి మరణం కుటుంబానికి తీరని లోటన్నారు.
సరిగ్గా మరో నెల రోజుల్లో మీ నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరో తెలిపోనుంది. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్, హోమ్ ఓటింగ్ స్టార్ట్ అవ్వగా.. మే13న పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఓట్ల లెక్కించి ఎమ్మెల్యే ఎవరో ప్రకటిస్తారు. అయితే గత ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లాలో 10 నియోజవర్గాల్లో వైసీపీ అభ్యర్థులే గెలిచారు. మరి ఈసారి మీ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తారో కామెంట్ చెయ్యండి.
కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో రికార్డులు లేని వాహనాలను పోలీసులు భారీగా సీజ్ చేశారు. త్వరలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రొద్దుటూరు సబ్ డివిజన్ పరిధిలో పోలీసులు అన్ని ప్రాంతాలలో కేంద్ర బలగాలతో కలిసి నాకాబందీ నిర్వహించారు. ఈ సందర్భంగా తనిఖీలలో రికార్డులు లేని 92 ద్విచక్ర వాహనాలు, ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ మురళీధర్ నేతృత్వంలో ఈ కవాతు నిర్వహించారు.
కడప నగరం చిన్నచౌక్లోని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ బాలికల పాఠశాలలో 3వ తరగతి నుంచి 9వ తరగతి వరకు 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపల్ పి.విజయలక్ష్మి తెలిపారు. ఈ నెల 20వ తేదీ వరకు అర్హులైన బాలికలు తమ దరఖాస్తులను చిన్నచౌక్ లోని గురుకుల పాఠశాలలో అందచేయాలని ఆమె తెలిపారు. వివరాలకు 9440687844, 8555074045 నంబర్లను సంప్రదించాలని ప్రిన్సిపల్ తెలిపారు.
కడప జిల్లాల్లో 1955లో శాసనసభకు ఎన్నికలు జరగడం మొదలయ్యాయి. అప్పట్లో మన జిల్లాలో మొత్తం 11 నియోజకవర్గాలు ఉన్నాయి. అలా 2004 వరకు కొనసాగాయి. జిల్లాల పునర్విభజన కారణంగా 2004లో ఒక నియోజకవర్గంగా ఉన్న లక్కిరెడ్డిపల్లెను తప్పించారు. ఇందులో ఉన్న మండలాలను రాజంపేట, రాయచోటిలోకి కలపడంతో ఆ నియోజకవర్గం కనుమరుగైంది. ఈ లక్కిరెడ్డిపల్లె మొదటి ఎమ్మెల్యే కడప కోటిరెడ్డి. చివరి ఎమ్మెల్యే జి.మోహన్ రెడ్డి(కాంగ్రెస్).
Sorry, no posts matched your criteria.