India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గండి క్షేత్రంలోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం ఆలయ అసిస్టెంట్ కమిషనర్ సుబ్బయ్యపై, ఆలయ ఛైర్మన్ కావలి కృష్ణతేజ జిల్లా కలెక్టర్ శివశంకర్కి ఫిర్యాదు చేశారు. శ్రావణమాస ఉత్సవాలలో ఆలయ ధర్మకర్తల మండలి సభ్యుల విషయంలో ప్రొటోకాల్ను ఉల్లంఘించారని ఆరోపించారు. గోడ పత్రాలు, ప్రచార పత్రాల్లో ఛైర్మన్, పాలకమండలి సభ్యుల వివరాలు లేకుండా అసిస్టెంట్ కమిషనర్ నిర్వహణ పేరుతో అవమానపరిచారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
తల్లిపాలు బిడ్డకు అమృతాహారం.. ప్రపంచంలో నేటి వరకు తల్లి పాలకు ప్రత్యామ్నాయం ఏదీ లేదని, శిశువు ఆరోగ్యంగా ఎదగడంలో తల్లిపాలు కీలకపాత్ర పోషిస్తాయని కడప జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి పేర్కొన్నారు. కడప రిమ్స్ ఆసుపత్రిలో తల్లిపాల వారోత్సవాలను నిర్వహించారు. అమ్మపాలే నూటికి నూరు శాతం పోషక విలువలు కలిగి ఉంటాయని అన్నారు.
ఫుడ్ కమిషన్ ఛైర్మన్ విజయ్ కుమార్ యూట్యూబ్ వీడియోల్లో చేసిందంతా హంగామానేనా అని టీడీపీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ ఎద్దేవా చేశారు. బుధవారం మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ‘రెండేళ్లపాటు వీడియో రికార్డింగ్ బృందాన్ని వెంటేసుకొని అంగన్వాడీ టీచర్లపై కేసులు పెట్టేస్తా, సస్పెండ్ చేస్తా అని చెప్పిన మాటలన్నీ ఉత్తివే.. ఎవరిమీద ఒక్క కేసు కూడా పెట్టలేదు’ అని దుయ్యబట్టారు.
జిల్లాలో ఆగస్టు నెలకి సంబంధించిన సామాజిక పెన్షన్ల పంపిణీ జరుగుతోంది. ఇందులో భాగంగా 2,64,014 పెన్షన్లకు గాను 2,07,306 పెన్షన్లను పంపిణీ చేసి 78.52% పూర్తి అయింది. ఉదయాన్నే ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్ దారుల ఇంటి దగ్గరకి వెళ్లి పంపిణీ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్త పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో కడప జిల్లా నాల్గవ స్థానంలో కొనసాగుతోంది.
కడప జిల్లా వ్యాప్తంగా నేడు జరిగే పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో సిబ్బంది అలసత్వం వహిస్తే చర్యలు తప్పని కలెక్టర్ శివశంకర్ హెచ్చరించారు. కడప కలెక్టర్ కార్యాలయంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పెన్షన్ల పంపిణీ కోసం బయోమెట్రిక్ యాప్ను ఇబ్బంది లేకుండా చూసుకోవాలన్నారు. ఎక్కడ చిన్న పొరపాటు జరగడానికి వీల్లేదని స్పష్టం చేశారు.
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జయప్రదం చేయాలని కడప జిల్లా కలెక్టర్ శివ శంకర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ అతిథి సింగ్ ఇతర అధికారులతో వేడుకల నిర్వహణకు సంబంధించి సమీక్ష నిర్వహించారు. కడప పోలీస్ మైదానంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో లోపాలు లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు.
కడప జిల్లాలో పలువురు సీఐలను బదిలీ చేస్తూ కర్నూలు డీఐజీ ప్రవీణ్ ఆదేశాలు జారీ చేశారు. కడప చిన్న చౌక్ సీఐగా తేజోమూర్తి, 1 టౌన్ సీఐగా రామకృష్ణ, మైదుకూరు రూరల్ సీఐగా శివశంకర్, ఎర్రగుంట్ల సీఐగా నరేశ్ బాబును నియమించారు. ఖాజీపేట సీఐ రామంజిని మంత్రాలయం సీఐగా బదిలీ చేశారు. కడప చిన్న చౌక్, వన్ టౌన్, మైదుకూరు రూరల్, ఎర్రగుంట్ల సీఐలను వీఆర్లో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశాలు జారి చేశారు.
కడప జిల్లా వ్యాప్తంగా పలువురు DSPలను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పులివెందుల DSP వినోద్ కుమార్, ప్రొద్దుటూరు DSP మురళీధర్ ఇరువురిని పోలీస్ హెడ్ క్వాటర్స్లో రిపోర్ట్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ప్రొద్దుటూరు DSPగా భక్తవత్సలం, కడప డీపీటీసీ DSPగా ఉన్న రవికుమార్ను ఆళ్లగడ్డ DSPగా బదిలీ చేశారు.
రావులకోలనులో దంపతుల మధ్య విభేదాలు నెలకొనడంతో వేర్వేరుగా ఉంటున్నారు. వీరి కుమార్తె (14) తల్లి సంరక్షణలో ఉంటోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 28న ఫోనులో తండ్రికి కాల్ చేసి యోగక్షేమాలు తెలుసుకుంది. విషయం తల్లికి తెలియడంతో కుమార్తె చేతులపై వాతలు పెట్టింది. వెంటనే స్థానికులు చికిత్స నిమిత్తం పులివెందులకు తరలించారు. విషయం తెలుసుకున్న తండ్రి కూతురితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల కేసు నమోదు చేశారు.
మండలంలోని టీ కోడూరు గ్రామంలో ఆధిపత్యం కోసం ఆదివారం జరిగిన ఘర్షణకు సంబంధించి 29 మందిపై కేసు నమోదు చేసి, గన్ స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు. కోడూరుకు చెందిన పవన్ కుమార్ రెడ్డి, ఎంపీటీసీ రామమునిరెడ్డి మధ్య వాగ్వాదం జరిగి ఒకరిపై ఒకరు రాళ్లు వేసుకోగా ఇరువర్గాల వారికి గాయాలయ్యాయి. ఈ క్రమంలో ఎంపీటీసీ మునిరెడ్డి గాలిలో గన్తో ఒక రౌండ్ కాల్పులు జరిపారు.
Sorry, no posts matched your criteria.