Y.S.R. Cuddapah

News August 21, 2024

కడప: ‘పరిశ్రమల స్థాపనకు రాయితీలు’

image

కడప జిల్లాలో నూతన పరిశ్రమల స్థాపన కోసం ఔత్సాహికులకు మరింత ప్రోత్సాహాన్ని అందివ్వడంతో పాటు, ప్రభుత్వం అన్ని రకాల రాయితీలను అందిస్తుందని జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి మంగళవారం పేర్కొన్నారు. కలెక్టరేట్లోని ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) హాలులో జిల్లా పారిశ్రామిక ఎగుమతులు, ప్రోత్సాహక కమిటీ (డీఐఈపీసీ) ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

News August 20, 2024

సుండుపల్లె: ఎర్రచందనం స్మగ్లర్లు పరార్

image

ఎర్రచందనం అక్రమంగా తరలించేందుకు డస్టర్ వాహనంలో స్మగ్లర్లు సుండుపల్లె మీదుగా అడవిలోకి చొరబడేందుకు, ప్రయత్నాలు జరుగుతున్నాయని ముందస్తుగా సమాచారం రావడంతో వారిని పట్టుకునే ప్రయత్నంలో పరార్ అయినట్లు సానిపాయి రేంజర్ చంద్రశేఖర్ రెడ్డి మంగళవారం తెలిపారు. సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో పరారైన 6 మంది స్మగ్లర్ల వద్దనుంచి డస్టర్ వాహనం, 5 గొడ్డళ్లు, 1 రంపం, 8 చిన్న బియ్యం ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.

News August 20, 2024

అక్రమ లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేయవద్దు: కమీషనర్

image

రాజంపేట పట్టణ పరిధిలో అనుమతి లేకుండా వేసిన లేఅవుట్లలో స్థలాలు కొనుగోలు చేయవద్దని, రాజంపేట మున్సిపల్ కమీషనర్ రాంబాబు హెచ్చరించారు. పట్టణ పరిధిలోని సర్వే నంబర్ 1262, 1263, 1264లలో 2.61 విస్తీర్ణంలో వేసిన ప్లాట్లకు ఎలాంటి అనుమతి లేదన్నారు. ఈ ప్లాట్లకు అమ్మకం,కొనుగోళ్లపై రిజిస్ట్రేషన్ జరగదని తెలిపారు. భవన నిర్మాణానికి అనుమతి ఇవ్వరని వివరించారు. మౌలిక వసతులు కల్పించబోమని అన్నారు.

News August 20, 2024

అక్రమ లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేయవద్దు: కమీషనర్

image

రాజంపేట పట్టణ పరిధిలో అనుమతి లేకుండా వేసిన లేఅవుట్లలో స్థలాలు కొనుగోలు చేయవద్దని, రాజంపేట మున్సిపల్ కమీషనర్ రాంబాబు హెచ్చరించారు. పట్టణ పరిధిలోని సర్వే నంబర్ 1262, 1263, 1264లలో 2.61 విస్తీర్ణంలో వేసిన ప్లాట్లకు ఎలాంటి అనుమతి లేదన్నారు. ఈ ప్లాట్లకు అమ్మకం,కొనుగోళ్లపై రిజిస్ట్రేషన్ జరగదని తెలిపారు. భవన నిర్మాణానికి అనుమతి ఇవ్వరని వివరించారు. మౌలిక వసతులు కల్పించబోమని అన్నారు.

News August 20, 2024

రోడ్డు ప్రమాదంలో సరస్వతిపల్లెకు చెందిన వ్యక్తి మృతి

image

కర్నూలులో జరిగిన రోడ్డు ప్రమాదంలో రామాపురం మండలం సరస్వతిపల్లెకు చెందిన పెంచలయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. పెంచలయ్య గ్యాస్ సిలిండర్లను ఏజెన్సీలకు తరలిస్తూ ఉంటాడు. అయితే పనిలో భాగంగా కర్నూలు జిల్లా నుంచి గ్యాస్ సిలిండర్ల లోడుతో లారీలో వెళ్తుండగా.. డోన్ వద్ద ఆగి ఉన్న ఇంకో లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలున్నారు.

News August 20, 2024

రోడ్డు ప్రమాదంలో సరస్వతిపల్లెకు చెందిన వ్యక్తి మృతి

image

కర్నూలులో జరిగిన రోడ్డు ప్రమాదంలో రామాపురం మండలం సరస్వతిపల్లెకు చెందిన పెంచలయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. పెంచలయ్య గ్యాస్ సిలిండర్లను ఏజెన్సీలకు తరలిస్తూ ఉంటాడు. అయితే పనిలో భాగంగా కర్నూలు జిల్లా నుంచి గ్యాస్ సిలిండర్ల లోడుతో లారీలో వెళ్తుండగా.. డోన్ వద్ద ఆగి ఉన్న ఇంకో లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలున్నారు.

News August 20, 2024

లంచగొండి అధికారులు సెలవుపై వెళ్లండి: ఎమ్మెల్యే వరద

image

ప్రొద్దుటూరు సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని MLA వరదరాజుల రెడ్డి మంగళవారం తనిఖీ చేశారు. లంచగొండి అధికారులు సెలవుపై వెళ్లాలన్నారు. సబ్ రిజిస్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న ముగ్గురు సిబ్బంది రిజిస్ట్రేషన్‌కు వచ్చిన వచ్చిన వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని, లంచాల ద్వారా వచ్చిన సొమ్మును రిజిస్టర్ ఆఫీస్ సిబ్బందికి వాటాలు పంచుతున్నారని ఎమ్మెల్యే రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీకి ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు.

News August 20, 2024

లంచగొండి అధికారులు సెలవుపై వెళ్లండి: ఎమ్మెల్యే వరద

image

ప్రొద్దుటూరు సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని MLA వరదరాజుల రెడ్డి మంగళవారం తనిఖీ చేశారు. లంచగొండి అధికారులు సెలవుపై వెళ్లాలన్నారు. సబ్ రిజిస్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న ముగ్గురు సిబ్బంది రిజిస్ట్రేషన్‌కు వచ్చిన వచ్చిన వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని, లంచాల ద్వారా వచ్చిన సొమ్మును రిజిస్టర్ ఆఫీస్ సిబ్బందికి వాటాలు పంచుతున్నారని ఎమ్మెల్యే రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీకి ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు.

News August 20, 2024

కడప: సులభంగా సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు

image

జిల్లాలోని విద్యుత్ వినియోగదారులు ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకం ద్వారా సులభంగా సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసుకోవచ్చని APSPDCL ఎస్ఈ రమణ తెలిపారు. ఒక కిలో వాట్ సోలార్ రూఫ్ టాప్‌కు రూ.70 వేలు, 2 కిలోవాట్లకు రూ.1.40 లక్షలు, 3 కిలోవాట్లకు రూ.2.10 లక్షలు ఖర్చవుతుందని, PMSGY పథకం ద్వారా 1 కిలోవాట్‌కు రూ.30,000, 2 కిలోవాట్లకు రూ.60,000, 3 కిలోవాట్లకు రూ.78000 చొప్పున ప్రభుత్వం రాయితీ ఇస్తుందన్నారు.

News August 20, 2024

ప్రొద్దుటూరు టౌన్ బ్యాంకు ఛైర్మన్‌గా బొగ్గుల వెంకట సుబ్బారెడ్డి

image

ప్రొద్దుటూరు కో-ఆపరేటివ్ బ్యాంకు ఛైర్మన్ పదవి TDP ఖాతాలోకి చేరింది. YCP తరఫున ఉన్న ఛైర్మన్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు ఛైర్మన్ పదవికి సోమవారం ఎన్నికలు జరిగాయి. TDP అభ్యర్థిగా 4వ డైరెక్టర్ బొగ్గుల వెంకటసుబ్బారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈయనకు పోటీగా ఎవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో ఛైర్మన్‌గా వెంకట సుబ్బారెడ్డి ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారి ఎ.రాజశేఖర్ ప్రకటించారు.