Y.S.R. Cuddapah

News July 16, 2024

కడప: బెస్ట్ టీచర్ అవార్డుల దరఖాస్తు గడువు పొడిగింపు

image

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డ్స్-2024 కోసం అర్హత గల జిల్లా ఉపాధ్యాయులు ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసుకోవడానికి గడువును 18వ తేదీ వరకు పొడిగించినట్లు డీఈవో అనురాధ తెలిపారు. అర్హత/ఆసక్తి గల ఉపాధ్యాయులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దరఖాస్తులను 21వ తేదీలోగా DEO ఆఫీసులో సమర్పించాలని సూచించారు. మరింత సమాచారానికి https://nationalawardstoteachers.education.gov.in సంప్రదించాలని అన్నారు.

News July 16, 2024

కడప, అన్నమయ్య జిల్లాలో రూ.1000 కోట్ల భూ ఆక్రమణలు: సీఎం

image

కడప, అన్నమయ్య జిల్లాలో సుమారు రూ.1000 కోట్లు విలువగల భూములు వైసీపీ నాయకులు, కార్యకర్తల చేతిలో ఉన్నాయని సీఎం చంద్రబాబు ఆరోపించారు. తాజాగా సహజ వనరుల దోపిడీపై శ్వేతపత్రం విడుదల చేశారు. అందులో కడప జిల్లాలో 5,796.54 ఎకరాల భూములను 3,357 మందికి, అన్నమయ్య జిల్లాలో 103.15 ఎకరాలను 84 మందికి అక్రమంగా కట్టబెట్టినట్లు సీఎం ప్రకటించారు. ఇటువంటి వారిని విచారించి కఠిన శిక్షలు పడేలా చేస్తానని పేర్కొన్నారు.

News July 16, 2024

కడప: జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో వర్షం

image

ఉపరితల ఆవర్తనం కారణంగా జిల్లా వ్యాప్తంగా 35 మండలాల్లో సోమవారం వర్షం కురిసింది. వల్లూరులో 14.8 మి.మీ, చెన్నూరులో 11.2, వేంపల్లిలో 9.2, విఎన్ పల్లెలో 9, పోరుమామిళ్లలో 8.2, చక్రాయపేటలో 8, సిద్ధవటంలో 7.4, వేములలో 7, దువ్వూరులో 6.8, కాశినాయనలో 6.4, సింహాద్రిపురం, కాజీపేట, కడపలో 6.2, కమలాపురంలో 5.4, కలసపాడు, బద్వేల్, పెద్దముడియంలలో 5.2, మైదుకూరులో 5, రాజుపాలెంలో 4.8 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది.

News July 16, 2024

బి.కోడూరు: పాఠశాల స్థలాన్ని తనఖా పెట్టారు: టీడీపీ

image

మండల పరిధిలోని గోవిందాయపల్లె జిల్లా ఉన్నత పాఠశాలను వైసీపీ నాయకులు ఆన్‌లైన్లో నమోదు చేసుకుని రుణాలు పొందారని మండల టీడీపీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, రాష్ట్ర రైతు కార్యదర్శి రమణారెడ్డి ఆరోపించారు. వారు మాట్లాడుతూ.. గోవిందాయ పల్లె జిల్లా ఉన్నత పాఠశాల 40 ఏళ్ల నుంచి అక్కడ ఉందన్నారు. 4.27 సెంట్లు భూమిని కొండ వెంకటసుబ్బమ్మ పేరిట ఆన్‌లైన్లో నమోదు చేసుకున్నారని విమర్శించారు.

News July 16, 2024

ప్రొద్దుటూరులో దారుణ హత్య.. కారణం

image

పట్టణంలోని నేతాజీ నగర్ 3లో గడ్డమీది బాలనాగమ్మ (63) అనే వృద్ధురాలు సోమవారం దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. పోలీసుల వివరాల మేరకు.. కడపకు చెందిన నాగ ఉష 4 నెలల కిందట ప్రొద్దుటూరు చెందిన సురేశ్‌ను పెళ్లి చేసుకుంది. సురేశ్ తల్లి బాలనాగమ్మ పెళ్లికి పెద్దగా ఉండింది. ఈ పెళ్లి నాగ ఉష తండ్రికి ఇష్టం లేదు. దీంతో అల్లుడి ఇంటికి వచ్చిన ఉష తండ్రి బాత్రూంలో ఉన్న బాలనాగమ్మపై పెట్రోల్ పోసి హత్య చేశాడన్నారు.

News July 16, 2024

కడప: 22న డిగ్రీ విద్యార్థులకు వైవా-వోస్ పరీక్ష

image

యోగివేమన విశ్వవిద్యాలయం పరిధిలోని అనుబంధ డిగ్రీ కళాశాలల విద్యార్థులకు ఈనెల 22వ తేదీ ఉదయం 10 గంటలకు వైవా- వోస్ నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి ప్రొ. ఎన్. ఈశ్వరరెడ్డి తెలిపారు. లాంగ్ టర్మ్ ఇంటర్న్‌షిప్ ప్రాజెక్ట్ ఫీజు చెల్లించిన విద్యార్థులు వైవావోస్‌కు కడపలోని నాగార్జున మహిళా డిగ్రీ కళాశాలలో హాజరు కావాలని సూచించారు. విద్యార్థులు ప్రాజెక్ట్ రికార్డు హార్డ్ కాపీని సమర్పించాలన్నారు.

News July 15, 2024

కడప: పోస్టాఫీసులో 58 ఉద్యోగాలు

image

పదవ తరగతి అర్హతతో బీపీఎం/ఏబీపీఎం ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. కడప డివిజన్‌లో 28, ప్రొద్దుటూరు డివిజన్‌లో 30 పోస్టులను పోస్టల్ డిపార్ట్‌‌మెంట్ భర్తీ చేయనుంది. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. ఎంపికైన వారికి బీపీఎం అయితే రూ.12 వేలు+అలవెన్సులు, ఏబీపీఎం అయితే రూ.10 వేలు+అలవెన్సులు జీతంగా ఇవ్వనున్నారు. పూర్తి వివరాలకు www.appost.gdsonline వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.

News July 15, 2024

అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

image

రామాపురం మండలం పాలన్న గారి పల్లె దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. పాలన్న గారి పల్లెకు చెందిన నాగభాస్కర్ రోడ్డు దాటుతుండగా.. గుర్తు తెలియని స్కూటర్ ఢీ కొనడంతో కిందపడ్డాడు. వెంటనే వేగంగా వచ్చిన కారు అతడిని ఢీ కొట్టడంతో తల నుజ్జునుజ్జయి మృతి చెందాడు. వెంటనే పోలీసులకు స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థాలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News July 15, 2024

స్టేట్ 29వ ర్యాంక్ సాధించిన కడప జిల్లా విద్యార్థిని

image

2023-2024 ఆంధ్రప్రదేశ్ రీసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (APRCET)లో కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం కొత్తూరుకు చెందిన మునగల కల్పన స్టేట్ 29వ ర్యాంక్ సాధించారు. కల్పన 112 మార్కులు సాధించి APRCETలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు ఆమెకు అభినందనలు తెలిపారు.

News July 14, 2024

నందలూరు: ఆర్టీసీ కండక్టర్‌ను వెంటాడిన మృత్యువు

image

నందలూరు మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అందరూ ప్రాణాలతో బయటపడగా కండక్టర్ రాముడు(40) మాత్రం మృతి చెందారు. ప్రమాద సమయంలో కండక్టర్ బస్సులో నుంచి బయటికి ఎగిరిపడ్డారు. తిరిగి లేచి అక్కడి నుంచి వెళ్లేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో లారీలో ఉన్న ఐరన్ కాయిల్ మీద పడటంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు బస్సులో ఉన్న ప్రయాణికులు తెలిపారు.