Y.S.R. Cuddapah

News May 1, 2024

రేపు కడపలో చంద్రబాబు ప్రజాగళం సభ

image

టీడీపీ అధినేత చంద్రబాబు రేపు కడప రానున్నారు. రేపు సాయంత్రం 5.30 గంటలకు కడప గోకుల్ లాడ్జి సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన ప్రజా గళం బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించనున్నారు. ఇప్పటికే జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు కడపకు రానుండటంతో సీఎం ఇలాకాలో జగన్‌పై ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారనే ఆసక్తి నెలకొంది.

News May 1, 2024

కడప పార్లమెంట్ నియోజకవర్గంలో త్రిముఖ పోరు

image

కడప పార్లమెంట్ ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆసక్తిని రెకెత్తిస్తున్నాయి. ఎంపీ అవినాశ్ రెడ్డిపై ప్రధానంగా షర్మిల, భూపేష్ రెడ్డి బరిలో నిలిచారు. విమర్శలతో ప్రచారాలు వాడి వేడిగా సాగుతున్నాయి. దీంతో కడప ఎంపీగా గెలిచేది ఎవరనే ఆసక్తి అందరిలో నెలకొంది. జగన్‌పై వ్యతిరేక ఓటును షర్మిల చీల్చే అవకాశం ఉందని జిల్లా నేతలు చర్చించు కుంటున్నారు. దీంతో కడపలో ఈ సారి త్రిముఖ పోరు తప్పదని విశ్లేషకులు అంటున్నారు.

News May 1, 2024

లోకేశ్ పర్యటన ఈ నెల 5కు వాయిదా

image

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ రాజంపేట పర్యటన 5కు వాయిదా పడినట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ముందుగా నిర్ణయించిన మేరకు 2న ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉంది. అదే రోజు చంద్రబాబు రాయచోటి, కడపలో ప్రచారం చేయనున్నారు. దీంతో పార్టీ నేతలంతా అధినేత పర్యటనకు హాజరు కావల్సి ఉంటుంది. ఇదే విషయాన్ని పార్టీ జిల్లా అధ్యక్షుడు జగన్ అగ్రనేతల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పర్యటన వాయిదా పడింది.

News May 1, 2024

కొండాపురం: వడదెబ్బతో యువకుడి మృతి

image

కొండాపురం మండలం బురుజుపల్లెకు చెందిన రాచుమల్లు మల్లారెడ్డి (30) వడ దెబ్బతో మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకొంది. స్థానికుల వివరాల మేరకు..  గ్రామానికి చెందిన శివమల్లారెడ్డి మంగళవారం ఉదయం తోటకు వెళ్లే దారిలో ఎండ తీవ్రతకు స్పృహ కోల్పోయాడు. తాడిపత్రి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

News May 1, 2024

ఎన్నికలకు సన్నద్ధం కావాలి: ఎంపీ అవినాశ్‌రెడ్డి

image

మే 13 జరిగే ఓటింగ్ విషయంలో ఏ చిన్న పొరపాటు చేయవద్దని వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి వైఎస్ అవినాశ్‌రెడ్డి కార్యకర్తలకు సూచించారు. మంగళవారం స్థానిక భావసార క్షత్రియులు (రంగరాజులు), ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా అవినాశ్‌రెడ్డి మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డి అజెండా ప్రజా సంక్షేమమే అన్నారు. పేద బడుగు బలహీన వర్గాల కోసం నేడు పెత్తందారులతో పోరాడుతున్నాడని తెలిపారు.

News April 30, 2024

కడప : డిగ్రీ పరీక్షల్లో 8 మంది డిబార్

image

YVU డిగ్రీ పరీక్షలను వీసీ ప్రొ చింతా సుధాకర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొ. ఎన్.ఈశ్వర్ రెడ్డితో కలిసి బ్రహ్మంగారిమఠం, పుల్లంపేట డిగ్రీ కళాశాలను సందర్శించారు. దీనిలో భాగంగా కాపీలు రాస్తున్న నలుగురు విద్యార్థులను డిబార్ చేశారు. ప్రతి కేంద్రంలో తాగునీరు, ఫ్యాన్లు, టాయిలెట్ వసతి ఉండాలని ఆదేశాలు ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా మరో నలుగురు విద్యార్థులు డిబారయ్యారు.

News April 30, 2024

కడపలో అత్యధికంగా 32 నామినేషన్లు తిరస్కరణ

image

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సోమవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. అయితే జిల్లాలో అత్యధికంగా కడప నియోజకవర్గంలో 32 నామినేషన్లను తిరస్కరించినట్లు ఎన్నికల అధికారి మధుసూదన్ పేర్కొన్నారు. అత్యల్పంగా మైదుకూరు నియోజకవర్గంలో 7 నామినేషన్లు తిరస్కరించారు. వాటితో పాటు కమలాపురంలో 24, ప్రొద్దుటూరులో 15, బద్వేల్ లో 14, జమ్మలమడుగులో 12 పులివెందులలో 10 నామినేషన్లను తిరస్కరించినట్లు తెలిపారు.

News April 30, 2024

కమలాపురంలో యువకుని దారుణ హత్య

image

కమలాపురంలో ఓ యువకుడిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేసిన ఘటన మంగళవారం వేకువజామున జరిగింది. పోలీసుల కథనం మేరకు.. కమలాపురం పక్కీరి వీధిలో నివాసం ఉంటున్న మహమ్మద్ ఘని (26)ని గుర్తు తెలియని దుండగలు ఇంట్లోకి చొరబడి విచక్షణా రహితంగా కత్తులతో హత్యచేసినట్లు తెలిపారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు సీఐ రామకృష్ణారెడ్డి, SI హృషికేషవరెడ్డి కేసు నమోదు చేసి, దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

News April 30, 2024

నేడు సీఎం జగన్ కడప జిల్లా పర్యటన వివరాలు

image

సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు మైదుకూరుకు రానున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు ఆయన పర్యటన వివరాలను వెల్లడించారు. ఉ. 9.40 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 10.45కు ప్రకాశం జిల్లా టంగుటూరు చేరుకొని బహిరంగ సభలో పాల్గొననున్నారు. అక్కడి నుంచి 12.45కి మైదుకూరుకు హెలికాప్టర్లో రానున్నారు. 12.55గం.కు సభాస్థలికి చేరుకుని 1.10-1.55 గంటల వరకు కొనసాగించనున్నారు. 2.10గం.కు అన్నమయ్య జిల్లాకు బయలుదేరుతారు.

News April 30, 2024

ఎన్నికల నిబంధనలు తప్పకుండా పాటించాలి: కలెక్టర్

image

కేంద్ర ఎన్నికల సంఘం నియమ నిబంధనలను తూచా తప్పక పాటిస్తూ నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుందని కడప జిల్లా కలెక్టర్ వి.విజయరామరాజు రాజకీయ పార్టీల ప్రతినిధులు, బరిలో నిలిచిన అభ్యర్థులకు సూచించారు. కలెక్టర్ కార్యాలయంలో రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఉపసంహరణ అనంతరం.. బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితాను, వారికి కేటాయించిన పార్టీ గుర్తుల జాబితాను కూడా తెలియజేయడం జరిగిందన్నారు.