India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వైవీయూ పరిధిలో డిగ్రీ కోర్సులలో చేరేందుకు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు ప్రవేశాలు పొందాలని వైవీయూ ప్రవేశాల సంచాలకులు డాక్టర్ లక్ష్మీప్రసాద్ తెలిపారు. డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆన్లైన్ అడ్మిషన్ మాడ్యూల్ ఫర్ డిగ్రీ కాలేజీల్లో వెబ్ ఆప్షన్ ప్రక్రియ మొదలైందని, ఇది ఈనెల 5వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు.
కడప జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమం 99.30% పూర్తయిందని కడప కలెక్టర్ శివశంకర్ లోతేటి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గురువారం మొదలైన పింఛన్ల పంపిణీ ప్రక్రియ శనివారానికి పూర్తయిందన్నారు. పెన్షన్ ప్రక్రియను రికార్డు స్థాయిలో పూర్తిచేసిన సచివాలయ ఉద్యోగులను ఈ సందర్భంగా కలెక్టర్ అభినందించారు. జిల్లాకు రాష్ట్రంలో మంచి పేరు తీసుకురావడం జరిగిందన్నారు.
కడప అంటే ఫ్యాక్షన్ అని చాలామంది అనుకుంటారు. కానీ మన కడప బంధాలకు, ఆప్యాయతలకు నిలయం. బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు వీడని బంధాలు ప్రతి ఒక్కరిలో భాగమే. ఇక స్కూల్ ఫ్రెండ్స్తో చేసిన చిలిపి పనులు లైఫ్లాంగ్ గుర్తుండిపోతాయి. ఎక్కడికెళ్లినా మన వెంట ఒకడు ఉండాల్సిందే. ఫేర్వెల్ పార్టీలో కన్నీరు పెట్టిన మిత్రులెందరో. అటువంటి మిత్రులు మీ జీవితంలో ఎవరైనా ఉన్నారా.. కామెంట్ చేయండి.
Happy Friendship Day
✎ ఇవాళ కడప మొదటి ఎంపీ వర్ధంతి
✎ పుల్లంపేటలో కరెంట్ షాక్తో బాలుడు మృతి
✎ ఉమ్మడి కడప జిల్లాలో సీఐల బదిలీలు
✎ కడప: పెన్షన్ల పంపిణీలో అలసత్వం.. నోటీసులు జారీ
✎ ఎర్రగుంట్లలో రైలు కిందపడి వ్యక్తి మృతి
✎ ప్రొద్దుటూరు: TDPలో చేరిన వైసీపీ కౌన్సిలర్లు
✎ కడప: ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్
✎ ఒంటిమిట్టలో సుగవాసి బ్యానర్లు చించివేత
✎ ఎర్రగుంట్ల RTPPలో క్రేన్ ఢీకొని వ్యక్తి మృతి.. బంధువుల ఆందోళన
రాజంపేట తహశీల్దార్ మహబూబ్ చాంద్కు కలెక్టర్ శివశంకర్ పోస్టింగ్ ఇచ్చారు. నందలూరుకు అమరనాథ్, రాయచోటికి పుల్లారెడ్డి, గాలివీడుకు భాగ్యలత, చిన్నమండెంకు నరసింహులు, వీరబల్లికి శ్రావణి, టి.సుండుపల్లిలో దైవాదీనం, అలాగే రాయచోటి ల్యాండ్స్ కలెక్టరేట్కు ఉదయశంకర్ రాజు, ఆర్డీఓ సూపరింటెండెంట్గా తులసమ్మ, కలెక్టరేట్ సూపరింటెండెంట్గా నాగభూషణం, ల్యాండ్ సూపరింటెండెంట్గా సుబ్రహ్మణ్యంని నియమించారు.
రాజంపేట టీడీపీ నేత సుగవాసి బాలసుబ్రహ్మణ్యం పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం రాత్రి మండల కేంద్రమైన ఒంటిమిట్టలో ఏర్పాటుచేసిన బ్యానర్లను అదే రోజు అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు. ఈ ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. దీనిపై ఒంటిమిట్ట ఎస్సై మధుసూదన్ రావుని వివరణ కోరగా పిర్యాదు అందలేదని తెలిపారు. కాగా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
1952లో CPI తరఫున కడప MPగా గెలిచిన ఎద్దుల ఈశ్వరరెడ్డి వర్ధంతి నేడు. 1915లో కడప జిల్లాలోని పెద్దముడియం మండలం పెద్దపసుపులలో జన్మించారు. రైతులు, కార్మికులు, అణగారిన వర్గాల సంక్షేమం కోసం వందల ఎకరాలు త్యాగం చేశారు. అంతేకాకుండా గాంధీతో కలిసి స్వాతంత్య్రోద్యమంలో పోరాడి నాలుగు నెలలపాటు జైలు జీవితం గడిపారని పలువురు నేతలు కొనియాడారు. 1962, 67, 71లోనూ ఎంపీగా విజయం సాధించారు. 1986 ఆగస్టు 3న తుదిశ్వాస విడిచారు.
ప్రొద్దుటూరు మున్సిపాలిటీలోని మరో ముగ్గురు వైసీపీ కౌన్సిలర్లు శనివారం టీడీపీలో చేరారు. వైసీపీకి చెందిన 16వ వార్డ్ కౌన్సిలర్ మోపురి రేవతి, 21వ వార్డు కౌన్సిలర్ కొవ్వూరు స్వాతి, 36 వార్డు కౌన్సిలర్ అలవలపాటి అరుణలకు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి టీడీపీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. శుక్రవారం <<13763825>>నలుగురు వైసీపీ కౌన్సిలర్లు<<>> టీడీపీలో చేరిన విషయం తెలిసిందే.
ఆర్థిక ప్రణాళికతో సంపద సృష్టిపై జాతీయ వెబినార్ ఈనెల 5వ తేదీన వైవీయూ కామర్స్ శాఖ, అసోషియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నది. వైవీయూలో వీసీ ప్రొ కె కృష్ణారెడ్డి, వెబినార్ కన్వీనర్, రిజిష్ట్రార్ ప్రొ ఎస్ రఘునాథరెడ్డి వెబినార్ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. వెబినార్ పాల్గొనే వారికి రిజిస్ట్రేషన్ రుసుము లేదని, ఈ సర్టిఫికెట్లు జారీ చేస్తామన్నారు.
కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని నాగేంద్ర నగర్కు చెందిన లింగాల వెంకటరామిరెడ్డి అనే వ్యక్తి ఎర్రగుంట్ల లో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం ఉదయం వెంటకరామిరెడ్డి ఆత్మహత్య చేసుకుని మృతి చెందడాన్ని స్థానికుల ద్వారా పోలీసులు తెలుసుకున్నారు. సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. గత కొద్ది రోజులుగా అప్పుల విషయంపై జరుగుతున్న తగాదాలో భాగంగా ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.
Sorry, no posts matched your criteria.