India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు యువకుడు మృతి చెందిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాలివీడు మండలంలోని ప్రకాశ్ నగర్ కాలనీకి చెందిన నాగశేషు (23) తన మిత్రులతో కలిసి చేపలు పట్టడానికి కాలనీ సమీపంలోని చెక్ డ్యాం వద్దకు సాయంత్రం వెళ్లారు. చేపలు పట్టే క్రమంలో నీటిలో పడి మృతి చెందారు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై వెంకటప్రసాద్ పేర్కొన్నారు.
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా 13,536 మంది ఉద్యోగ ఉపాధ్యాయులు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.విజయరామరాజు తెలిపారు. శుక్రవారం కడపలోని జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడుతూ.. 14,640 మంది ఉద్యోగుల్లో 13,536 మంది మే 5, 6, 7 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోనున్నట్లు తెలిపారు. డీఆర్ఓ గంగాధర్ గౌడ్ పాల్గొన్నారు.
బద్వేలు పట్టణంలోని 7వ వార్డు అమ్మవారిశాల వీధిలో ఉండే రామయ్య అనే వృద్ధుడు శుక్రవారం పెన్షన్ కోసం మీ సేవ వద్దకు వెళ్లి తిరిగి ఇంటికి చేరుకున్న కాసేపటికి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అలాగే సురేంద్రనగర్ కు చెందిన నాగిపోగు ఎల్లమ్మ అనే మహిళ కూడా పెన్షన్ కోసం బ్యాంకుకు వెళ్లి వచ్చినప్పటి నుంచి తనకు అస్వస్థతగా ఉందంటూ కుటుంబ సభ్యులకు తెలిపిన కొద్దిసేపటికే మృతి చెందినట్లు వారు తెలిపారు.
గత నెల 30వ తేదీన కమలాపురంలో <<13149211>>యువకుడు హత్యకు<<>> గురైన విషయం తెలిసిందే. తాజాగా నిందితులను కమలాపురం పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల మేరకు.. మృతుడు సయ్యద్ మహమ్మద్ ఘనికి ఇందిరమ్మ కాలనీకి చెందిన షేక్ ముబారక్ అనే వ్యక్తికి మధ్య జరిగిన చిన్నపాటి గొడవలే కారణమన్నారు. ముబారక్తో పాటు మరో 9 మంది హత్య కేసులో నిందితులను పందిర్లపల్లె వద్ద డీఎస్పీ షరీఫ్ ఆదేశాలతో అరెస్టు చేసినట్లు తెలిపారు.
18 నుంచి 35 సంవత్సరాల లోపు వయసు గల రాజంపేట యువతీ, యువకులతో శనివారం నారా లోకేశ్ స్వయంగా మాట్లాడుతారని రాజంపేట టీడీపీ ఇన్ఛార్జ్ సుగవాసి బాల సుబ్రహ్మణ్యం తెలిపారు. రాజంపేట మండలం కూచివారిపల్లి పంచాయతీ విద్యానగర్లో శనివారం సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు లోకేశ్ ముఖాముఖి ఉంటుందని తెలిపారు. యువతీ యువకులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరారు.
చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో సూపర్ సిక్స్ పథకాల ద్వారా ప్రజలకు అత్యధిక లబ్ధి చేకూరుతుందని మాజీ ఎమ్మెల్యే కమలమ్మ పేర్కొన్నారు. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సారధ్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో కమలమ్మ చేరారు. కూటమి అభ్యర్థి విజయానికి విశేష కృషి చేస్తానని కమలమ్మ చెప్పారు. కార్యక్రమంలో టీడీపీ నాయకుడు రితేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.
కడపకు ఈనెల 7న కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు రానున్నట్లు సమాచారం. కడప పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో ఉన్న పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, తెలంగాణ CM రేవంత్ రెడ్డి, కర్ణాటక డిప్యూటీ CM డీకే శివకుమార్తో పాటు పలువురు నాయకులు రానున్నట్లు తెలుస్తోంది. కడప మున్సిపల్ మైదానంలో జరిగే భారీ బహిరంగ సభలో వీరు ఎన్నికల ప్రచారం చేయనున్నట్లు ఈ పార్టీ నాయకులు చెబుతున్నారు.
కొండాపురం మండలం వెంకటాపురం వద్ద శుక్రవారం ఉదయం ఇన్నోవా, బైక్ ఢీకొన్న సంఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ముద్దనూరు మండలం తిమ్మారెడ్డి పల్లె గ్రామానికి చెందిన శివ శంకర్ అనే వ్యక్తి బైకులో తన సొంత గ్రామానికి వెళ్తుండగా ఎదురుగా ఇన్నోవా కారు వచ్చి ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. శివశంకర్ అక్కడికక్కడే మృతి చెందగా బైక్లో ప్రయాణిస్తున్న అతని భార్యకు గాయాలవ్వడంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు.
వైవీయూ బీఈడీ, ఎంఈడీ 3 సెమిస్టర్ల పరీక్షా ఫలితాలను వీసీ ఆచార్య చింతా సుధాకర్, కులసచివులు ఆచార్య వెంకటసుబ్బయ్య, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆచార్య ఎన్.ఈశ్వర్ రెడ్డితో కలిసి తన ఛాంబర్ లో గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. ఫిబ్రవరిలో జరిగిన బీఈడీ 3వ సెమిస్టర్ పరీక్షలలో 84.58 శాతం, ఎంఈడీ థర్డ్ సెమిస్టర్ పరీక్షల్లో 85.94 శాతం మంది ఉత్తీర్ణత సాధించారని తెలిపారు.
దువ్వూరు మండలం నేలటూరు గ్రామానికి చెందిన మైలా ఏసన్న (53) అనే వ్యక్తి గురువారం వడదెబ్బ తగిలి మృతి చెందాడు. ఏసన్న ప్రొద్దుటూరులోని ఓ ఆయిల్ మిల్లులో కూలి పనులకు వెళ్లి జీవనం సాగించేవాడు. ఈ క్రమంలో గురువారం కూలి పనికి ప్రొద్దుటూరుకు వెళ్లాడు. మధ్యాహ్నం ఎండ తీవ్రతకు వడదెబ్బ తగిలి ఏసన్న స్పృహ తప్పడంతో తోటి కూలీలు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అతనిని డాక్టర్ పరీక్షించి మృతి చెందాడని తెలిపారు.
Sorry, no posts matched your criteria.