India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ఇసుక పంపిణీ విధానాన్ని పక్కాగా అమలు చేయాలని కడప జిల్లా కలెక్టర్ శివశంకర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలో ఇసుక పంపిణీపై తహశీల్దార్స్, ఎంపీడీవోలతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక విధానంలో ఎలాంటి సమస్యలు లేకుండా పంపిణీ జరగాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ఇసుక పంపిణీ విధానాన్ని పక్కాగా అమలు చేయాలని కడప జిల్లా కలెక్టర్ శివశంకర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలో ఇసుక పంపిణీపై తహశీల్దార్స్, ఎంపీడీవోలతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక విధానంలో ఎలాంటి సమస్యలు లేకుండా పంపిణీ జరగాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ఇసుక పంపిణీ విధానాన్ని పక్కాగా అమలు చేయాలని కడప జిల్లా కలెక్టర్ శివశంకర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలో ఇసుక పంపిణీపై తహశీల్దార్స్, ఎంపీడీవోలతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక విధానంలో ఎలాంటి సమస్యలు లేకుండా పంపిణీ జరగాలన్నారు.
కమలాపురం నియోజవర్గం వీరపునాయునిపల్లె మండలం పాయసంపల్లెకు చెందిన ఎన్వీ నారాయణ రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్యరెడ్డి ఆధ్వర్యంలో రాజధానికి రూ.5,10,00,116లు విరాళంగా అందించారు. రాజధానిలో భాగస్వామ్యం కావాలనే స్ఫూర్తితో, పేదలకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్కు చేయూతను ఇవ్వాలనే మంచి ఆలోచనతో, విరాళం ఇచ్చిన ఎన్వీ రమణారెడ్డిని ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు.
కడప జిల్లాలో ఎక్కడైనా విద్యుత్ తీగలు, స్తంభాలు ప్రమాదకరంగా ఉన్నాయని అనిపిస్తే వెంటనే వీడియో కానీ, ఫొటో తీసి 9440814264 నంబర్కు వాట్సప్ చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని విద్యుత్ ఎస్సీ రమణ తెలిపారు. విద్యుత్ కార్యాలయంలో ప్రత్యేక బృందం ద్వారా ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా వాట్సప్ చేస్తే వెంటనే పరిష్కరిస్తామన్నారు. క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగంతో అవగాహన కల్పిస్తున్నామన్నారు.
కలసపాడు మండలం ఎగువరామాపురం పంచాయితీ తంబళ్లపల్లెకు చెందిన ఇద్దరు యువకులు బుధవారం పోరుమామిళ్ల మలకత్తువ దగ్గర రోడ్డు ప్రమాదానికి గురై కడప రిమ్స్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఒకే గ్రామానికి చెందిన సాయి కుమార్ రెడ్డి, తరుణ్ కుమార్ రెడ్డి మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పరారీలో ఉన్నాడు. పోరుమామిళ్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఉద్యోగులంటే చంద్రబాబుకు చిరాకు అని మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ ఆరోపించారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం.. శాడిస్ట్ ప్రభుత్వంలా వ్యవహరిస్తోందని, ప్రభుత్వ ఉద్యోగులను వేధింపులు గురి చేస్తోందన్నారు. సరిగ్గా 2019కు ముందు ఉద్యోగులనుద్దేశించి ఆంధ్రజ్యోతి రాధాకష్ణ, చంద్రబాబు మధ్య జరిగిన వీడియో సంభాషణ ఎన్ని తరాలైనా మరిచిపోలేమని తెలిపారు.
కడప జిల్లా కేంద్రంలో నిర్మాణంలో ఉన్న నూతన జిల్లా పోలీస్ కార్యాలయ భవనాలను జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు బుధవారం పరిశీలించారు. పనుల పురోగతిని ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఇంజినీర్లను అడిగి తెలుసుకున్నారు. త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు. ఏ.ఆర్ డీఎస్పీ మురళీధర్, ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఈ.ఈ కె.రోశయ్య, డీఈ బి.మురళీకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.
కడపలో విద్యుత్ షాక్తో విద్యార్థి మృతి చెందడంపై విద్యుత్ శాఖా మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వరుస విద్యుత్ ప్రమాదాలపై సీఎండీలతో మంత్రి సచివాలయంలో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. కడప ఘటనపై పూర్తి సమాచారాన్ని అందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అలాగే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అన్నారు.
పోరుమామిళ్ల మల్ల కత్తువ సమీపంలో కారు, ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సహాయంతో 108 అంబులెన్స్ ద్వారా పోరుమామిళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన యువకుల స్వగ్రామం కలసపాడు మండలం తంబళ్లపల్లె గ్రామంగా స్థానికులు గుర్తించారు. మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్కు తరలించారు. చికిత్స పొందుతూ వారిలో సాయికుమార్ రెడ్డి మృతి చెందాడు.
Sorry, no posts matched your criteria.