India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తెలుగుదేశం పార్టీ పోలిట్బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసుల రెడ్డిని గండిక్షేత్రంలోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం పాలకమండలి మాజీ ఛైర్మన్ కల్లూరు వెంకటస్వామి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం గండిక్షేత్రంలో జరిగే స్వామివారి శ్రావణమాసం ఉత్సవాల పత్రికను, తీర్థ ప్రసాదాలు అందజేసి ఉత్సవాలకు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు ఈశ్వరయ్య, ఎల్బీఆర్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
ఎర్రగుంట్లలోని వేంపల్లి రోడ్డులో నివాసముండే విద్యార్థిని చందు(14) ఆదివారం ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. ఎర్రగుంట్లకు చెందిన కులాయప్ప కూతురు 2రోజులుగా కడుపునొప్పితో బాధపడుతూ టాబ్లెట్ వేసుకుంది. అయినా నొప్పి తగ్గకపోవడం, ఆసుపత్రికి తీసుకెళ్లలేదన్న మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబీకులు చెప్పారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఎర్రగుంట్లలోని వేంపల్లి రోడ్డులో నివాసముండే విద్యార్థిని చందు(14) ఆదివారం ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. ఎర్రగుంట్లకు చెందిన కులాయప్ప కూతురు 2రోజులుగా కడుపునొప్పితో బాధపడుతూ టాబ్లెట్ వేసుకుంది. అయినా నొప్పి తగ్గకపోవడం, ఆసుపత్రికి తీసుకెళ్లలేదన్న మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబీకులు చెప్పారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సంబేపల్లె మండలం దుద్యాల గ్రామం పెద్దకోడివాండ్ల పల్లెలో ఆదివారం సినీ హీరో అబ్బవరం కిరణ్, హీరోయిన్ రహస్య గోరక్ రిసెప్షన్ ఘనంగా జరిగింది. ఇందులో మాజీ ఎమ్మెల్యే, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి పాల్గొని వారికి వివాహ శుభాకాంక్షలు తెలిపారు. డీసీఎంఎస్ మాజీ ఛైర్మన్ ఆవుల విష్ణువర్ధన్ రెడ్డి, రాయలసీమ విద్యాసంస్థల అధినేత ఆనందరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఆగస్టు 29 గిడుగు రామ్మూర్తి పంతులు జయంతిని పురస్కరించుకుని తెలుగు భాషా దినోత్సవం ఘనంగా నిర్వహించాలని, కడప జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ ఆదివారం అధికారులకు సూచించారు. తెలుగు భాష ప్రారంభానికి చిహ్నమైన తొలి తెలుగు శాసనం ఎర్రగుంట్ల మండలం కలమల్లలో క్రీస్తుశకం 575వ సంవత్సరంలో రేనాటి చోళ రాజు ధనుంజయ వర్మ వేయించారని, అక్కడ తెలుగు భాషా దినోత్సవం నిర్వహించుకోవడం ఎంతో ప్రతిష్ఠాత్మకమని తెలిపారు.
అక్రమ నిర్మాణాలను అడ్డుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన మడకలవారిపల్లె సచివాలయ ప్లానింగ్ సెక్రటరీ శేఖర్ను కలెక్టర్ ఆదేశాల మేరకు సస్పెండ్ చేసినట్లు, బద్వేలు మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలోని మడకలవారిపల్లె గ్రామంలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా వాటిని అడ్డుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు సస్పెండ్ చేసినట్లు తెలిపారు.
రాష్ట్రంలోని 11 నగరవనాల అభివృద్ధికి డిప్యూటీ సీఎం, అటవీ శాఖా మంత్రి పవన్ కళ్యాణ్ రూ.15.4 కోట్లు మంజూరు చేశారు. కాగా అందులో కడపకు అవకాశం దక్కడం గమనార్హం. ఈ నిధులతో కడప జిల్లాలో అభివృద్ది పనులు చేపడతారు. పచ్చదనాన్ని పెంపొందిచే క్రమంలో ఆయాచోట్ల అభివృద్ధి పనులు చేపడతారు. మరోవైపు ఈనెల 30న నిర్వహించనున్న వనమహోత్సవంలో పాల్గొని అందరూ మొక్కలు నాటాలని పవన్ కోరారు.
గాలివీడులో రేపు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పర్యటించనున్నట్లు టీడీపీ నాయకులు తెలిపారు. మండలంలోని ప్యారంపల్లి గ్రామం గీదరవాండ్లపల్లెలో టీడీపీ నాయకులు గీదర ఈశ్వరెడ్డి కుమారులు గీదర ధర్మారెడ్డి, నాగభూషన్ రెడ్డి(ఎన్ఆర్ఐ)ఇస్తున్న విందులో ఆయన పాల్గొననున్నారు. ఆయనతో పాటు వారి సోదరుడు లక్ష్మీప్రసాద్ రెడ్డి, పలువురు టీడీపీ నాయకులు హాజరుకానున్నారు.
ప్రజలకు వేగవంతంగా రెవెన్యూ సేవలను అందించాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. రాయచోటి కలెక్టరేట్లో సబ్ కలెక్టర్లు, ఆర్డీఓ, మండల తహశీల్దార్లు, రెవిన్యూ సిబ్బందితో జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రెవిన్యూ సర్వీసులలో భాగంగా మ్యుటేషన్లు, నాలా కనెక్షన్, నీటి పన్ను తదితర అంశాలలో కలెక్టర్ దిశానిర్దేశం చేశారు.
సిద్దవటం మండలంలోని భాకరాపేట రైల్వే స్టేషన్ యార్డ్ వద్ద శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తి, గూడ్స్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు కడప రైల్వే స్టేషన్ ఎస్ఐ శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. మృతుని వద్ద ఉన్న పర్సులో చరవాణి నంబర్లు బద్వేల్ ప్రాంతానికి చెందిన వారివిగా తేలాయని ఎస్ఐ చెప్పారు.
Sorry, no posts matched your criteria.