Y.S.R. Cuddapah

News April 20, 2024

పులివెందుల కాంగ్రెస్ అభ్యర్థిగా ధ్రువ కుమార్ రెడ్డి

image

పులివెందుల కాంగ్రెస్ అభ్యర్థిగా ధ్రువ కుమార్ రెడ్డిని నియమించినట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల నుంచి బీఫామ్ అందుకున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నియోజకవర్గంలో విస్తృతంగా తిరిగి పార్టీని బలోపేతం చేస్తామని వెల్లడించారు. తనకు బాధ్యతలు అప్పగించిన వైఎస్ షర్మిలకు కృతజ్ఞతలు చెప్పారు.

News April 20, 2024

ఒంటిమిట్ట రామదాసు ఈయనే

image

భద్రాచలంలో రాములోరికి గుడి నిర్మించి రామదాసు చరిత్రలో నిలిచిపోయారు. ఒంటిమిట్ట రామాలయానికి ఆ స్థాయిలోనే కృషి చేశారు వావిలికొలను సుబ్బారావు. 1863 జనవరి 23న ప్రొద్దుటూరులో జన్మించిన ఆయన ఆలయ జీర్ణోద్ధరణకు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం టెంకాయ చిప్ప చేత పట్టి ఆంధ్ర రాష్ట్రంలో ఊరూరా తిరిగారు. భిక్షంగా వచ్చిన నగదును ఆలయ అభివృద్ధికి ఖర్చు చేశారు. 1936, ఆగస్టు 1న మద్రాసులో కన్నుమూశారు.

News April 20, 2024

కడప జిల్లాలో అమానుష ఘటన

image

ఉమ్మడి జిల్లాలోని గాలివీడు మండలం చిలకలూరిపేటలో విషాదం చోటుచేసుకుంది. భర్తతో గొడవ పడి ముగ్గురు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటనతో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వెలిగల్లు సమీపంలోని గండిమడుగు నీటిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఒడ్డున చెప్పులు, సెల్ఫోన్ ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. నీటిలో తేలియాడుతున్న మృతదేహాలను పోలీసులు బయటకు తీసి కేసు నమోదు చేశారు.

News April 20, 2024

YS అవినాష్ రెడ్డి అప్పు రూ.9.11 కోట్లు

image

➤ పార్లమెంట్ స్థానం: కడప
➤విద్యార్హత: MBA
➤ ఆస్తి విలువ: రూ.25.51 కోట్లు
➤ అప్పులు: రూ.9.11 కోట్లు
➤ భార్య పేరిట ఆస్తి విలువ: రూ.7.34 కోట్లు
➤ భార్యకు ఉన్న భూమి: 33.90 ఎకరాలు
➤ బంగారం: అవినాష్ దగ్గర 355 గ్రాములు, భార్య దగ్గర 1,310 గ్రాములు
➤ కేసులు: 3

News April 20, 2024

కోడ్ ఉల్లంఘనపై 532 ఫిర్యాదులు: కడప కలెక్టర్

image

జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనపై 535 ఫిర్యాదులు అందాయని కలెక్టర్ విజయరామరాజు అన్నారు. 532 ఫిర్యాదులకు పరిష్కారం అందించామన్నారు సీ.విజిల్ ద్వారా మొత్తం 336 కేసులు నమోదు కాగా, అందులో 203 నిజనిర్ధారణ కాగా, 133 నిరాధారమైనవని గుర్తింమన్నారు. జిల్లా వ్యాప్తంగా 1,011 ఎఫ్.ఐ.ఆర్. కేసులు నమోదు చేశామన్నారు.

News April 19, 2024

YVU: రేపటి నుంచే డిగ్రీ పరీక్షలు

image

యోగి వేమన విశ్వవిద్యాలయం పరిధిలోని బీఎస్సీ, బిఏ, బీకాం, బి.బి.ఏ, బి.సి.ఎ, ఒకేషనల్ 1,2,4,6 సెమిస్టర్ల పరీక్షలు శనివారం నుంచి జిల్లాలోని 57 కేంద్రాలలో ప్రారంభమవుతున్నట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొ. ఎన్ ఈశ్వర్ రెడ్డి తెలిపార. మట్లాడుతూ.. 31,830 మంది విద్యార్థులు హాజరవుతున్నారన్నారు. పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయన్నారు. విద్యార్థులు సంబంధిత కళాశాల నుంచి హాల్ టికెట్లు పొందాలన్నారు. 

News April 19, 2024

కడప: ఇండిపెండెంట్ MP అభ్యర్థిగా షణ్ముఖ రెడ్డి నామినేషన్

image

కడప ఎంపీ ఇండిపెండెంట్ అభ్యర్థిగా కాకర్ల షణ్ముఖ రెడ్డి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. కలెక్టర్ కార్యాలయంలో జిల్లా ఎన్నికల అధికారి విజయరామరాజుకు నామినేషన్ పత్రాలను అందించారు. ప్రొద్దుటూరుకు చెందిన షణ్ముఖ రెడ్డి పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తాజాగా ఆయన ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా పోటీలో నిలిచారు. తనను గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు.

News April 19, 2024

ఒంటిమిట్ట: రాములోరి కళ్యాణానికి 1.20 ల‌క్ష‌ల లడ్డూలు

image

ఒంటిమిట్ట శ్రీ సీతారాముల‌ కళ్యాణానికి వచ్చే భ‌క్తుల‌కు అందించేందుకు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలు సిద్ధమయ్యాయి. ఏప్రిల్ 22వ తేదీ సాయంత్రం 6.30 నుంచి 8.30 గంటల మధ్య అత్యంత వైభ‌వంగా శ్రీ సీతారాముల‌ కళ్యాణంలో పాల్గొనే భక్తులకు ఈ లడ్డూలను అందజేయనున్నారు. దాదాపు 250 మంది శ్రీ‌వారి సేవ‌కులు 1.20 ల‌క్ష‌ల లడ్డూలను సిద్ధం చేశారు. 

News April 19, 2024

కడప ఎంపీ అభ్యర్థిగా షర్మిల నామినేషన్

image

కాంగ్రెస్ పార్టీ కడప పార్లమెంట్ అభ్యర్థిగా పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల శనివారం ఉదయం నామినేషన్ వేయనున్నారు. భారీ ర్యాలీతో కడపకు చేరుకుని కడపలోని వివిధ సర్కిల్స్ మీదుగా కాంగ్రెస్ పార్టీకి కార్యాలయానికి చేరుకుంటారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం చేరుకొని తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత కడపలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

News April 19, 2024

అన్నమయ్య: భర్తను చంపిన భార్య

image

భార్యే భర్తను చంపిన ఘటన అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలంలో వెలుగు చూసింది. కోటవూరు(P) చవటకుంటపల్లెకు చెందిన వెంకటరమణ(58) మొదటి భార్యతో విడిపోయాడు. రెండో భార్య రెడ్డెమ్మ, కుమారుడితో ఉంటున్నారు. మద్యం తాగి రోజూ గొడవపడేవాడు. ఈక్రమంలో బుధవారం మద్యం మత్తులో ఉన్న వెంకటరమణ గొంతుకు భార్య చీర బిగించి చంపేసింది. దీనికి కుమారుడు సహకరించినట్లు సమాచారం. CI సూర్యనారాయణ కేసు దర్యాప్తు చేస్తున్నారు.