India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తెలుగుగంగ కాలువలో నేడు కృష్ణమ్మ పరవళ్లు తొక్కనుంది. అధికారుల వివరాల ప్రకారం.. నేటి మధ్యాహ్నానికి జిల్లా సరిహద్దు 98,260 కి.మీ వద్దకు నీరు చేరుతుందన్నారు. అయితే 2వ తేదీన వెలుగోడు జలాశయం నుంచి తెలుగు గంగకు నీరు విడుదల చేయగా.. కాలువ వెంట నీరు పరుగులు తీస్తోంది. 67వ KM వద్ద 2,700 క్యూసెక్కులు ప్రవహిస్తున్నట్లు గుర్తించారు. కాగా నేటి మధ్యాహ్నంలోగా కడప జిల్లాకు కృష్ణమ్మచేరనున్నట్లు అంచనా వేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం జీవో 117 ఆధారంగా టీచర్లను సర్దుబాటు చేయడంతో తీరని నష్టం జరుగుతోందని, వెంటనే నిలిపివేసి పదోన్నతులు కల్పించాలని.. ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్యాంసుందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం కడప ఏపీటీఎఫ్ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. విద్యారంగానికి తీరని నష్టం కలిగించే 117 జీవోను రద్దు చేస్తామని చెప్పిన నారా లోకేశ్ టీచర్ల సర్దుబాటు చేయటం సమంజసం కాదన్నారు.
కడప జిల్లాలో 2,200 ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్నికలు చేపట్టనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో యాజమాన్య కమిటీల ఎన్నికలతో పాత కమిటీల కాలపరిమితి ముగిసింది. దీంతో రెండేళ్ల కాలపరిమితితో కొత్త కమిటీల నియామకం చేపట్టనున్నారు. ఎన్నికల్లో విద్యార్థుల తల్లిదండ్రులే ఓటర్లుగా ఉంటారు. ఈనెల 8 ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఎన్నికలు నిర్వహిస్తారు. పాఠశాలలను అభివృద్ధి చేసేవారికి ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు.
ఇడుపులపాయ ఆర్కేవ్యాలీ ట్రిపుల్ ఐటీలో ఫైథాన్ స్టాక్ డెవలప్మెంట్ వర్క్ షాప్ నిర్వహించినట్లు డైరెక్టర్ కుమారస్వామి గుప్తా తెలిపారు. ఆదివారం ట్రిపుల్ ఐటీ సిఎస్ఇ విభాగంలో రిసోర్స్ పర్సన్ సంతోశ్ ఉద్యోగ ఎంపికకు అవసరమైన నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చి, విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఇంటర్వ్యూలకు హాజరైన విద్యార్థులకు పలు సలహాలు, సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.
✎దువ్వూరులో ఎర్రచందనం దుంగలు స్వాధీనం
✎మైదుకూరులో ‘ఫ్రెండ్షిప్ డే’ రోజున విషాదం
✎కడపలో ఇంటికి కన్నం వేసి.. రూ.లక్ష స్వాహా
✎బద్వేలు: తల్లిని చేసి కువైట్కు జారుకున్న వ్యక్తి
✎పెండ్లిమర్రి: కుక్కల దాడిలో 15 గొర్రెలు మృతి
✎అన్నమయ్య: బాలికపై అత్యాచారం
✎ నందలూరు: అడవిలో తప్పిపోయిన వ్యక్తి సేఫ్
✎ ఒంటిమిట్టలో మహిళపై దాడి
✎: ఎర్రగుంట్ల: కొడుకు అప్పులతో ఆత్మహత్య చేసుకున్న తండ్రి
దువ్వూరు మండలం దాసరిపల్లె అటవీ ప్రాంతంలో అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్న ముగ్గురిని అరెస్టు చేసి, 9 దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు మైదుకూరు అర్బన్ సీఐ మస్తాన్ తెలిపారు. ఆదివారం దువ్వూరు పోలీస్ స్టేషన్ సీఐ మాట్లాడుతూ.. దువ్వూరుకు చెందిన పోలయ్య, తమిళనాడుకు చెందిన వేలన్ మణి, రాజన్ ఎర్రచందనం తరలిస్తుండగా పట్టుకొని వారి వద్ద నుంచి 5 గొడ్డళ్లు, 3 సెల్ ఫోన్లు, ఒక కారును స్వాధీనం చేసుకున్నామన్నారు.
కడప జిల్లాలో ప్రయాణికులకు సౌకర్యవంతమైన రవాణా ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర రవాణా, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ తెలిపారు. కడప ఆర్టీసీ బస్టాండ్ ఆవరణంలో కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డితో కలిసి పూజలు నిర్వహించి, ఆర్టీసీ కొత్త బస్సులను ఆయన ప్రారంభించారు. ప్రతి జిల్లాలకు కొత్త ఆర్టీసీ బస్సులను తీసుకుని వచ్చి ప్రయాణికులకు సౌకర్యంగా రవాణా ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.
కడప జిల్లాలో ప్రయాణికులకు సౌకర్యవంతమైన రవాణా ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర రవాణా క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ తెలిపారు. కడప ఆర్టీసీ బస్టాండ్ ఆవరణంలో కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డితో కలిసి పూజలు నిర్వహించి, నూతన ఆర్టీసీ బస్సులను మండిపల్లి ప్రారంభించారు. ప్రతి జిల్లాలకు కొత్త ఆర్టీసీ బస్సులను తీసుకుని వచ్చి ప్రయాణికులకు సౌకర్యంగా రవాణా ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.
ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు సోమవారం ఉదయం కలెక్టర్ కార్యాలయంలో, డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కడప జిల్లా కలెక్టర్ శివశంకర్ తెలిపారు. జిల్లాలోని ప్రజలు రేపు ఉదయం 9.30 నుంచి 10.30 వరకు 08562- 244437 నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు. వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. SHARE IT
మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని 167 జాతీయ రహదారిపై ఇందిరమ్మ కాలనీ వద్ద ఆర్టీసీ బస్సును బైకు ఢీకొంది. ఈ ఘటనలో దువ్వూరు మండలం నేలటూరుకు చెందిన చందు దుర్మరణం చెందాడు. రాజేశ్ అనే యువకునికి తీవ్ర గాయాలయ్యాయి. 108లో కడప ఆసుపత్రికి తరలించారు. మైదుకూరు పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. వారిద్దరూ స్నేహితులని స్థానికులు తెలిపారు. దీంతో స్నేహితుల దినోత్సవం రోజు ఆ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
Sorry, no posts matched your criteria.