Y.S.R. Cuddapah

News March 29, 2024

కడప జిల్లాలో 26 ఓట్లతో గెలిచిన MLA ఎవరో తెలుసా?

image

మైదుకూరు నియోజకవర్గంలో ఇప్పటివరకు 14 సార్లు ఎన్నికలు జరిగాయి. తొలిసారి 1955లో జరిగిన ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థి రామారెడ్డి 11 వేలకు పైగా ఓట్లతో గెలుపొందారు. ఈ నియోజకవర్గానికి ఐదుగురు మాత్రమే MLAలుగా ప్రాతినిధ్యం వహించగా, 1994 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి డీఎల్ రవీంద్రరెడ్డి కేవలం 26 ఓట్ల తేడాతో రఘురామిరెడ్డి (TDP)పై గెలుపొందారు. దీంతో జిల్లాలో తక్కువ ఓట్లతో ఓడిన, గెలిచిన వ్యక్తులుగా నిలిచారు.

News March 29, 2024

రాయచోటి: విద్యుదాఘాతంతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి

image

చిన్నమండెం మండల పరిధిలోని పడమటికోన కమ్మపల్లెలో గురువారం విద్యుదాఘాతంతో సాఫ్ట్ వేర్ ఉద్యోగి మట్లి మహేశ్ నాయుడు (30) మృతి చెందినట్లు ఎస్సై రమేశ్ బాబు తెలిపారు. మహేశ్ సాఫ్ట్వేర్ ఉద్యోగిగా వర్క్ ఫ్రం హోంగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో తన స్వగ్రామంలో ప్లగ్ బాక్స్‌లో పిన్ మారుస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురైనట్లు వివరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

News March 29, 2024

కడప: ప్రత్యేక కేటగిరీ ఓటర్లకు సదుపాయాలను సిద్ధం చేయాలి

image

ఓటింగ్ సమయంలో ప్రత్యేక కేటగిరీకి చెందిన దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లు, ట్రాన్స్ జండర్ ఓటర్లకు అసౌకర్యం కలగకుండా సదుపాయాలు కల్పించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. ఎన్నికల నియమావళిపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్‌ను పకడ్బందీగా అమలు చేయాలని, ఎంసీసీ ఉల్లంఘన జరగకూడదన్నారు.

News March 28, 2024

పెండ్లిమర్రి: పది ఏళ్లు క్యాన్సర్‌తో పోరాటం.. చివరికి

image

నలుగురు పిల్లలు, పది ఏళ్లు క్యాన్సర్‌తో పోరాటం, బతకాలనే ఆశ చివరికి ఇవేమి పని పనిచేయక ఓ మహిళ మృతి చెందింది. పెండ్లిమర్రికి చెందిన గంగులమ్మ (80) క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ.. ఇవాళ ఉదయం 10 గంటలకు మృతి చెందింది. స్థానికుల వివరాల ప్రకారం.. గత పది సంవత్సరాలుగా గంగులమ్మ క్యాన్సర్ వ్యాధితో పోరాడుతుండేదన్నారు. పరిస్థితి విషమించడంతో ఇవాళ చనిపోయినట్లు తెలిపారు.

News March 28, 2024

అన్నమయ్య: గుండెపోటుతో మున్సిపల్ కౌన్సిలర్ మృతి

image

అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి మున్సిపాలిటీలోని 30వ వార్డు కౌన్సిలర్ ఆసిఫ్ అలీ ఖాన్ గుండెపోటుతో గురువారం మద్యాహ్నం మృతిచెందారు. వైసీపీలో కీలక వ్యక్తి అయినటువంటి ఆసిఫ్ అలీ ఖాన్ మృతితో పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆ వార్డు పరిధిలో ఆయన పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారని స్థానికులు చెప్పుకొచ్చారు.

News March 28, 2024

కడప టీడీపీ MP అభ్యర్థిగా వారిలో ఎవరు .?

image

రానున్న ఎన్నికల్లో టీడీపీ తరఫున కడప MP అభ్యర్థిగా ఎవర్ని నియమించాలని అధిష్ఠానం మల్లగుళ్ళాలు పడుతుంది. రోజుకో కొత్త పేరుతో ఆసక్తి రేపుతోంది. వీరశివారెడ్డి, భూపేశ్‌రెడ్డి, రితీశ్‌రెడ్డి, ఉక్కు ప్రవీణ్, వాసు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇప్పటికే కడప పార్లమెంటులోని ప్రజలకు ఐవీఆర్ సర్వే ద్వారా వీరి పేర్లతో ఫోన్లు చేస్తుంది. ఎవరిని అభ్యర్థిగా ప్రకటిస్తారా అని టీడీపీ శ్రేణులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి.

News March 28, 2024

సీఎం సమక్షంలో వైసీపీలో చేరిన సాయినాథ్ శర్మ

image

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి కాశీబొట్ల సాయినాథ్ శర్మ గురువారం నంద్యాలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. వీరికి సీఎం జగన్ వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి, రాష్ట్ర ఆర్టీసీ ఛైర్మన్ దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, వైసీపీ నేత వెంకటసుబ్బారెడ్డి పాల్గొన్నారు.

News March 28, 2024

ప్రొద్దుటూరు: ‘చంద్రబాబు మేనిఫెస్టోను ప్రజలు నమ్మవద్దు’

image

రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు విడుదల చేసే మేనిఫెస్టోను ప్రజలు ఎవరు నమ్మవద్దని సీఎం జగన్ కోరారు. సిద్ధం సభలో సీఎం ప్రసంగిస్తూ మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసే వ్యక్తి చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. తమ పార్టీ చెప్పిన మేనిఫెస్టోను 99% నెరవేర్చినట్లు సీఎం పేర్కొన్నారు. మేనిఫెస్టోను రాజకీయ పార్టీలు పవిత్రమైన గ్రంథంగా భావించాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో 175కు 175 సాధించడానికి మేము సిద్ధం అని పేర్కొన్నారు.

News March 27, 2024

రాక్షస పాలన నుంచి విముక్తి కోరుకుంటున్నారు: మాధవి రెడ్డి

image

త్వరలో రాక్షస పాలన నుంచి విముక్తి కలుగుతోందని కడప టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రెడ్డప్ప గారి మాధవీ రెడ్డి ఎక్స్‌(ట్విటర్)లో పోస్ట్ చేశారు. అందులో ‘అవినీతి చేయడం సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం తప్ప జనాలకు ఏమైనా చేశారా… మీ రాక్షస పాలన నుంచి విముక్తిని కోరుకుంటున్నారు. ప్రజలు మీకు గుణపాఠం చెప్పే రోజులు దగ్గరే ఉన్నాయి’ అని ట్వీట్ చేశారు.

News March 27, 2024

బద్వేలు కూటమి అభ్యర్థిగా బొజ్జా రోషన్న

image

కడప జిల్లా బద్వేలు నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా బీజేపీ నాయకుడు రోషన్నను ఆ పార్టీ అధిష్ఠానం ఎంపిక చేసింది. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా పలువురు బీజేపీ అభ్యర్థులను ప్రకటిస్తూ తుది జాబితాను వెలువరించిన నేపథ్యంలో బద్వేలు అభ్యర్థిగా రోషన్నను ఎంపిక చేసింది. ఇటీవలే ఆయన టీడీపీ నుంచి బీజేపీలోకి చేరారు.