India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మైదుకూరులోని మండల రెవెన్యూ, మున్సిపల్, ఎంపీడీఓ కార్యాలయాలను శనివారం జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ పరిశీలించారు. కలెక్టర్కు తహశీల్దార్ రాజసింహ నరేంద్ర, కమిషనర్ జబ్బార్ మియా స్వాగతం పలికారు. ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ తహశీల్దార్ కార్యాలయం దూరంగా ఉండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కలెక్టర్కు తెలిపారు. గతంలో మాదిరి ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలోనే తహసిల్దార్ కార్యాలయం ఏర్పాటు చేయాలన్నారు.
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి కాదని ఎమ్మెల్యే మాత్రమేనని అసెంబ్లీకి రావాలని ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు. ముఖ్యంగా రాజకీయాల్లో పదవులు వస్తుంటాయి పోతుంటాయని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి వస్తే మాట్లాడే అవకాశం ఇస్తానని తెలిపారు. సమావేశాలలో అసెంబ్లీకి హాజరవ్వటం శాసనసభ్యుడిగా ఆయన బాధ్యత అన్నారు.
కడప జిల్లాలో పెట్రోల్ ధరలు శుక్రవారం, శనివారం కాస్త వ్యత్యాసంలో ఉన్నాయి. నిన్న లీటరు పెట్రోలు రూ. 108.52 ఉండగా నేడు రూ. 108.96 ఉంది. అదే విధంగా డీజిల్ నిన్న రూ. 96.42 ఉండగా.. నేడు రూ . 96.82 ఉన్నట్లు తెలుస్తోంది.
కడప జిల్లాలో పెట్రోల్ ధరలు శుక్రవారం, శనివారం కాస్త వ్యత్యాసంలో ఉన్నాయి. నిన్న లీటరు పెట్రోలు రూ. 108.52 ఉండగా నేడు రూ. 108.96 ఉంది. అదే విధంగా డీజిల్ నిన్న రూ. 96.42 ఉండగా.. నేడు రూ . 96.82 ఉన్నట్లు తెలుస్తోంది.
ధర్మవరం నుంచి మచిలీపట్నం వెళ్తున్న రైలులో పొగలు రావడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. శుక్రవారం రాత్రి 9.30కు ప్రొద్దుటూరు రైల్వే స్టేషన్కు రైలు వచ్చి ఆగింది. బండిని ఆపే సమయంలో వర్షం పడగా, పదే పదే బ్రేకులు వేయడంతో ఏసీ బోగి చక్రాల కింద ఉన్న బ్రేకర్ నుంచి పొగ వచ్చిందని రైల్వే అధికారులు తెలిపారు. సాంకేతిక సమస్య ఉందని గుర్తించి, దాన్ని అధికారులు సరిచేయగా 30నిమిషాల తర్వాత రైలు బయలుదేరింది.
మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో పాటు వ్యక్తిగత బాధ్యతగా తీసుకోవాలని కడప జిల్లా కలెక్టర్ శివశంకర్ పిలుపునిచ్చారు. కడప కలెక్టర్ కార్యాలయంలో వనమహోత్సవం నిర్మాణ కార్యక్రమంపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా తమ వంతు బాధ్యతగా వనమహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.
వైవీయూ డిగ్రీ ఇన్స్టంట్ పరీక్షలు ఈ నెల 12 నుంచి ప్రారంభమవుతాయని వైవీయూ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రొ. ఎన్ ఈశ్వర్ రెడ్డి తెలిపారు. పరీక్షలన్నీ వైవీయూ క్యాంపస్లో మాత్రమే నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థులు చదువుతున్న కళాశాలల నుంచి హాల్టికెట్లు తీసుకోవాలన్నారు. పరీక్ష ప్రారంభమయ్యే అరగంట ముందే క్యాంపస్లోని ఏపీజే అబ్దుల్ కలాం సెంట్రల్ లైబ్రరీ పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.
కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి బెంగళూరుకు కొత్త ట్రైన్ ఏర్పాటు చేయాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కోరారు. ఈమేరకు ఢిల్లీలో రాష్ట్ర కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసి వినతిపత్రం అందించారు. దురదృష్టవశాత్తు కడప జిల్లా నుంచి బెంగళూరుకు ఎటువంటి రైల్వే సర్వీసులు లేవని దీనివల్ల ఐటీ ఉద్యోగులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు.
వైవీయూ పరిధిలోని అనుబంధ డిగ్రీ కళాశాలల రెండో సెమిస్టర్ పరీక్ష ఫలితాలను వైవీయూ వీసీ ప్రొ. కె. కృష్ణారెడ్డి, రిజిస్ట్రార్ ప్రొ. ఎస్ రఘునాథరెడ్డి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొ. ఎన్ ఈశ్వరరెడ్డితో కలిసి విడుదల చేశారు. బిఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ పరీక్షలకు 6,420 మంది హాజరు కాగా 2,330 మంది ఉత్తీర్ణత సాధించారు. 36.34 శాతం మంది ఉత్తీర్ణులయ్యారని వివరించారు.
కేంద్రం నుంచి ఏపీకి 1000 బస్సులు రానున్నట్లు ఏపీ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే కాలంలో ఏపీఎస్ఆర్టీసీలో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. సీఎం రివ్యూలో పలు సూచనలు, ఫ్రీ బస్సుల అంశంపై చర్చించినట్లు మంత్రి తెలిపారు. యాక్సిడెంట్ ఫ్రీ ఏపీని తయారుచేసేలా ప్రణాళికలు చేస్తున్నామన్నారు.
Sorry, no posts matched your criteria.