India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కడప జిల్లాలో ఉత్పత్తి అయ్యే చేనేతలకు ప్రపంచ స్థాయి గుర్తింపును తీసుకొస్తామని జిల్లా కలెక్టర్ శివశంకర్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో చేనేత సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మైలవరం మండలం టెక్స్టైల్ పార్క్ అభివృద్ధి పనులపై సమావేశం నిర్వహించారు. చేనేతలకు ప్రపంచ స్థాయి గుర్తింపును తీసుకువచ్చేందుకు ప్రభుత్వం నుంచి అన్ని విధాల సహాయ సహకారాలు అందేలా చర్యలు చేపడతామన్నారు.
YVUలో కూచిపూడి నృత్యం, కర్ణాటక సంగీతం, కీబోర్డ్ సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలను ప్రారంభించనున్నట్లు ప్రవేశాల సంచాలకుడు డా.టి.లక్ష్మి ప్రసాద్ తెలిపారు. ప్రవేశాలు ఈ నెల 8వ తేదీ నుంచి 22 వరకు DOA కార్యాలయంలో జరుగుతాయని తెలిపారు. ఆసక్తి కల అభ్యర్థులు www.yvu.edu.in వెబ్సైట్ సంప్రదించాలన్నారు. పదేళ్ల వయసు నుంచి ఆపై ఉన్నవారు అర్హులన్నారు.
రాయచోటిలోని విద్యుత్ సబ్ స్టేషన్ సమీపంలోని ఓ ఇంట్లో ఉరివేసుకొని నాసిర్ హుస్సేన్ అనే హిందీ ఉపాధ్యాయుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కొంతకాలంగా భార్యాభర్తలు విడివిడిగా ఉండడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. మృతుడు వీరబల్లి మండలం, యర్రంరాజుగారిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. మృతదేహాన్ని పోలీసులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఒకే లైనుపై రైళ్లు ఎదురెదురుగా వచ్చినప్పుడు ఢీ కొనకుండా ముందస్తుగా ప్రమాదాన్ని పసిగట్టి నివారించే వ్యవస్థ కవచ్ను కడప జిల్లాలో అమలు చేయడానికి రంగం సిద్ధమవుతోంది. ఈ మేరకు సంబంధిత సిగ్నల్ అండ్ టెలి కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ నుంచి రైల్వే మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు వెళ్లాయి. ఇది కార్యరూపం దాలిస్తే ముంబై – చెన్నై మార్గంలో నాల్వార్, గుంతకల్, నందలూరు, రేణిగుంట లైనులో ఈ వ్యవస్థ అమలు కానుంది.
కడప జిల్లాలోని కడప, జమ్మలమడుగు, పులివెందుల, బద్వేలు ఆర్డీవో కార్యాలయాల ఏవోలను నియమిస్తూ జిల్లా కలెక్టర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. జమ్మలమడుగు ఆర్డీఓ కార్యాలయ ఏవోగా డి. తిరుపతయ్య, పులివెందుల ఆర్డీవో కార్యాలయ ఏవోగా ఎంఏ రమేశ్, బద్వేల్ ఆర్డీవో కార్యాలయ ఏవోగా సి. అక్బల్ బాషా, కడప ఆర్డీవో కార్యాలయ ఏవోగా పి. శంకర్ రావు నియమితులయ్యారు.
కడప జిల్లాలో గురువారం నిర్వహించిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో రాష్ట్రంలో జిల్లాకు నాలుగవ స్థానం లభించింది. మొత్తం 2,64,013 మంది లబ్ధిదారులకు గాను.. 2,58,100 మంది (97.76%)కి పెన్షన్ను పంపిణీ చేశామన్నారు. అందుకుగాను పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు, సిబ్బందికి జిల్లా కలెక్టర్ శివశంకర్ అభినందనలు తెలిపారు.
కడప జిల్లా చెన్నూరు మండలం ఉప్పరపల్లిలో విషాదం చోటుచేసుకుంది. మృతుడి కుటుంబీకుల వివరాల ప్రకారం.. ఉప్పరపల్లికి చెందిన గాజులపల్లె శివ కడప నబి కోటకు చెందిన కొప్పర్తి మోహన్ రెడ్డి అనే వ్యక్తి దగ్గర అప్పు తీసుకున్నాడు. అప్పు తీర్చమని కడప ఏడు రోడ్ల కూడలి వద్ద శివను షర్టు పట్టుకొని అసభ్యంగా తిడుతూ కొట్టాడు. దీంతో అవమాన భారంతో తన ఇంట్లో ఉరి వేసుకుని మరణించాడని కుటుంబీకులు తెలిపారు.
పులివెందుల – కదిరి ప్రధాన రహదారిపై ఉదయం ఆటోని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు ఒకరు మృతి చెందగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని స్థానికులు తెలిపారు. మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కూలి పనులు నిమిత్తం పులివెందుల ప్రాంత గ్రామాలకు వెళుతుండగా ప్రమాదం జరిగినట్టు బాధితులు తెలిపారు. వీరంతా సత్య సాయి జిల్లా బట్రేపల్లి వాసులు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
కడప జిల్లా కొప్పర్తి పారిశ్రామికవాడలో నూతన పరిశ్రమల ఆవిర్భావంతో పాటు ఉత్పత్తులు కూడా ప్రారంభం అయ్యాయని, జిల్లాలో ఉద్యోగ ఉపాధి అవకాశాలకు కొదవలేదని జిల్లా కలెక్టర్ శివ శంకర్ పేర్కొన్నారు. గురువారం సాయంత్రం ఉప్పర్తిలోని 54 ఎకరాల ఏర్పాటు, ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్లను JCతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. జిల్లాకే తలమానికంగా కొప్పర్తి పారిశ్రామికవాడలో పరిశ్రమలు రూపుదిద్దుకుంటున్నాయన్నారు.
ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి గర్భాలయాన్ని రెండు నెలలపాటు మూసివేస్తున్నట్లు టీటీడీ ఆగమ అర్చకులు రాజేశ్ బట్టార్ తెలిపారు. గురువారం ఒంటిమిట్ట టీటీడీ పాలక భవనంలో పురావస్తు శాఖ వారితో టీటీడీ అధికారులు, అర్చకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భాలయం మరమ్మతుల్లో భాగంగా సెప్టెంబర్ 8వ తేదీ నుంచి 2నెలలపాటు బాలాలయంలో ఏర్పాటు చేసిన ఉత్సవ విగ్రహాలతో దర్శన భాగ్యం కల్పించాలని నిర్ణయించారు.
Sorry, no posts matched your criteria.