India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కాచిగూడ-తిరుపతి (07655/ 07654)ప్రత్యేక రైలును కడప మీదుగా నడవనున్నట్లు కడప రైల్వే చీఫ్ టికెట్ ఇన్స్పెక్టర్ ఉమర్ బాషా, సీనియర్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ జనార్దన్ తెలిపారు. ఈనెల 11, 18, 25, మే 1వ తేదీల్లో కాచిగూడ నుంచి తిరుపతికి ఈ రైలు నడుస్తుందన్నారు. అలాగే ఈనెల 12, 19, 26, మే 2వ తేదీల్లో తిరుపతి నుంచి కాచిగూడకు వెళుతుందన్నారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల బస్సు యాత్ర రెండో రోజు జిల్లాలో కొనసాగనుంది. బద్వేల్, అట్లూరు, కడప నియోజకవర్గాల్లో శనివారం యాత్ర జరుగనుంది. ఉదయం 9.30 గంటలకు ప్రారంభమయ్యే బస్సు యాత్రలో పీసీసీ మీడియా ఛైర్మన్ ఎన్.తులసిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు గుండ్లకుంట శ్రీరాములు పాల్గొంటారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. వీరితో పాటు ఆయా నియోజకవర్గ నేతలు పాల్గొంటారు.
శుభకార్యాయానికి వెళ్లొస్తుండగా రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందిన ఘటన దువ్వూరు మండలంలో జరిగింది. పోలీసులు వివరాల మేరకు.. భీమునిపాడుకు చెందిన యేసయ్య, సుజాత దంపతులు ఏకో పల్లిలో జరిగిన బంధువుల శుభకార్యాయానికి వెళ్లారు. గురువారం రాత్రి బైక్పై తిరిగి వస్తుండుగా గుర్త తెలియని వాహనం వీరి బైక్ను ఢీ కొంది. క్షతగాత్రులను 108వాహనంలో తరలిస్తుండగా మార్గమధ్యలో యేసయ్య, ప్రొద్దుటూరులో సుజాత మృతి చెందారు.
జమ్మలమడుగులో కూటమి సమావేశంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఆదినారాయణరెడ్డి, భూపేశ్ రెడ్డి ఒకే వేదికపై కనిపించారు. ఈ సందర్భంగా ఆది మాట్లాడుతూ.. నాకు భూపేశ్కు మధ్య దూరం పెంచడానికి చాలామంది ప్రయత్నించారని, కొంతమంది తనను ఇబ్బందులకు గురిచేశారని అందుకే బీజేపీలో చేరానని, అదే నాకు శ్రీరామ రక్షలా పనిచేసిందన్నారు. బాబాయ్తో తనకు ఎలాంటి విభేదాలు లేవని, నా పనితనం మెచ్చే ఎంపీ సీటు ఇచ్చారని భూపేశ్ అన్నారు.
సార్వత్రిక ఎన్నికల కోడ్ నేపథ్యంలో స్వాధీనం చేసుకున్న నగదు, వస్తువులను సులభంగా విడుదల చేసేందుకు జిల్లా స్థాయి అధికారులైన ముగ్గురు సభ్యులతో కూడిన సీజర్స్ పరిష్కార కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని కడప కలెక్టర్ విజయ్ రామరాజు ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్ లోని వీసీ హాలులో ప్రతిరోజూ ఉదయం 11 గంటలకు సీజర్స్ పరిష్కార కమిటీ సభ్యులు హాజరవుతారని, విచారించి త్వరితగతిన నగదు, వస్తువులు అప్పగిస్తారన్నారు.
బ్రహ్మంగారిమఠం మండలం చెంచయ్యగారిపల్లెకు చెందిన రజకుడు పొంగూరు సుబ్బయ్య(65)అనే వ్యక్తి వడ దెబ్బకు గురై మృతి చెందాడు. గురువారం పింఛను కోసం మల్లేపల్లి సచివాలయం వద్దకొచ్చి వృద్ధాప్య పింఛను తీసుకున్నాడు. ఈ క్రమంలో ఎండధాటికి వడదెబ్బకు గురయ్యాడు. తీవ్ర అస్వస్థతకు గురైన సుబ్బయ్యను శుక్రవారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులు 108లో మైదుకూరుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు.
కాంగ్రెస్ కడప ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్న వైఎస్ షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఓ వైపు YSR బిడ్డ, మరోవైపు వివేకాను హత్య చేయించిన వ్యక్తి కడప ఎంపీగా పోటీ చేస్తున్నారు. ప్రజలు ఆలోచించి ఓట్లు వేయాలి. వివేకాను హత్య చేయించిన వారికి వైసీపీ టికెట్ ఇవ్వడాన్ని నేను తట్టులోక పోయాను. హంతకులు చట్టసభల్లో ఉండకూడదు. అందుకే నేను కడప బరిలోకి దిగుతున్నా’ అని బద్వేల్ నియోజకవర్గ ప్రచారంలో షర్మిల అన్నారు.
ప్రొద్దుటూరులోని వాసవి సర్కిల్లో వాహనాలను తనిఖీ చేస్తుండగా 830 గ్రాముల బంగారు ఆభరణాలను సీజ్ చేశామని డీఎస్పీ మురళీధర్ తెలిపారు. గురువారం వన్ టౌన్ సీఐ శ్రీకాంత్, ఎస్ఐ మంజునాథ వాసవి సర్కిల్లో తనిఖీలు చేపట్టారన్నారు. పట్టణానికి చెందిన నేలటూరు ఉబేదుల్లా కారును తనిఖీ చేస్తుండగా 830 గ్రాముల బంగారు ఆభరణాలను ఉన్నాయని, వాటికి బిల్లులు చూపనందున సీజ్ చేశామన్నారు. వీటి విలువ సుమారు రూ.54 లక్షలు అన్నారు.
పోరుమామిళ్ల మండలం పరిధిలోని మల్లిరెడ్డిపల్లి మలుపు వద్ద ప్రమాదవశాత్తు స్కూటర్పై నుంచి పడి కవలకుంట్ల హరిజనవాడ గ్రామానికి చెందిన వెంకటయ్య మృతి చెందాడని ఎస్ఐ మల్లికార్జునరెడ్డి తెలిపారు. పోరుమామిళ్ల నుంచి బైక్పై ఇంటికి వెళ్తుండగా అదుపుతప్పి కిందపడ్డాడు. తీవ్ర గాయాలైన వెంకటయ్యను పోరుమామిళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
రాజుపాలెం మండలం కూలూరు గ్రామం కుందూ నది వద్ద ట్రాక్టర్ కిందపడి డి.పెద్ద ఓబులేసు (35) అనే యువకుడు మృతి చెందినట్లు ఎస్ఐ తులసీ నాగప్రసాద్ తెలిపారు. నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం నగళ్లపాడుకు చెందిన పెద్ద ఓబులేసు పొలానికి మట్టి కోసం ట్రాక్టర్ తీసుకొని కుందూ నది వద్దకు వచ్చారన్నారు. ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కింద పడి గాయపడిన అతడిని ప్రొద్దుటూరు ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ చనిపోయాడన్నారు.
Sorry, no posts matched your criteria.