India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఆయన తనయుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఘనంగా నివాళులర్పించారు. ఇడుపులపాయలోని తన తండ్రి సమాధి వద్ద తన తల్లి వైఎస్ విజయమ్మ, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. జగన్ వెంట మాజీ ఎమ్మెల్యేలు, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
రాయచోటిలో ఆదివారం దారుణ హత్య జరిగింది. రాయచోటి మసీదు వీధికి చెందిన ఇర్షాద్ అలీ రెడ్డిబాషా కుమార్తెను వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో ఆమె సోదరుడు ఇబ్రహీం(22) తరచూ మద్యం తాగి సోదరి ఇంటికి వచ్చి వేధింపులకు గురి చేసేవాడు. దీంతో విసుగుచెందిన ఇర్షాద్ బావమరిదిని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే మద్యం తాగుదామని చెప్పి గున్నికుంట్లకు తీసుకెళ్లి ఫుల్లుగా తాగించి బీరుసీసాతో గొంతు కోసి హత్య చేశాడు.
పులివెందుల: రాబోయే కాలంలో ప్రతీ కార్యకర్తకు తనతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటుందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భరోసానిచ్చారు. పులివెందుల పర్యటనలో భాగంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు, మాజీ నేతలతో కూడా చర్చించారు. కార్యకర్తలు, నాయకులు ఎవరూ అధైర్యపడవద్దు, పార్టీ అండగా ఉంటుందని, అందరం కలిసి కట్టుగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని వివరించారు.
చాపాడు మండలం పల్లవోలు వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. ప్రొద్దుటూరు నుంచి మైదుకూరు వీరయ్య(60) బైకుపై వెళ్తుండగా వెనుక వైపు నుంచి వేగంగా కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వీరయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. కారులో ఉన్నవారు మద్యం మత్తులో ఉన్నారని స్థానికులు తెలిపారు. కాగా మృతుడు నాగులపల్లెకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.
చిత్తూరు – కర్నూల్ ఎన్హెచ్పై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరో కోణం వెలుగులోకి వచ్చింది. కడపకు చెందిన ఐదుగురు రాత్రి కారులో గువ్వలచెరువులో పాలకోవ తినడానికి వెళ్లారు. తినేసి వస్తున్న సమయంలో ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీకొట్టారు. దీంతో అక్కడికక్కడే నలుగురు మృతి చెందగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న మంత్రి మండిపల్లి సొంత నిధుల నుంచి రూ.లక్ష తక్షణ సాయం కింద అందించారు.
ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రేపు కడప జిల్లాకు రానున్నారు. తన తండ్రి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతిని పురస్కరించుకొని ఇడుపులపాయలోని ఆయన సమాధి వద్ద నివాళులు అర్పించేందుకు ఆమె జిల్లాకు రానున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. తన తండ్రికి నివాళులు అర్పించిన అనంతరం ఆమె విజయవాడకు వెళ్ళనున్నారు. సాయంత్రం వైఎస్ జయంతి సభకు తెలంగాణ సీఎం రానున్న విషయం తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం పూర్వ రాష్ట్ర సభ్యుడు డా.తవ్వా వెంకటయ్య ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి జీవితంపై పుస్తకం రచించారు. ‘ఓ ధీరుడి పయనం సమరం నుంచి సంక్షేమం వైపు’ అనే పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇవాళ పులివెందులలోని తమ స్వగృహంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకటయ్య చేసిన కృషిని కొనియాడుతూ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
పెట్టుబడులపై అధిక లాభాలు ఇస్తామని ఆన్లైన్ ద్వారా మోసానికి పాల్పడిన ఓ యాప్పై కేసు నమోదు చేసినట్లు బి. కొత్తకోట సీఐ సూర్యనారాయణ తెలిపారు. పట్టణానికి చెందిన మన్సూర్ అలీ ఆన్లైన్ ద్వారా ఓ యాప్కు ఇటీవల విడతల వారీగా రూ.3,14,300 డబ్బు పంపాడు. అయితే ఈ నగదును తిరిగి చెల్లించకుండా బాధితుడి ఖాతాను మూసివేశారు. దీంతో తాను మోసపోయినట్లు గ్రహించి ఫిర్యాదు ఇవ్వడంతో సీఐ కేసు నమోదు చేశారు.
శనివారం రామాపురం మండలం కొండ్లవాండ్లపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు స్నేహితులు అక్కడికక్కడే మృతి చెందారు. వీరంతా కడప వాసులేనని పోలీసులు గుర్తించారు. రాజారెడ్డి వీధికి చెందిన అలీఖాన్(35) ఇటీవల కారు కొన్నాడు. కారును టెస్ట్ డ్రైవ్ చేద్దామని తన స్నేహితులు జితేంద్ర (25), షేక్ అలీం (30), ఆంజనేయులు నాయక్ (28)తో కలిసి వెళ్లారు. కానీ.. మృత్యువు అనే రాకాసి వారిని తీసుకెళ్లింది.
మండలంలోని వసంతపురం గ్రామానికి చెందిన రెండు నెలల బాలుడు శనివారం మృతిచెందాడు. ఏఎన్ఎం వ్యాధులు రాకుండా చిన్నారులకు శనివారం వ్యాధి నిరోధక టీకా వేసింది. అందులో భాగంగా రెండు నెలల బాలుడికి టీకా వేయించిన తల్లి అనంతరం పడుకోబెట్టింది. ఎంతసేపటికీ బాలుడు నిద్ర లేవకపోవడంతో కుటుంబ సభ్యులు గమనించి వెంటనే పెద్దచెప్పలి పీహెచ్సీకి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు.
Sorry, no posts matched your criteria.