Y.S.R. Cuddapah

News August 3, 2024

ఆర్టీపీపీలో క్రేన్ ఢీకొని కాంట్రాక్టు లేబర్ వ్యక్తి మృతి

image

ఎర్రగుంట్ల మండల పరిధిలోని ఆర్టీపీపీలో శుక్రవారం సాయంత్రం క్రేన్ ఢీకొని, ముద్దనూరు చెందిన ఖాదర్ బాషా(49) అనే కాంట్రాక్ట్ లేబర్ తీవ్రంగా గాయపడి పొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. క్రేన్ డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని బంధువులు శనివారం ఉదయం నుంచి ఆర్టీపీపీలో ఆందోళన చేస్తున్నారు. బాధితుడి కుటుంబానికి న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు.

News August 3, 2024

వేంపల్లి: IIIT కౌన్సెలింగ్ లిస్ట్ విడుదల.. టైమింగ్స్ ఇవే.!

image

AP- RGUKT పరిధిలోని 4 IIITల్లో 2024-25 విద్యా సంవత్సర ప్రవేశాలకు తొలి విడత కౌన్సెలింగ్ లో 3396 సీట్లు భర్తీ అయ్యాయి. తొలి విడతలో అడ్మిషన్లు పొంది క్యాంపస్ మార్పుకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు లిస్టు, మిగిలిన సీట్ల భర్తీకి ఎంపిక చేసిన విద్యార్థుల సెకండ్ లిస్ట్ నేటి మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానుంది. కాగా లిస్టులను ఆర్జీయూకేటీ వెబ్సైట్ ‘www.rgukt.in’లో పొందుపరుస్తారని అధికారులు తెలిపారు.

News August 3, 2024

కడప: పెన్షన్ల పంపిణీలో అలసత్వం.. నోటీసులు జారీ

image

పెన్షన్ల పంపిణీలో అలసత్వం వహించడంపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప జిల్లా వ్యాప్తంగా 30 మండలాల్లో సచివాలయ సిబ్బంది ఉదయం 8 గంటల వరకు పింఛన్లు పంపిణీ ప్రారంభించలేదనే ఆరోపణతో, పెన్షన్ల పంపిణీ ఆలస్యంపై కారణం తెలపాలంటూ ఆయా మండలాల MPDOలకు ZP సీఈవో షోకాజ్ నోటీసులు జారీ చేశారు. జిల్లాలో మొత్తంగా 166 మంది సచివాలయ సిబ్బంది పెన్షన్ల ఆలస్యంగా పంపిణీ చేసినట్లు నోటీసుల్లో పాల్గొన్నారు.

News August 3, 2024

కడప: పెన్షన్ల పంపిణీలో అలసత్వం.. నోటీసులు జారీ

image

పెన్షన్ల పంపిణీనీలో అలసత్వం వహించడంపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప జిల్లా వ్యాప్తంగా 30 మండలాల్లో సచివాలయ సిబ్బంది ఉదయం 8 గంటల వరకు పింఛన్లు పంపిణీ ప్రారంభించలేదనే ఆరోపణతో, పెన్షన్ల పంపిణీ ఆలస్యంపై కారణం తెలపాలంటూ ఆయా మండలాల MPDOలకు ZP సీఈవో షోకాజ్ నోటీసులు జారీ చేశారు. జిల్లాలో మొత్తంగా 166 మంది సచివాలయ సిబ్బంది పెన్షన్ల ఆలస్యంగా పంపిణీ చేసినట్లు నోటీసుల్లో పాల్గొన్నారు.

News August 3, 2024

కడప జిల్లాలోని పలు మండలాల్లో మోస్తరు వర్షం

image

జిల్లాలోని పలు మండలాల్లో శుక్రవారం తెల్లవారుజామున ఒక మోస్తరు వర్షం కురిసింది. సిద్ధవటంలో అత్యధికంగా 6.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. బి కోడూరులో 1.8 మిల్లీమీటర్లు, బద్వేలులో 1.2 మిల్లీమీటర్లు, ప్రొద్దుటూరులో 0.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. దీంతో ఈ ప్రాంతాల్లో పంటలు సాగుచేసిన కాస్త ఊరట కలిగింది.

News August 3, 2024

కడప: కరెంట్ షాక్‌తో.. బాలుడు మృతి

image

ఎలక్ట్రిక్ వాటర్ హీటర్ షాక్ కొట్టి మూడేళ్ల బాలుడు చనిపోయిన విషాద ఘటన పుల్లంపేట మండలం దలవాయిపల్లెలో చోటు చేసుకుంది. బిందుప్రియకు మూడేళ్ల కుమారుడు జాన్ వెస్లిన్ ఉన్నాడు. తల్లి శుక్రవారం వేడినీటి కోసం బాత్రూంలోని బకెట్‌లో వాటర్ హీటర్‌ను ఉంచి ఆన్ చేసింది. తల్లి ఇంట్లో పని చేసుకుంటుండగా ఆడుకుంటూ అటువైపుగా వెళ్లిన బాలుడు దానిని తాకాడు. దీంతో విద్యుత్ షాక్‌కు గురై చిన్నారి అక్కడికక్కడే మృతి చెందాడు.

News August 3, 2024

జిల్లాలో చేనేతలకు ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకొస్తాం: కడప కలెక్టర్

image

కడప జిల్లాలో ఉత్పత్తి అయ్యే చేనేతలకు ప్రపంచ స్థాయి గుర్తింపును తీసుకొస్తామని జిల్లా కలెక్టర్ శివశంకర్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో చేనేత సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మైలవరం మండలం టెక్స్‌టైల్ పార్క్ అభివృద్ధి పనులపై సమావేశం నిర్వహించారు. చేనేతలకు ప్రపంచ స్థాయి గుర్తింపును తీసుకువచ్చేందుకు ప్రభుత్వం నుంచి అన్ని విధాల సహాయ సహకారాలు అందేలా చర్యలు చేపడతామన్నారు.

News August 2, 2024

వైవీయూలో నృత్య, సంగీత కోర్సుల్లో ప్రవేశాలు

image

YVUలో కూచిపూడి నృత్యం, కర్ణాటక సంగీతం, కీబోర్డ్ సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలను ప్రారంభించనున్నట్లు ప్రవేశాల సంచాలకుడు డా.టి.లక్ష్మి ప్రసాద్ తెలిపారు. ప్రవేశాలు ఈ నెల 8వ తేదీ నుంచి 22 వరకు DOA కార్యాలయంలో జరుగుతాయని తెలిపారు. ఆసక్తి కల అభ్యర్థులు www.yvu.edu.in వెబ్సైట్ సంప్రదించాలన్నారు. పదేళ్ల వయసు నుంచి ఆపై ఉన్నవారు అర్హులన్నారు.

News August 2, 2024

రాయచోటిలో ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య

image

రాయచోటిలోని విద్యుత్ సబ్ స్టేషన్ సమీపంలోని ఓ ఇంట్లో ఉరివేసుకొని నాసిర్ హుస్సేన్ అనే హిందీ ఉపాధ్యాయుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కొంతకాలంగా భార్యాభర్తలు విడివిడిగా ఉండడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. మృతుడు వీరబల్లి మండలం, యర్రంరాజుగారిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. మృతదేహాన్ని పోలీసులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

News August 2, 2024

కడప జిల్లాలో రైల్వే కవచ్

image

ఒకే లైనుపై రైళ్లు ఎదురెదురుగా వచ్చినప్పుడు ఢీ కొనకుండా ముందస్తుగా ప్రమాదాన్ని పసిగట్టి నివారించే వ్యవస్థ కవచ్‌ను కడప జిల్లాలో అమలు చేయడానికి రంగం సిద్ధమవుతోంది. ఈ మేరకు సంబంధిత సిగ్నల్ అండ్ టెలి కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ నుంచి రైల్వే మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు వెళ్లాయి. ఇది కార్యరూపం దాలిస్తే ముంబై – చెన్నై మార్గంలో నాల్వార్, గుంతకల్, నందలూరు, రేణిగుంట లైనులో ఈ వ్యవస్థ అమలు కానుంది.