India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కడప చిన్న చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మృత్యుంజయకుంటలో నివాసం ఉంటున్న ఉదయగిరి కుల్లాయమ్మ అనే వివాహిత శనివారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు సిఐ నరసింహారెడ్డి తెలిపారు. ఈనెల 12వ తేదీన రాత్రి ఆమె భర్త కుల్లాయప్ప ఆమెతో గొడవ పడి 11 నెలల కుమారుడిని తీసుకుని ఇంటి నుండి వెళ్లిపోయాడు. దీంతో ఆమె మనస్తాపం చెంది చీరతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
పెద్దముడియం మండలంలోని దిగువ కల్వటాల గ్రామంలో భార్యను ఆమె భర్త గొంతు కోసి హత్య చేశాడు. దిగువ కల్వటాలకు చెందిన ఆదిలక్ష్మికి మైలవరం మండలం కల్లుట్ల గ్రామానికి చెందిన మేనమామ సహదేవుడితో 15 ఏళ్ల కిందట వివాహమైంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆదిలక్ష్మి 2 నెలలుగా పుట్టింటి వద్ద ఉంటోంది. భార్య సంసారానికి రాలేదన్న కోపంతో శనివారం తెల్లవారుజామున నిద్రిస్తున్న ఆదిలక్ష్మిని భర్త కత్తితో గొంతు కోసి హత్య చేశాడు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై జరిగిన రాయి దాడిని తన సోదరి వైఎస్ షర్మిల ఖండించారు. ప్రొద్దుటూరులో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రిపై జరిగిన రాయి దాడిని ఆమె దురదృష్టకరమైన ఘటన అంటూ ఖండిస్తూ ఇలాంటి ఘటన జరగడం బాధాకరమన్నారు. ప్రమాదవశాత్తు ఈ ఘటన జరిగిందని భావిస్తున్నామని ఆమె తెలిపారు. ప్రజాస్వామ్య దేశంలో హింసకు తావు లేదని స్పష్టం చేశారు.
సార్వత్రిక ఎన్నికల సమయంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో భాగంగా సోషల్ మీడియాలో ప్రసారమయ్యే కథనాలపై ఎన్నికల కమీషన్ ప్రత్యేక దృష్టి సారించిందని కలెక్టర్ విజయ్ రామరాజు శనివారం పేర్కొన్నారు. ఎలెక్ట్రానిక్ ఓటింగ్ మిషన్, లా & ఆర్డర్, ఎన్నికల సమగ్రత, ఎన్నికల ప్రణాళిక అంశాలపై నకిలీ కథనాలు ప్రసారం చేయద్దన్నారు.
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై చర్యలు తీసుకోవాలని వైసీపీ కడప జిల్లా అధ్యక్షుడు మేయర్ సురేశ్ బాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆ పార్టీ తరఫున ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. జిల్లాలో జరిగిన బస్సు యాత్రలో షర్మిల ముఖ్యమంత్రి జగన్, కడప ఎంపీ అభ్యర్థి అవినాశ్ రెడ్డిపై నోటికి వచ్చినట్లు మాట్లాడటాన్ని తీవ్రంగా పరిగణించాలన్నారు.
బ్రహ్మంగారిమఠం మండలంలోని సోమిరెడ్డిపల్లె ఎస్సీ కాలనీకి చెందిన గొల్లపల్లె చరణ్ గుండె పోటుతో శుక్రవారం రాత్రి మరణించారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు సాంబశివరెడ్డి, మండల అధ్యక్షుడు సుబ్బారెడ్డి, పూజారి శివ చరణ్ మృతదేహానికి నివాళులర్పించి, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. చరణ్ అతి చిన్న వయసులో మరణించడం బాధాకరమన్నారు.
సీఎం జగన్కు ఓటమి భయం పట్టుకుందని, పీసీసీ అధ్యక్షురాలు, కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి షర్మిల జిల్లాలో చేపట్టిన న్యాయ యాత్రను అడ్డుకుంటున్నారని సీపీఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర విమర్శించారు. జగన్ వైఫల్యాన్ని, వివేకానందరెడ్డి హత్య కేసు వివరాలను షర్మిల ప్రజలకు వివరించడంతో జగన్ లో ఓటమి భయం మొదలైందన్నారు. అందుకే వేంపల్లె, లింగాలలో అల్లరిమూకలతో అడ్డుకోవాలని చూశారన్నారు.
కమలకూరు TDP నాయకుడు మోపురి బాలకోటయ్య(37) శుక్రవారం రాత్రి గొడుగునూరు చెరువు కట్టపై ప్రమాదవశాత్తు క్రేన్ తగిలి మృతి చెందాడు. కమలకూరు రామాలయంలో శనివారం ధ్వజస్తంభం ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో ఏర్పాట్లకు బద్వేలు నుంచి క్రేన్కు ముందు దారి చూపుతూ బాలకోటయ్య మరొక వ్యక్తి బైకుపై వస్తున్నారు. దారి మధ్యలో చెరువు కట్టపై బైకు నిలపడంతో వెనుక వస్తున్న క్రేన్ ఢీ కొట్టింది. దీంతో బాలకోటయ్య మృతి చెందారు.
ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలలో శ్రీ సీతారాముల కల్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు పగడ్భంది ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టర్ విజయరామరాజు, టీటీడీ జేఈవో శ్రీ వీరబ్రహ్మం, జిల్లా ఎస్సీ సిదార్థ కౌశల్ తో కలసి శుక్రవారం ఈవో ఏర్పాట్లను పరిశీలించారు.
ప్రొద్దుటూరులోని జమ్మలమడుగు రోడ్డులో ఉన్న బాలికల ప్రభుత్వ బీసీ హాస్టల్ భవనం పైకప్పు గురువారం రాత్రి 11 గంటలకు కుప్పకూలింది. అయితే విద్యార్థినులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ హాస్టల్లో సుమారు 42 మంది విద్యార్థినులు ఉంటున్నారు. పాత చౌడు మిద్దెలో హాస్టల్ను అధికారులు నిర్వహిస్తున్నారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ మురళీధర్, త్రీ టౌన్ సీఐ వెంకటరమణ అక్కడికి చేరుకుని ఘటనపై వివరాలను అడిగి తెలుసుకున్నారు.
Sorry, no posts matched your criteria.