India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కడప జిల్లాలోని కడప, జమ్మలమడుగు, పులివెందుల, బద్వేలు ఆర్డీవో కార్యాలయాల ఏవోలను నియమిస్తూ జిల్లా కలెక్టర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. జమ్మలమడుగు ఆర్డీఓ కార్యాలయ ఏవోగా డి. తిరుపతయ్య, పులివెందుల ఆర్డీవో కార్యాలయ ఏవోగా ఎంఏ రమేశ్, బద్వేల్ ఆర్డీవో కార్యాలయ ఏవోగా సి. అక్బల్ బాషా, కడప ఆర్డీవో కార్యాలయ ఏవోగా పి. శంకర్ రావు నియమితులయ్యారు.
కడప జిల్లాలో గురువారం నిర్వహించిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో రాష్ట్రంలో జిల్లాకు నాలుగవ స్థానం లభించింది. మొత్తం 2,64,013 మంది లబ్ధిదారులకు గాను.. 2,58,100 మంది (97.76%)కి పెన్షన్ను పంపిణీ చేశామన్నారు. అందుకుగాను పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు, సిబ్బందికి జిల్లా కలెక్టర్ శివశంకర్ అభినందనలు తెలిపారు.
కడప జిల్లా చెన్నూరు మండలం ఉప్పరపల్లిలో విషాదం చోటుచేసుకుంది. మృతుడి కుటుంబీకుల వివరాల ప్రకారం.. ఉప్పరపల్లికి చెందిన గాజులపల్లె శివ కడప నబి కోటకు చెందిన కొప్పర్తి మోహన్ రెడ్డి అనే వ్యక్తి దగ్గర అప్పు తీసుకున్నాడు. అప్పు తీర్చమని కడప ఏడు రోడ్ల కూడలి వద్ద శివను షర్టు పట్టుకొని అసభ్యంగా తిడుతూ కొట్టాడు. దీంతో అవమాన భారంతో తన ఇంట్లో ఉరి వేసుకుని మరణించాడని కుటుంబీకులు తెలిపారు.
పులివెందుల – కదిరి ప్రధాన రహదారిపై ఉదయం ఆటోని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు ఒకరు మృతి చెందగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని స్థానికులు తెలిపారు. మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కూలి పనులు నిమిత్తం పులివెందుల ప్రాంత గ్రామాలకు వెళుతుండగా ప్రమాదం జరిగినట్టు బాధితులు తెలిపారు. వీరంతా సత్య సాయి జిల్లా బట్రేపల్లి వాసులు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
కడప జిల్లా కొప్పర్తి పారిశ్రామికవాడలో నూతన పరిశ్రమల ఆవిర్భావంతో పాటు ఉత్పత్తులు కూడా ప్రారంభం అయ్యాయని, జిల్లాలో ఉద్యోగ ఉపాధి అవకాశాలకు కొదవలేదని జిల్లా కలెక్టర్ శివ శంకర్ పేర్కొన్నారు. గురువారం సాయంత్రం ఉప్పర్తిలోని 54 ఎకరాల ఏర్పాటు, ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్లను JCతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. జిల్లాకే తలమానికంగా కొప్పర్తి పారిశ్రామికవాడలో పరిశ్రమలు రూపుదిద్దుకుంటున్నాయన్నారు.
ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి గర్భాలయాన్ని రెండు నెలలపాటు మూసివేస్తున్నట్లు టీటీడీ ఆగమ అర్చకులు రాజేశ్ బట్టార్ తెలిపారు. గురువారం ఒంటిమిట్ట టీటీడీ పాలక భవనంలో పురావస్తు శాఖ వారితో టీటీడీ అధికారులు, అర్చకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భాలయం మరమ్మతుల్లో భాగంగా సెప్టెంబర్ 8వ తేదీ నుంచి 2నెలలపాటు బాలాలయంలో ఏర్పాటు చేసిన ఉత్సవ విగ్రహాలతో దర్శన భాగ్యం కల్పించాలని నిర్ణయించారు.
తల్లిపాలే బిడ్డకు శ్రేయస్కరమని కడప జిల్లా కలెక్టర్ శివశంకర్ పేర్కొన్నారు. గురువారం ఆయన ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో తల్లిపాల వారోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. బిడ్డకు తొలి ఆహారం తల్లి పాలేనని, టీకా కూడా తల్లిపాలతో సమానమేనన్నారు. శిశువు ఆరోగ్యంగా ఎదగాలంటే 100% తల్లిపాలు ఎంతో అవసరమని స్పష్టం చేశారు.
పుల్లంపేట మండలం అనంతయ్యగారి పల్లి గ్రామం వద్ద గల సెల్ టవర్ వద్ద, సుమారు 35 సంవత్సరాలు వయసు గల వ్యక్తి మృతి చెందాడని పుల్లంపేట పొలీసులు తెలిపారు. సదరు వ్యక్తి నలుపు, తెలుపు చెక్స్ కలిగిన ఫుల్ చొక్కా, బ్లూ కలర్ నైట్ ప్యాంటు ధరించి ఉన్నాడని, ఫోటోలోని వ్యక్తిని గుర్తించిన ఎడల పుల్లంపేట పోలీస్ వారికి తెలపాలని కోరారు.
కడప జిల్లాలో గురువారం నిర్వహించిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో రాష్ట్రంలో జిల్లాకు నాలుగవ స్థానం లభించింది. మొత్తం 2,64,013 మంది లబ్ధిదారులకు గాను.. అందుబాటులో ఉన్న 2,58,100 మందికి, పెన్షన్ మొత్తాన్ని సచివాలయ సిబ్బందిచేత 97.76% పంపిణీ చేసి రాష్ట్రంలో నాలుగవ స్థానంలో నిలవడం జరిగింది. అందుకుగాను పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు, సిబ్బందికి జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటీ తెలిపారు.
కడప జిల్లాలో పనిచేస్తున్న పోలీసులు, సిబ్బంది సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తానని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. పోలీసు సిబ్బంది సంక్షేమంలో భాగంగా జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న విభాగాలను ఎస్పీ హర్షవర్ధన్ రాజు పరిశీలించారు. కల్పతరు పోలీస్ వెల్ఫేర్ స్టోర్స్ సందర్శించి, అందులో లభించే కిరాణా ఎలక్ట్రికల్ వస్తువులు గురించి ఆరా తీశారు. నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు.
Sorry, no posts matched your criteria.