India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కడప జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని కడప జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశించారు. కడప నగరంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. అధికారులకు ఫిర్యాదులను పంపిస్తూ వాటిని విచారించి సత్వరమే ప్రజలకు న్యాయం చేయాలని సూచించారు.

పులివెందుల నియోజకవర్గ పరిధిలోని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించినట్లు ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఉదయం ఎమ్మెల్సీ స్వగృహంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ప్రజలు వారి సమస్యలను అర్జీల రూపంలో ఎమ్మెల్సీకి వివరించారు. ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు.

ఉమ్మడి కడప జిల్లాలోని పలు మండలాలకు Way2News రిపోర్టర్లను ఆహ్వానిస్తోంది. ఏదైనా ఛానల్, పేపర్లో పనిచేస్తున్నవారు, గతంలో ఏదైనా ఛానల్, పేపర్లో పని చేసి మానేసిన వారు అర్హులు. ఈ <

పులివెందుల మండలంలోని నల్లపురెడ్డి పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1984-85 పదవ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు వారి గురువులను సత్కరించారు. వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకొని అక్కడే ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే ఈ సమావేశానికి గుర్తుగా స్కూల్ ఆవరణంలో మొక్కలను నాటారు.

ఉమ్మడి కడప జిల్లాలో పనిచేస్తున్న ఫారెస్ట్ రేంజ్ అధికారులను బదిలీ చేస్తూ చీఫ్ ఫారెస్ట్ కన్జర్వేటర్ అధికారి చిరంజీవి చౌదరి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. బద్వేల్లో పనిచేస్తున్న రమణారెడ్డిని కర్నూలుకు బదిలీ చేశారు. కడప నుంచి నయీమ్ అలీని బద్వేల్కి, పీలేరు నుంచి రామ్ల నాయక్, వెంకటరమణను తిరుపతికి, రాజంపేట నారాయణ పలమనేరుకు, రాజంపేట రఘు శంకర్ను తిరుపతికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

కడప జిల్లా మాధవరం -1 పార్వతిపురం గంగమ్మ గుడి దగ్గర రోడ్డు దాటుతున్న నారాయణ సుబ్బలక్ష్మమ్మ అనే మహిళ రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. అదే గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి అనే యువకుడు శనివారం రాత్రి బైక్పై వేగంగా వచ్చి ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆమెను కడప రిమ్స్కు తరలించగా చనిపోయిందని డాక్టర్లు ధ్రువీకరించారు. పోలీస్లు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కడప- తాడిపత్రి ప్రధాన జాతీయ రహదారి సమీపంలోని బొందలకుంట గ్రామంలో శనివారం సినీ ఫక్కిలో దొంగతనం జరిగింది. వివరాల్లోకి వెళితే.. బొందకుంట రహదారిలో బైక్పై వెళ్తున్న అదే గ్రామానికి చెందిన మంగపట్నం పుల్లయ్య, సుబ్బమ్మలను పోలీసులమని చెప్పి ఆపి.. వారి వద్ద ఉన్న బంగారు చైను, ఉంగరం అపహరించుకుపోయారు. విషయం తెలుసుకున్న ముద్దనూరు సీఐ దస్తగిరి, SI మైనుద్దీన్లు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

కడప జిల్లాలో గత అర్థరాత్రి దొంగలు రెచ్చిపోయారు. <<14163272>>కడప నగరంతోపాటు ఒంటిమిట్ట<<>> ఎటీఎంలలో కూడా చోరికి పాల్పడ్డారు. ఒంటిమిట్ట ప్రధాన రహదారిపై బస్టాండ్ వద్ద ఉన్న ఎటీఎంను గత అర్థరాత్రి దొంగలు పగులగొట్టారు. విషయం తెలుసుకున్న ఒంటిమిట్ట పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. అక్కడ కూడా దాదాపు రూ.36 లక్షల మేర నగదు చోరికి గురైనట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.

స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్-2047 ఆశయ సాధనలో భాగంగా కడప జిల్లా ఆర్థికాభివృద్ధికి లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందడుగు వేయాలి జిల్లా కలెక్టర్ శివశంకర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో అన్ని శాఖల జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సీఎం చంద్రబాబు దూర దృష్టితో విజన్ ఆంధ్ర @2047 తీసుకురావడం జరిగిందన్నారు. కీలక రంగాలపైన దృష్టి సారించి జిల్లా అభివృద్ధి ప్రణాళికను రూపొందించాలన్నారు.

అందరికి న్యాయం అందాలని, న్యాయ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించాలని హై కోర్ట్ జస్టిస్ రామకృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. కడప పోలీస్ పెరేడ్లోని మీటింగ్ సమావేశంలో జిల్లా స్థాయి జుడీషియల్ అధికారుల వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ శివశంకర్, ఎస్పీ హర్షవర్ధన్ రాజు హాజరయ్యారు. అమలవుతున్న యాక్ట్స్పై న్యాయవాదులు నిబద్ధతతో చట్టాలను అమలు చేయాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.