Y.S.R. Cuddapah

News April 8, 2024

కడప: కారు ప్రమాదంలో చిన్నారి మృతి

image

రైల్వే కోడూరు చెందిన గోను గొడుగు శివ సురేంద్ర తన తండ్రి దశ దినకర్మకు కుటుంబంతో కలిసి శ్రీకాకుళం నుంచి కారులో బయలుదేరారు. ఈ క్రమంలో వీరు ప్రయాణిస్తున్న కారు ఆదివారం బాపట్ల జిల్లా గుడిపాడు సమీపంలో ప్రమాదానికి గురైంది. ఘటనలో చిన్నారి ధార్మిక అక్కడికక్కడే మృతి చెందింది. సురేంద్రతో పాటు ఆయన భార్య , కొడుకు, తల్లి నాగేంద్రమ్మ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ఒంగోలు ఆసుపత్రికి తరలించారు.

News April 8, 2024

సార్వత్రిక ఎన్నికలకు సర్వం సన్నద్ధం కావాలి: కలెక్టర్

image

అన్నమయ్య జిల్లాలో జరిగే సార్వత్రిక ఎన్నికలకు సర్వం సన్నద్ధం కావాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అభిషిక్త్ కిషోర్ రిటర్నింగ్ అధికారులు, జిల్లా మండల స్థాయి నోడల్ అధికారులను ఆదేశించారు. అధికారులతో ఎన్నికల సన్నద్ధతపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణ అంశంలో తీసుకున్న చర్యలపై నియోజకవర్గం వారీగా కూలంకషంగా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా సమీక్షించారు.

News April 7, 2024

కడప: పురుగు మందు తాగి యువకుడి ఆత్మహత్య

image

మండల కేంద్రమైన సిద్దవటం ఎగువపేటకు చెందిన సోమిశెట్టి రంజిత్(32) అనే యువకుడు పురుగు మందు తాగి ఆదివారం ఆత్మహత్యకు పాల్పడినట్లు సిద్దవటం ఎస్సై పెద్ద ఓబన్న తెలిపారు. ఎస్సై మాట్లాడుతూ.. యువకుడికి వివాహం కాలేదని దీంతో మనస్తాపం చెందడని పేర్కొన్నారు. శనివారం సాయంత్రం తన బైక్‌ పై పురుగు మందు తీసుకెళ్లి నిత్యపూజ కోనకు వెళ్లే రహదారిలో తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడన్నారు.

News April 7, 2024

షర్మిల డిపాజిట్ గల్లంతు ఖాయం: రఘురామిరెడ్డి

image

ఎన్నికల్లో షర్మిలకు డిపాజిట్ కూడా దక్కదని ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి తెలిపారు. ఆదివారం మైదుకూరులో ఆయన మాట్లాడుతూ.. వివేకానంద రెడ్డి హత్య విషయంలో అవినాశ్ రెడ్డిపై షర్మిల ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. రియల్ ఎస్టేట్ వ్యవహారం, లేదా వివేకానంద రెడ్డి రెండో వివాహం వ్యవహారం వల్లే హత్య జరిగి ఉండొచ్చని తెలిపారు. షర్మిల, సునీత ఆధారాలు లేని వ్యాఖ్యలు చేయడం సబబు కాదన్నారు.

News April 7, 2024

ప్రజలు ఓట్లు వేసింది హత్యలు చేసేందుకా: షర్మిల

image

ప్రజలు ఓట్లేసి గెలిపించింది హత్యలు చేయించడానికా అని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం పెండ్లిమర్రి మండలం యాదవపురంలో చిన్న సుబ్బరాయుడు కుటుంబాన్ని పరామర్శించారు. సుబ్బరాయుడు కుమారుడు శ్రీనివాస్ యాదవ్ ఇటీవల హత్యకు గురైన విషయం తెలిసిందే. నిందితులంతా స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే అనుచరులేనని ఆమె ఆరోపించారు. భూమి కోసం అవినాష్ అనుచరులే హత్య చేశారని ఆరోపించారు. బాధితులకు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు.

News April 7, 2024

పులివెందుల అడ్డా ఈసారి ఎవరిది.?

image

రాష్ట్ర రాజకీయాల్లో పులివెందుల ప్రత్యేకం. ఇక్కడ మొత్తం 17 సార్లు ఎన్నికలు జరిగితే అందులో 13 సార్లు YS కుటుంబానిదే పెత్తనం. YS కుటుంబంపై 5 సార్లు పోటీచేసిన సతీశ్ రెడ్డి వైసీపీలో చేరడంతో జగన్ మెజారిటీ మరింత పెరుగుతుందని పార్టీ శ్రేణులు అంచనా వేసుకుంటున్నారు. TDP అభ్యర్థి బీటెక్ రవి గెలుపుపై ధీమాగా ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ నుంచి వివేకా సతీమణి సౌభాగ్యమ్మ పోటీ చేసే అవకాశం ఉంది. మరి ఎవరు గెలుస్తారు?

News April 7, 2024

కడప: నేడు షర్మిల బస్సు యాత్ర షెడ్యూల్

image

కడప జిల్లాలో 3వ రోజు APCC చీఫ్& కడప కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి వైఎస్ షర్మిల ఏపీ న్యాయ యాత్ర కొనసాగనుంది. ఈరోజు కమలాపురం నియోజకవర్గంలో ఉదయం 10.30 గంటలకు పర్యటన ప్రారంభం కానుందని పార్టీ వర్గాలు తెలిపారు. Ck దిన్నె, ఎల్లటూరు, పెండ్లిమర్రి, నందిమండలం, తంగేడుపల్లి, వీఎన్ పల్లి, కమలాపురం, వల్లూరు, చెన్నూరు మీదుగా న్యాయ యాత్ర జరగనుంది.

News April 7, 2024

చెన్నూరు హైవేపై రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

image

కడప- కర్నూలు జాతీయ రహదారి సమీపంలోని ఇస్కాన్ కూడలి పెట్రోల్ బంకు వద్ద రోడ్డు దాటుతున్న వ్యక్తిని కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మృతుడి వివరాలు సేకరించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.

News April 7, 2024

రాయచోటి రమేశ్‌రెడ్డితో YCP నేతల చర్చలు

image

రాయచోటి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత అర్.రమేశ్ కుమార్ రెడ్డిని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు రమేశ్ రెడ్డిని వైసీపీలోకి చేరడానికి పూర్తి స్థాయి చర్చలు జరిపినట్లు సమాచారం. దీంతో ఆయన కూడా వైసీపీలో చేరడానికి సుముఖత చూపడంతో అతి త్వరలో తేదీన ప్రకటించి సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారని పార్టీ వర్గాలు తెలిపారు.

News April 6, 2024

బద్వేల్‌లో అత్యధిక మెజారిటీ భార్యా భర్తలదే..

image

బద్వేల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 18 సార్లు ఎన్నికలు జరిగాయి. 2019లో వైసీపీ తరఫున దివంగత జి.వెంకటసుబ్బయ్య 44734 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఆయన మరణాంతరం జరిగిన ఉప ఎన్నికల్లో దాసరి సుధ 90 వేల ఓట్ల పైచిలుకు మెజారిటితో గెలిచారు. ఇప్పటి వరకు ఇదే అత్యధిక మెజారిటీ. తాజాగా వైసీపీ నుంచి దాసరి సుధ, కూటమి నుంచి బొజ్జ రోషన్న బరిలో ఉన్నారు. ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో మీ అభిప్రాయం చెప్పండి.