Y.S.R. Cuddapah

News September 21, 2024

కోడూరు: మృత్యువుతో పోరాడి చిన్నారి మృతి

image

ఓ చిన్నారి మూడు రోజుల పాటు మృత్యువుతో పోరాడి చనిపోయింది. తల్లిదండ్రుల వివరాల ప్రకారం.. రైల్వే కోడూరుకు చెందిన కొక్కంటి మహేశ్ మూడు రోజుల క్రితం తండ్రి పెద్ద కర్మ పనుల్లో ఉన్నాడు. ఈ క్రమంలో మహేశ్ కూతురు లాస్య(4) ప్రమాదవశాత్తు వంట పాత్రలో పడింది. గమనించిన బంధువులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న MLA శ్రీధర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.

News September 21, 2024

పెనగలూరు: పోరాడి ప్రియుడిని పెళ్లి చేసుకుంది

image

ప్రేమించిన ప్రియుడి కోసం ఓ యువతి పోరాడి సాధించింది. పెనగలూరు మండలం ఈటిమార్పురానికి చెందిన పొసలదేవి లావణ్యను ప్రేమించిన యువకుడు బైర్రాజు వెంకట సాయి వివాహం చేసుకున్నారు. తనను ప్రేమించి పెళ్లికి నిరాకరిస్తున్నాడని పురుగు మందు తాగి చచ్చిపోతానంటూ లావణ్య పెనగలూరు పోలీస్ స్టేషన్ ఎదుట శుక్రవారం బైఠాయించింది. అయితే ఎట్టకేలకు రాజంపేటలో పెద్దల సమక్షంలో వెంకట సాయి లావణ్యను పెళ్లి చేసుకోవడంతో కథ సుఖాంతమైంది.

News September 21, 2024

వైద్య సేవలో కడప జిల్లాకు ఏ గ్రేడ్

image

ఆగస్టు నెలలో జిల్లా వ్యాప్తంగా ప్రజలకు వైద్య సేవలు అందించుటలో కడప జిల్లా ఏ గ్రేడ్ సాధించినట్లు డీఎంహెచ్‌వో డాక్టర్ నాగరాజు పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వైద్య సేవలు తీసుకున్న వారు, చికిత్స కోసం ఆసుపత్రిలో చేరిన వారు, సాధారణ ప్రసవాలు, రక్తపరీక్ష తదితర విభాగాలలో ఆరోగ్య సేవలు అందించే విధానంలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానం పొందినట్లు వెల్లడించారు.

News September 21, 2024

సంబేపల్లి వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

image

సంబేపల్లి మండలం బావులకాడపల్లి వద్ద బొలెరో, ఇన్నోవా, ఆటోలు ఢీకొనడంతో డ్రైవర్ జాఫర్ (48) మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కారులో ప్రయాణిస్తున్న కర్ణాటక రాష్ట్రం రాయచోటికి చెందిన ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. రెండు వాహనాలను తప్పించే ప్రయత్నంలో ఆటో నుజ్జు నుజ్జు అయింది. క్షతగాత్రులను సంబేపల్లి పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News September 21, 2024

బద్వేల్: ఆత్మహత్యకు కారణమైన ఆరుగురికి జైలు శిక్ష

image

పదేళ్ల క్రితం కలసపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ పంద్యాల వెంకట లక్ష్మమ్మ (38)ను ఇబ్బంది పెట్టి ఆత్మహత్య చేసుకునేలా చేసిన ఆరుగురికి శిక్ష పడింది. ఆ కేసు విషయంలో విచారణ జరిపిన బద్వేలు కోర్టు ఆధారాలు నిరూపితం కావడంతో ఆరుగురికి శుక్రవారం మూడేళ్ల జైలు శిక్ష, రూ.500 జరిమానా విధిస్తూ జడ్జి పద్మశ్రీ శుక్రవారం తీర్పు ఇచ్చారని, కలసపాడు ఎస్సై చిరంజీవి తెలిపారు.

News September 21, 2024

కడప: తిరుపతి సోలాపూర్ రైలు గడుపు పెంపు

image

కడప రైల్వే స్టేషన్ మీదుగా ప్రయాణించే సోలాపూర్-తిరుపతి- సోలాపూర్ (01437/01438) మధ్య నడుస్తున్న ప్రత్యేక రైలు గడువును, డిసెంబరు 27వ తేదీ వరకు పొడిగించినట్లు కడప రైల్వే సీనియర్‌ కమర్షియల్‌ ఇన్‌స్పెక్టర్‌ జనార్దన్‌ తెలిపారు. సోలాపూర్-తిరుపతి (01437) రైలును ఈనెల 26వ తేదీ వరకు నడపాల్సి ఉండగా డిసెంబరు 27వ తేదీ వరకు పొడిగించారన్నారు. కడప ఎర్రగుంట్ల స్టాపింగ్ సౌకర్యం కల్పించినట్లు చెప్పారు.

News September 21, 2024

రాజంపేట: ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ సదస్సులో పాల్గొన్న అభిషేక్ రెడ్డి

image

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉన్నత విద్యా సంస్థల మధ్య గ్లోబల్ లర్నింగ్ అనుభవాలను పెంచుకోవడమే లక్ష్యంగా రాజంపేట అన్నమాచార్య విశ్వవిద్యాలయ ప్రో ఛాన్సలర్ అభిషేక్ రెడ్డి ఈ నెల 18, 19 తేదీలలో ఫ్రాన్స్ పర్యటన చేశారు. యూరోపియన్ అసోసియేషన్ ఫర్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ (EAIE) సదస్సులో ఆయన పాల్గొన్నారు. భారత కాన్సులేట్ జనరల్ ప్రతినిధులు ఆయనకు “ఫ్లాగ్ బేరర్ ఆఫ్ ఇండియన్ హయ్యర్ ఎడ్యుకేషన్” అనే సర్టిఫికేట్ అందజేశారు.

News September 20, 2024

కడప: గంజాయి విక్రయాలపై దాడులు

image

కడపలో గంజాయి విక్రయాలపై పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు. తాజాగా 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి విక్రయిస్తున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. సీఐ నాగార్జున తెలిపిన వివరాల ప్రకారం.. మాసాపేటలోని హిందూ స్మశాన వాటిక సమీపంలో గంజాయి విక్రయాలు చేస్తున్నట్లు వచ్చిన సమాచారంతో వెళ్లి దాడులు నిర్వహించామన్నారు. వీరి వద్ద నుంచి 4.1 కేజీల గంజాయి, 1000 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు.

News September 20, 2024

కడప జిల్లాకు పవర్ లిఫ్టింగ్‌లో పతకాల పంట

image

ఆర్కే వ్యాలీ IIIT పవర్ లిఫ్టింగ్ టీం కడప జిల్లా తరఫున ఇటీవల అమలాపురంలో జరిగిన ఏపీ 11వ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచింది. టీమ్ చాంపియన్షిప్‌ సబ్ జూనియర్ విభాగంలో గర్ల్స్ ఫస్ట్ ప్లేస్, బాయ్స్ సెకండ్ ప్లేస్ కైవసం చేసుకున్నారు. మొత్తం 8 బంగారు, 7 రజిత, 1 కాంస్య పతకాలు సాధించారు. ఇందులో అమ్మాయిలు 6 బంగారు, 4 రజిత, 1 కాంస్య, అబ్బాయిలు 2 బంగారు, 3 రజిత పతకాలు సాధించారు.

News September 20, 2024

బ్రోకర్లు వైసీపీని వీడటం మంచిదే: మిథున్ రెడ్డి

image

వైసీపీలో ప్రస్తుతం రాజీనామాల పర్వం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డి కుమారుడు, రాజంపేట ఎంపీ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘బ్రోకర్లు, స్క్రాప్ లాంటి నాయకులు పార్టీని విడిచిపెట్టి వెళ్లిపోవడం మనకి చాలా మంచిది. ఇప్పుడు ఉండే నాయకులు, కార్యకర్తలు గట్టిగా పనిచేస్తే మనకు కచ్చితంగా పూర్వవైభవం వస్తుంది. ఆ దిశగా అందరం పనిచేద్దాం’ అని మిథున్ రెడ్డి పిలుపునిచ్చారు.