Y.S.R. Cuddapah

News August 4, 2024

కడపకు స్టీల్ ప్లాంట్ వస్తుంది: ఎమ్మెల్యే ఆది

image

కడపకు స్టీల్ ప్లాంట్ కచ్చితంగా వస్తుందని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారయణ రెడ్డి స్పష్టం చేశారు. ఇవాళ విజయవాడలో పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్ ఒక్కడే రూ.2లక్షలు దోచేస్తే.. ఎమ్మెల్యే, మంత్రులు మరో రూ.2లక్షలు దోచేశారని ఆరోపించారు. పులివెందులలో వైఎస్ జగన్‌ను ప్రజలు కొట్టే పరిస్థితులు వస్తాయని చెప్పుకొచ్చారు. 2029లోనూ జగన్‌ను ఓడిస్తామని శపథం చేశారు.

News August 4, 2024

ఎర్రగుంట్ల: కొడుకు చేసిన అప్పులకు తండ్రి ఆత్మహత్య

image

ప్రొద్దుటూరు లోని నాగేంద్ర నగర్ కు చెందిన వెంకటరామిరెడ్డి అదే పట్టణంలోని ఓ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు. ఈయన కుమారుడు చేసిన అప్పులకు సంబంధించి కమలాపురం ప్రాంతానికి చెందిన ఒక కుటుంబంతో ఇటీవల వివాదం తలెత్తింది. ఈ క్రమంలో వారు అధ్యాపకుడి ఇంటి పైకి వచ్చి దాడికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో వెంకట్రామిరెడ్డి శనివారం ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్ కు వచ్చి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.

News August 4, 2024

కడప: BSNL వినియోగదారులు 4Gకి అప్‌గ్రేడ్ చేసుకోవాలి

image

జిల్లాలోని BSNL యూజర్స్ 4Gకి అప్‌గ్రేడ్ కావాలని జిల్లా BSNL ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ పి.ముజీబ్ బాషా పేర్కొన్నారు. BSNL దేశవ్యాప్తంగా దశలవారీగా 4జీ టెక్నాలజీని ప్రవేశపెట్టిందని శనివారం కడపలో చెప్పుకొచ్చారు. 2జీ, 3జీ యూజర్లు 4జీ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. అంతరాయం కలిగినప్పుడు 54040కి sim అనే sms పంపడం ద్వారా కస్టమర్లు తమ సిమ్ రకాన్ని సిమ్ రకాన్ని(2జీ/3జీ/4జీ) సులభంగా తెలుసుకోవచ్చన్నారు.

News August 4, 2024

సింహాద్రిపురం: ఆన్‌లైన్ మోసగాడి అరెస్ట్

image

సింహాద్రిపురం మండలంలోని రావుల కొలనుకు చెందిన ఉప్పులూరు నాగేశ్వరరెడ్డి ఇటీవల కర్ణాటకకు చెందిన ఓ రాజకీయ నేత అకౌంట్ నుంచి రూ. 68 లక్షలు స్వాహా చేశాడు. దీంతో సదరు నేత కర్ణాటక పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు 4 రోజుల కిందట నాగేశ్వరరెడ్డిని బెంగళూరులో అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో శనివారం సెర్చ్ వారెంట్‌తో అతని ఇంట్లో సోదాలు జరిపి పత్రాలు, ఐఫోన్, లాప్టాప్ స్వాధీనం చేసుకున్నారు.

News August 4, 2024

వైవీయూ పరిధిలో ప్రవేశాలకు వెబ్ ఆప్షన్లు ప్రారంభం

image

వైవీయూ పరిధిలో డిగ్రీ కోర్సులలో చేరేందుకు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు ప్రవేశాలు పొందాలని వైవీయూ ప్రవేశాల సంచాలకులు డాక్టర్ లక్ష్మీప్రసాద్ తెలిపారు. డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆన్‌లైన్ అడ్మిషన్ మాడ్యూల్ ఫర్ డిగ్రీ కాలేజీల్లో వెబ్ ఆప్షన్ ప్రక్రియ మొదలైందని, ఇది ఈనెల 5వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు.

News August 4, 2024

కడప జిల్లాలో 99.30% పెన్షన్ల పంపిణీ: కలెక్టర్

image

కడప జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమం 99.30% పూర్తయిందని కడప కలెక్టర్ శివశంకర్ లోతేటి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గురువారం మొదలైన పింఛన్ల పంపిణీ ప్రక్రియ శనివారానికి పూర్తయిందన్నారు. పెన్షన్ ప్రక్రియను రికార్డు స్థాయిలో పూర్తిచేసిన సచివాలయ ఉద్యోగులను ఈ సందర్భంగా కలెక్టర్ అభినందించారు. జిల్లాకు రాష్ట్రంలో మంచి పేరు తీసుకురావడం జరిగిందన్నారు.

News August 4, 2024

కడప వారికి స్నేహం అంటే ప్రాణం!

image

కడప అంటే ఫ్యాక్షన్ అని చాలామంది అనుకుంటారు. కానీ మన కడప బంధాలకు, ఆప్యాయతలకు నిలయం. బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు వీడని బంధాలు‌ ప్రతి ఒక్కరిలో భాగమే. ఇక స్కూల్‌‌ ఫ్రెండ్స్‌తో చేసిన చిలిపి పనులు లైఫ్‌లాంగ్ గుర్తుండిపోతాయి. ఎక్కడికెళ్లినా మన వెంట ఒకడు ఉండాల్సిందే. ఫేర్‌వెల్‌ పార్టీలో కన్నీరు పెట్టిన మిత్రులెందరో. అటువంటి మిత్రులు మీ జీవితంలో ఎవరైనా ఉన్నారా.. కామెంట్ చేయండి.
Happy Friendship Day

News August 3, 2024

కడప జిల్లా TODAY TOP NEWS

image

✎ ఇవాళ కడప మొదటి ఎంపీ వర్ధంతి
✎ పుల్లంపేటలో కరెంట్ షాక్‌తో బాలుడు మృతి
✎ ఉమ్మడి కడప జిల్లాలో సీఐల బదిలీలు
✎ కడప: పెన్షన్ల పంపిణీలో అలసత్వం.. నోటీసులు జారీ
✎ ఎర్రగుంట్లలో రైలు కిందపడి వ్యక్తి మృతి
✎ ప్రొద్దుటూరు: TDPలో చేరిన వైసీపీ కౌన్సిలర్లు
✎ కడప: ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్
✎ ఒంటిమిట్టలో సుగవాసి బ్యానర్లు చించివేత
✎ ఎర్రగుంట్ల RTPPలో క్రేన్ ఢీకొని వ్యక్తి మృతి.. బంధువుల ఆందోళన

News August 3, 2024

అన్నమయ్య జిల్లాలో తహశీల్దార్లకు పోస్టింగ్ ఇచ్చిన కలెక్టర్

image

రాజంపేట తహశీల్దార్‌ మహబూబ్ చాంద్‌కు కలెక్టర్ శివశంకర్ పోస్టింగ్ ఇచ్చారు. నందలూరుకు అమరనాథ్, రాయచోటికి పుల్లారెడ్డి, గాలివీడుకు భాగ్యలత, చిన్నమండెంకు నరసింహులు, వీరబల్లికి శ్రావణి, టి.సుండుపల్లిలో దైవాదీనం, అలాగే రాయచోటి ల్యాండ్స్ కలెక్టరేట్‌కు ఉదయశంకర్ రాజు, ఆర్డీఓ సూపరింటెండెంట్‌గా తులసమ్మ, కలెక్టరేట్ సూపరింటెండెంట్‌గా నాగభూషణం, ల్యాండ్ సూపరింటెండెంట్‌గా సుబ్రహ్మణ్యంని నియమించారు.

News August 3, 2024

ఒంటిమిట్టలో సుగువాసి బ్యానర్లు చించివేత

image

రాజంపేట టీడీపీ నేత సుగవాసి బాలసుబ్రహ్మణ్యం పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం రాత్రి మండల కేంద్రమైన ఒంటిమిట్టలో ఏర్పాటుచేసిన బ్యానర్లను అదే రోజు అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు. ఈ ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. దీనిపై ఒంటిమిట్ట ఎస్సై మధుసూదన్ రావుని వివరణ కోరగా పిర్యాదు అందలేదని తెలిపారు. కాగా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.