Y.S.R. Cuddapah

News April 27, 2024

రైల్వేకోడూరు: YCPలోకి జనసేన కీలక నేతలు

image

రైల్వేకోడూరులోని స్థానిక వైసీపీ కార్యాలయం నందు శుక్రవారం సాయంత్రం జనసేన రాయలసీమ జోనల్ ఇన్‌ఛార్జ్ కుప్పాల జ్యోతి, కుప్పాలా కిరణ్, వీపీఆర్ కండ్రిక మాజీ సర్పంచ్ సుబ్బరామరాజు వైసీపీలోకి చేరారు. వీరికి ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ సలహా మండల ఛైర్మన్ సుకుమార్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

News April 26, 2024

కడప MP బరిలో 14 మంది ఆశావాహులు

image

కడప నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో నిలిచిన తుది అభ్యర్థుల జాబితాను అధికారులు ప్రకటించారు. శుక్రవారం నామినేషన్ల పరిశీలన అనంతరం మొత్తం 14 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో వైసీపీ నుంచి అవినాశ్, కూటమి నుంచి భూపేశ్, కాంగ్రెస్ నుంచి షర్మిలతో ఇతర పార్టీలకు చెందిన 11 మంది బరిలో నిలిచారు. మరోవైపు ముగ్గురు స్వతంత్రులు బరిలో నిలిచారు. మొత్తం 32 మంది పోటీ పడగా 18 మంది నానినేషన్లు తిరస్కరించారు.

News April 26, 2024

కడప జిల్లాలో బెంబేలెత్తిస్తున్న ఎండలు 

image

4 రోజులుగా జిల్లాలో ఎండ తీవ్రత పెరగడంతో జనాలు రోడ్డు మీదికి రావడానికి భయపడుతున్నారు. జిల్లాలో 40 నుంచి 44 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాజంపేట, చిట్వేల్, దువ్వూరు, ముద్దనూరు, పెనగలూరు, పుల్లంపేట, ఎర్రగుంట్ల, వల్లూరు మండలాల్లో 44 డిగ్రీలు, చెన్నూర్, పెండ్లిమర్రిలో 43 డిగ్రీలు, గాలివీడు, లింగాల, మైలవరం, సంబేపల్లెలో 42 డిగ్రీలు, రాజుపాలెం 41, తొండూరులో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News April 26, 2024

కమలాపురం: విద్యుదాఘతంతో వ్యక్తి మృతి

image

విద్యుత్‌ షాక్‌‌తో ఒకరు మృతి చెందిన ఘటన శుక్రవారం పెద్ద చెప్పలిలో జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. పెద్దచెప్పలిలోని పంచర్ బంకుకు విద్యుత్ సరఫరా కావడంతో అన్వర్ భాష(36) షాక్‌ తగిలి స్పృహ కోల్పోయాడు. స్థానికులు గమనించి హాస్పిటల్ కు తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 26, 2024

ఎర్రగుంట్ల: పట్టాలు దాటుతుండగా వ్యక్తి మృతి

image

పెద్దముడియం మండలం చిన్నపసుపులకి చెందిన గొల్ల శ్రీనివాసులు భార్య తులసి పిల్లలతో కలిసి పుట్టినిల్లైన విజయనగరం వెళ్ళింది. వారికోసం వెళ్లిన శ్రీనివాసులు ఇంటికి వచ్చే క్రమంలో గురువారం అందరితో కలిసి నంద్యాలలో ధర్మవరం రైలు ఎక్కారు. జమ్మలమడుగులో దిగాల్సి ఉండగా మరిచిపోయి ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్ లో దిగారు. అక్కడి నుంచి బయటకు వెళ్లే క్రమంలో పట్టాలు దాటుతుండగా ఎక్స్ప్రెస్ రైలు ఢీకొని మృతి చెందాడు.

News April 26, 2024

మరోసారి కడప జిల్లాకు సీఎం జగన్

image

ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ మరోసారి కడప జిల్లాలో పర్యటించనున్నారు. 30వ తేదీ మైదుకూరులో ఎన్నికల సభ నిర్వహించనున్నారు. కాగా గురువారం పులివెందులలో జగన్ నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. జగన్ పర్యటనకు YCP శ్రేణులు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. జగన్ సొంత ఇలాఖాలో మరోసారి పూర్తి పట్టు సాధించాలని చూస్తున్నారు. అటు టీడీపీ కూడా ఈసారి కడప జిల్లాలో మెజార్టీ స్థానాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది.

News April 26, 2024

కడప: వివాహిత అనుమానాస్పద మృతి

image

ఒంటిమిట్ట సచివాలయంలో సర్వేయర్‌గా పనిచేస్తున్న సాయికుమార్, రాచగుడిపల్లె సచివాలయంలో పనిచేస్తున్న ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీనిపై తండ్రి లింగన్న కుమారుడిని మందలించాడు. పెద్దల సమక్షంలో ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చారు. గురువారం ‘మీ కుమార్తె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని’ సాయికుమార్ తండ్రి లతిక తండ్రికి ఫోన్ చేశాడు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు సీఐ రామచంద్ర తెలిపారు.

News April 25, 2024

మైదుకూరు: గుండెపోటుతో ఉపాధి కూలి మ‌ృతి

image

మైదుకూరు మండలం గంజికుంట పంచాయతీ లెక్కలవారిపల్లెలో గురువారం ఉపాధి కూలి గవ్వల పెద్దబాలుడు (62)ఎండ తీవ్రతతో అస్వస్థకు గురై మృతి చెందాడు. పెద్ద బాలుడు ఉపాధి పనులు చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఎండ తీవ్రతతో అస్వస్థతకు గురైన ఆయన గుండెపోటుతో మృతి చెందాడని కూలీలు భావిస్తున్నారు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుని కుటుంబాన్ని ఉపాధి ఏపీఓ రామచంద్రారెడ్డి పరామర్శించారు.

News April 25, 2024

రాజంపేట వాసులకు కీలక హామీలు ఇచ్చిన చంద్రబాబు

image

రాజంపేట ప్రజాగళం సభలో TDP అధినేత చంద్రబాబు రాజంపేట వాసులకు కీలక హామీలు ఇచ్చారు. ‘రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయడం. అన్నమయ్య ప్రాజెక్ట్, పింఛా ప్రాజెక్టులు పూర్తి చేసి బాధితులకు న్యాయం చేయడం. మాచుపల్లి బ్రిడ్జీ, ఓబిలి-టంగుటూరు బ్రిడ్జీని పూర్తి చేయడం. జర్రికోట ప్రాజెక్ట్ నుంచి సుండుపల్లికి తాగునీరు, సాగునీరు ఇవ్వడం. గాలేరు, నగరి కాలువ పనులను పూర్తి చేయడం తమ బాధ్యత’ అని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

News April 25, 2024

ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల్లో అపశృతి.. తప్పిన ప్రమాదం

image

ఒంటిమిట్ట శ్రీకోదండ రామ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం చక్రస్నానం జరిగింది. ఈ కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన చలువ పందిళ్లు కుప్పకూలాయి, చక్రస్నాం అయిపోయిన అరగంట తర్వాత పందిరి కూలిపోవడం, అక్కడ భక్తులు ఎవ్వరూ లేక పోవడంతో ప్రమాదం తప్పింది. దీంతో టీటీడీ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.