Y.S.R. Cuddapah

News April 29, 2024

కడప: స్ట్రాంగ్ రూమ్ కౌంటింగ్ కేంద్రంగా ఉర్దూ యూనివర్సిటీ

image

జిల్లాలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రంగా జాతీయ ఉర్దూ యూనివర్సిటీని ఎంపిక చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ విజయరామరాజు తెలిపారు. కడప శివారులోని రిమ్స్ ప్రభుత్వాసుపత్రి వద్ద ఉన్న మౌలానా అబుల్ కలాం జాతీయ ఉర్దూ యూనివర్సిటీ(MAANU)ను ఎన్నికల సంఘం సిఫార్సు మేరకు ఎంపిక చేసామన్నారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు సిద్ధం చేశామన్నారు.

News April 29, 2024

జిల్లాలో పులివెందుల టాప్.. బరిలో 27 మంది

image

కడప జిల్లాలో ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ పడుతున్న నియోజకవర్గాల్లో పులివెందుల టాప్‌లో నిలిచింది. ఇక్కడ మొత్తం 27 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం 53 నామినేషన్లు దాఖలు కాగా, 10 నామినేషన్లు తిరస్కరించామని, 10 నామినేషన్లు ఉపసంహరించుకున్నారని చెప్పారు. దీంతో 27 మంది అభ్యర్థులు ఎన్నికల పోటీలో ఉన్నారు. దీంతో సీఎం జగన్ పై ఇక్కడ 26 మంది పోటీ పడుతున్నారు.

News April 29, 2024

కడప: వైసీపీలోకి కాంగ్రెస్ నేత నజీర్ అహ్మద్

image

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నజీర్ అహ్మద్ ఆ పార్టీని వీడారు. వైఎస్ షర్మిల వచ్చాక కాంగ్రెస్ పార్టీలో తనకు జరిగిన అవమానాన్ని భరించలేక, మనస్తాపంతో కాంగ్రెస్ పార్టీని వీడి వైసీపీలో చేరానన్నారు. ఆయనకు అవినాశ్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి అంజాద్ బాషా, మేయర్ సురేశ్ బాబులు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్‌లో ఉన్న తనను అవమానపరిచారని ఆరోపించారు.

News April 29, 2024

కడప పార్లమెంట్ పరిధిలో ఫైనల్ అభ్యర్థుల వివరాలు

image

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కడప పార్లమెంటు స్థానానికి ఫైనల్ అభ్యర్థుల వివరాలను జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి విజయరామరాజు తెలిపారు. మొత్తం 47 నామినేషన్లు దాఖలు కాగా 20 నామినేషన్లు పరిశీలనలో తిరస్కరించామని, చివరకు 14 మంది ఎన్నికల పోటీలో నిలిచారన్నారు. ప్రధాన పార్టీలైన వైసీపీ నుంచి వైఎస్ అవినాశ్‌రెడ్డి, టీడీపీ నుంచి భూపేశ్‌రెడ్డి, కాంగ్రెస్ తరఫున వైఎస్ షర్మిల ఎన్నికల బరిలో ఉన్నారన్నారు.

News April 29, 2024

కడప: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య

image

కడప జిల్లాలో సోమవారం విషాదం నెలకొంది. వల్లూరులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు కుటుంబ కలహాలతో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 29, 2024

సిద్దవటం: వడదెబ్బతో యువకుడి మృతి

image

సిద్దవటం మండలంలో వడదెబ్బకు గురై నాగేంద్ర అనే యువకుడు మృతి చెందిన సంఘటన ఆదివారం జరిగింది. లింగంపల్లికి చెందిన నాగేంద్ర పనులు ముగించుకొని ఆటోలో వెళుతుండగా స్పృహ కోల్పోయి పడిపోయాడు. స్థానికులు గుర్తించి చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

News April 29, 2024

మే 2న జిల్లాకు రానున్న చంద్రబాబు, లోకేశ్

image

ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వచ్చే నెల 2న రాయచోటి, కడపకు రానున్నారు. మధ్యాహ్నం రాయచోటిలో జరిగే బహిరంగసభలో పాల్గొననున్న చంద్రబాబు సాయంత్రం కడప నగరానికి చేరుకుని రోడ్ షోలో పాల్గొని ప్రజాగళం బహిరంగసభలో ప్రసంగించనున్నారు. ఆయనతో పాటు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ రానున్నారు. యువతతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు.

News April 29, 2024

కడప: నంది వాహనంపై రామలింగేశ్వర స్వామి

image

ప్రొద్దుటూరు రామేశ్వరంలోని శ్రీముక్తి రామలింగేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆదివారం స్వామి, రాజరాజేశ్వరి దేవీకి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు చేశారు. రాత్రి గంగా రాజరాజేశ్వరి సమేత ముక్తి రామలింగేశ్వర స్వామి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి నంది వాహనంపై ఆశీనులు చేశారు. భక్తులు స్వామివారిని పురవీధుల్లో ఊరేగించారు.

News April 28, 2024

BREAKING: కడప-తాడిపత్రి హైవేపై రోడ్డు ప్రమాదం

image

కడప-తాడిపత్రి ప్రధాన రహదారిలోని వల్లూరు మండలం తోల్లగంగనపల్లె సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. కడప నుంచి కమలాపురం వైపు బైక్‌లో వెళుతున్న వ్యక్తిని లారీ ఢీకొట్టింది. దీంతో అతడు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

News April 28, 2024

ఎన్నికలు స్వేచ్ఛగా జరగాలి: ఎస్పీ సిద్ధార్థ కౌశల్

image

ఎన్నికల్లో క్రిటికల్ పోలింగ్ కేంద్రాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఆదేశించారు. చింతకొమ్మదిన్నె మండలం ఊటుకూరులోని అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాలలో కమలాపురం నియోజకవర్గానికి సంబంధించిన పోలీసు అధికారులు, సిబ్బందికి ఎన్నికల నేపథ్యంలో అమలు చేయాల్సిన కార్యాచరణ ప్రణాళికపై ఆదివారం దిశా నిర్దేశం చేశారు. ఎన్నికలు స్వేచ్ఛగా జరిగేలా చూడాలన్నారు.