Y.S.R. Cuddapah

News April 24, 2024

ఒంటిమిట్ట: సీతారాముల కళ్యాణం వేదిక సిద్ధం

image

ఒంటిమిట్ట శ్రీకోదండ రాముని వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు సీతారాములు కళ్యాణం జరగనుంది. ఈ సందర్భంగా సీతారాముల కళ్యాణ మండపాన్ని రకరకాల పూలు, పండ్లతో సుందరీకరణగా అలంకరణ చేస్తున్నారు. టీటీడీ సిబ్బంది కళ్యాణ మండపం అలంకరణను పర్యవేక్షిస్తున్నారు.

News April 24, 2024

పదోతరగతి ఫలితాల్లో వైఎస్సార్ జిల్లా సత్తా

image

10th ఫలితాల్లో కడప జిల్లా 92.10% ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 3 స్థానంలో నిలిచింది. 27,729 మందికి 25,538 పాసయ్యారు. 13,515 మంది బాలికలకు 12,609 పాసయ్యారు. బాలురు 14,214 మందికి గానూ 12,929 పాసయ్యారు. బాలికలు ఈసారి సత్తా చాటారు. కాగా 2023లో 79.43% ఉత్తీర్ణత సాధించగా, ఈసారి 92.10% సాధించారు. అటు అన్నమయ్య జిల్లా 86.67 ఉత్తీర్ణత శాతంతో 17వ స్థానంలో నిలిచింది. జిల్లాలో 22,240 మందికి గానూ 19,276 పాసయ్యారు.

News April 22, 2024

కడప జిల్లాను భయపెడుతున్న ఉష్ణోగ్రతలు

image

జిల్లాలో వారం రోజుల నుంచి రాత్రి, పగలు ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగుతున్నాయి. దీంతో జనాలు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. రాత్రిళ్లు ఇళ్లలో సరైన నిద్రలేక జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు కూడా క్రమేపీ పెరుగుతున్నాయి. ఉ.9 గంటల నుంచి సూర్యుడు సుర్రుమంటున్నాడు. పగలంతా ఎండతాకిడితో అల్లాడిన జనం రాత్రి పూటైనా కాసింత ప్రశాంతంగా నిద్రపోదామంటే కూడా కుదరని పరిస్థితి నెలకొందని అంటున్నారు.

News April 22, 2024

ఒంటిమిట్ట: వాహనాల దారి మళ్లింపు వివరాలు

image

సోమవారం ఒంటిమిట్టలో శ్రీరాముని కళ్యాణం సందర్భంగా అధికారులు వాహనాల దారి మళ్లింపు వివరాలను ఒక ప్రకటనలో వెల్లడించారు. కడప నుంచి తిరుపతి వైపు వెళ్లే వాహనాలు రాయచోటి మీదుగా, తిరుపతి నుంచి కడప వైపు వచ్చే భారీ వాహనాలు, రవాణా వాహనాలు రేణిగుంట నుంచి దారి మళ్లించామన్నారు. రాజంపేట వైపు నుంచి వెళ్లే భారీ వాహనాలను రాయచోటి మీదుగా, రాజంపేట వైపు నుంచి వచ్చే ద్విచక్ర వాహనాలు సాలాబాద్ మీదగా వెళ్లాలన్నారు.

News April 22, 2024

కమలాపురంలో TDP అభ్యర్థి మార్పు?

image

కమలాపురంలో TDP అభ్యర్థిని మార్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. పుత్తా నరసింహారెడ్డికి కాకుండా కుమారుడు చైతన్యరెడ్డికి అధిష్ఠానం టికెట్ ఇచ్చింది. దీంతో పార్టీ శ్రేణుల్లో ఒకింత అసహనం ఏర్పడింది. ఆదివారం చంద్రబాబు జిల్లా నేతలకు బీఫారాలు ఇవ్వగా ఇందులో చైతన్య చంద్రబాబు వద్ద కమలాపురం సీటు తన తండ్రికి ఇస్తే బాగుంటుందని, దాని వలన చేకూరే లబ్ధిని వివరించారు. పరిశీలిస్తామని చంద్రబాబు చెప్పినట్లు సమాచారం.

News April 22, 2024

నేడు ఒంటిమిట్టకు ప్రత్యేక బస్సులు

image

నేడు ఒంటిమిట్ట రాములోరి కల్యాణోత్సవం సందర్భంగా రవాణా పరంగా ఎలాంటి ఇబ్బందులు, కొరత లేకుండా 100 ప్రత్యేక బస్సులను పలు ముఖ్యప్రాంతాల నుంచి రూట్ల వారీగా కేటాయించామని ఆర్టీసీ జిల్లా ప్రజా రవాణా అధికారి గోపాల్‌ రెడ్డి తెలిపారు. కడప డిపో నుంచి 35 బస్సులు, పులివెందుల 10, బద్వేలు 20, జమ్మలమడుగు 10, మైదుకూరు 5, ప్రొద్దుటూరు 20 బస్సులు నడుపుతున్నామన్నారు. ఇక రాజంపేట 30, రాయచోటి 10 ఏర్పాటు చేశారు.

News April 22, 2024

ముద్దనూరు: ప్రమాదంలో డ్రైవర్ మృతి

image

కడప జిల్లాలో ప్రమాదవశాత్తు షేక్షావలి (38) అనే డ్రైవర్ మృతి చెందాడు. సీఐ దస్తగిరి సమాచారం మేరకు.. ముద్దనూరుకు చెందిన షేక్షావలి లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. లారీ మరమ్మతులు చేసుకుంటుండగా ఆదివారం లారీపై నుంచి జారి పడ్డాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతడిని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అక్కడే మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేశారు.

News April 22, 2024

కడప: శిల్పారామంలో నృత్య ప్రదర్శన

image

కడప నగర పరిధిలోని శిల్పారామంలో ఏర్పాటు చేసిన ఆటవిడుపు కార్యక్రమంలో భాగంగా వైభవంగా నృత్య ప్రదర్శనను నిర్వహించినట్లు పరిపాలనా అధికారి శివప్రసాద్ రెడ్డి తెలిపారు. నగర పరిధిలోని ప్రజలు కార్యక్రమానికి హాజరై ఆసక్తిగా తిలకించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో భాగంగా జానపద, కూచిపూడి, నాటక ప్రదర్శనలు యువత ప్రదర్శించినట్లు చెప్పారు.

News April 21, 2024

వైభవంగా ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని గరుడసేవ

image

శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు ఆదివారం రాత్రి గరుడ వాహనంపై శ్రీ సీతారామలక్ష్మణులు భక్తులకు అభయమిచ్చారు. రాత్రి 7 నుంచి వాహనసేవ వైభవంగా జరిగింది. కేరళ డ్రమ్స్, భక్తజన బృంధాలు, చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

News April 21, 2024

కడప: రేపు నామినేషన్లు వేయనున్న అభ్యర్థులు

image

జిల్లాలో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఆదివారం సెలవుదినం కావడంతో నామినేషన్లు నమోదుకాలేదు. సోమవారం ప్రధాన పార్టీల నుంచి నామినేషన్లు వేస్తున్నవారు. వారిలో
➤ కడప TDP MP అభ్యర్థిగా భూపేశ్ రెడ్డి
➤ JMD-సుధీర్ రెడ్డి
➤ PDTR-రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి
➤ బద్వేల్-దాసరి సుధ, విజయ జ్యోతి
➤ కమలాపురం-పి.రవీంద్ర నాథ్ రెడ్డి
➤ మైదుకూరు-పుట్టా సుధాకర్ యాదవ్
➤ 25న పులివెందులలో వైఎస్ జగన్ నామినేషన్ వేయనున్నారు.