India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఇడుపులపాయ ఆర్కేవ్యాలీ ట్రిపుల్ ఐటీలో ఫైథాన్ స్టాక్ డెవలప్మెంట్ వర్క్ షాప్ నిర్వహించినట్లు డైరెక్టర్ కుమారస్వామి గుప్తా తెలిపారు. ఆదివారం ట్రిపుల్ ఐటీ సిఎస్ఇ విభాగంలో రిసోర్స్ పర్సన్ సంతోశ్ ఉద్యోగ ఎంపికకు అవసరమైన నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చి, విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఇంటర్వ్యూలకు హాజరైన విద్యార్థులకు పలు సలహాలు, సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.
✎దువ్వూరులో ఎర్రచందనం దుంగలు స్వాధీనం
✎మైదుకూరులో ‘ఫ్రెండ్షిప్ డే’ రోజున విషాదం
✎కడపలో ఇంటికి కన్నం వేసి.. రూ.లక్ష స్వాహా
✎బద్వేలు: తల్లిని చేసి కువైట్కు జారుకున్న వ్యక్తి
✎పెండ్లిమర్రి: కుక్కల దాడిలో 15 గొర్రెలు మృతి
✎అన్నమయ్య: బాలికపై అత్యాచారం
✎ నందలూరు: అడవిలో తప్పిపోయిన వ్యక్తి సేఫ్
✎ ఒంటిమిట్టలో మహిళపై దాడి
✎: ఎర్రగుంట్ల: కొడుకు అప్పులతో ఆత్మహత్య చేసుకున్న తండ్రి
దువ్వూరు మండలం దాసరిపల్లె అటవీ ప్రాంతంలో అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్న ముగ్గురిని అరెస్టు చేసి, 9 దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు మైదుకూరు అర్బన్ సీఐ మస్తాన్ తెలిపారు. ఆదివారం దువ్వూరు పోలీస్ స్టేషన్ సీఐ మాట్లాడుతూ.. దువ్వూరుకు చెందిన పోలయ్య, తమిళనాడుకు చెందిన వేలన్ మణి, రాజన్ ఎర్రచందనం తరలిస్తుండగా పట్టుకొని వారి వద్ద నుంచి 5 గొడ్డళ్లు, 3 సెల్ ఫోన్లు, ఒక కారును స్వాధీనం చేసుకున్నామన్నారు.
కడప జిల్లాలో ప్రయాణికులకు సౌకర్యవంతమైన రవాణా ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర రవాణా, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ తెలిపారు. కడప ఆర్టీసీ బస్టాండ్ ఆవరణంలో కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డితో కలిసి పూజలు నిర్వహించి, ఆర్టీసీ కొత్త బస్సులను ఆయన ప్రారంభించారు. ప్రతి జిల్లాలకు కొత్త ఆర్టీసీ బస్సులను తీసుకుని వచ్చి ప్రయాణికులకు సౌకర్యంగా రవాణా ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.
కడప జిల్లాలో ప్రయాణికులకు సౌకర్యవంతమైన రవాణా ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర రవాణా క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ తెలిపారు. కడప ఆర్టీసీ బస్టాండ్ ఆవరణంలో కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డితో కలిసి పూజలు నిర్వహించి, నూతన ఆర్టీసీ బస్సులను మండిపల్లి ప్రారంభించారు. ప్రతి జిల్లాలకు కొత్త ఆర్టీసీ బస్సులను తీసుకుని వచ్చి ప్రయాణికులకు సౌకర్యంగా రవాణా ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.
ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు సోమవారం ఉదయం కలెక్టర్ కార్యాలయంలో, డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కడప జిల్లా కలెక్టర్ శివశంకర్ తెలిపారు. జిల్లాలోని ప్రజలు రేపు ఉదయం 9.30 నుంచి 10.30 వరకు 08562- 244437 నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు. వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. SHARE IT
మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని 167 జాతీయ రహదారిపై ఇందిరమ్మ కాలనీ వద్ద ఆర్టీసీ బస్సును బైకు ఢీకొంది. ఈ ఘటనలో దువ్వూరు మండలం నేలటూరుకు చెందిన చందు దుర్మరణం చెందాడు. రాజేశ్ అనే యువకునికి తీవ్ర గాయాలయ్యాయి. 108లో కడప ఆసుపత్రికి తరలించారు. మైదుకూరు పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. వారిద్దరూ స్నేహితులని స్థానికులు తెలిపారు. దీంతో స్నేహితుల దినోత్సవం రోజు ఆ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
కడపకు స్టీల్ ప్లాంట్ కచ్చితంగా వస్తుందని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారయణ రెడ్డి స్పష్టం చేశారు. ఇవాళ విజయవాడలో పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్ ఒక్కడే రూ.2లక్షలు దోచేస్తే.. ఎమ్మెల్యే, మంత్రులు మరో రూ.2లక్షలు దోచేశారని ఆరోపించారు. పులివెందులలో వైఎస్ జగన్ను ప్రజలు కొట్టే పరిస్థితులు వస్తాయని చెప్పుకొచ్చారు. 2029లోనూ జగన్ను ఓడిస్తామని శపథం చేశారు.
ప్రొద్దుటూరు లోని నాగేంద్ర నగర్ కు చెందిన వెంకటరామిరెడ్డి అదే పట్టణంలోని ఓ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు. ఈయన కుమారుడు చేసిన అప్పులకు సంబంధించి కమలాపురం ప్రాంతానికి చెందిన ఒక కుటుంబంతో ఇటీవల వివాదం తలెత్తింది. ఈ క్రమంలో వారు అధ్యాపకుడి ఇంటి పైకి వచ్చి దాడికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో వెంకట్రామిరెడ్డి శనివారం ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్ కు వచ్చి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.
జిల్లాలోని BSNL యూజర్స్ 4Gకి అప్గ్రేడ్ కావాలని జిల్లా BSNL ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ పి.ముజీబ్ బాషా పేర్కొన్నారు. BSNL దేశవ్యాప్తంగా దశలవారీగా 4జీ టెక్నాలజీని ప్రవేశపెట్టిందని శనివారం కడపలో చెప్పుకొచ్చారు. 2జీ, 3జీ యూజర్లు 4జీ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. అంతరాయం కలిగినప్పుడు 54040కి sim అనే sms పంపడం ద్వారా కస్టమర్లు తమ సిమ్ రకాన్ని సిమ్ రకాన్ని(2జీ/3జీ/4జీ) సులభంగా తెలుసుకోవచ్చన్నారు.
Sorry, no posts matched your criteria.