India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కడపలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ విభాగంలో గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేసేందుకు ఆసక్తి, అర్హత కలిగిన మహిళా అభ్యర్థులకు నేడు వాక్ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ సలీంబాషా తెలిపారు. MSC కంప్యూటర్సైన్స్, ఎంటెక్ కంప్యూటర్ సైన్స్, ఎంటెక్ డేటా సైన్స్లోలో కనీసం 55 శాతం మార్కులు ఉండాలన్నారు. నెట్/సెట్/స్లెట్, PHD అర్హత కలిగిన వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు.
YSR జిల్లా పులివెందులలోని జగనన్న మెగా హౌసింగ్ లేఅవుట్లలో భారీ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. లబ్ధిదారుల కోసం గత వైసీపీ ప్రభుత్వం 8468 ఇళ్ల నిర్మాణం చేపట్టగా, 2,489 ఇళ్లు అనర్హులకు కేటాయించినట్లు తాజాగా గుర్తించారు. జగనన్న లేఅవుట్లలో విచారణ జరపాలని ఇటీవల ప్రభుత్వానికి ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి లేఖ రాసిన నేపథ్యంలో, జిల్లా కలెక్టర్ శివ శంకర్ విచారణ జరిపి, 2,489 మంది అనర్హులు ఉన్నట్లు తేల్చారు.
కడప జిల్లా వ్యవసాయ అధికారి నాగేశ్వరరావు తాళ్ళపల్లి రైతు సేవా కేంద్ర పరిధిలోని పత్తి పంట పొలాలను సందర్శించారని, వేంపల్లె మండల వ్యవసాయ అధికారి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఇందులో భాగంగా మంగళవారం ప్రతి రైతుకు, రైతు సేవా కేంద్రంలో సిబ్బంది అందరికీ అందుబాటులో ఉండాలని, అలాగే ప్రతి రోజు పొలం పరిసరాలను సందర్శించాలని తెలిపారు. పొలాల్లో రైతు సందేహాలను నివృత్తి చేస్తూ, నూతన పంట పద్ధతులపై అవగాహన కల్పించారు.
అన్నమయ్య జిల్లా రాజంపేట డీఎస్పీ చైతన్యను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత వైసీపీ ప్రభుత్వంలో తాడిపత్రి డిఎస్పీగా ఉన్న సమయంలో ఆయనపై అనేక విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత రాజంపేట DSPగా రావడం, ఎన్నికల సమయంలో తిరిగి తాడిపత్రి ఇన్ఛార్జ్ డీఎస్పీగా వెళ్లిన సమయంలో గొడవలు జరిగిన విషయం తెలిసిందే. తాజాగా ఆయనను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.
ఆగస్టు 1వ తేదీన “ఎన్టీఆర్ భరోసా పెన్షన్” లబ్ధిదారులందరికీ ఇంటి వద్దనే 100% పెన్షన్ పంపిణీ చేసేలా.. అన్ని విధాలా సన్నద్ధంగా ఉన్నామని కడప జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి పేర్కొన్నారు. విజయవాడ నుంచి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ వీసీ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. ఒకటో తేదీ 100% పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
కడప జిల్లాలో గంజాయి నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర హోం మంత్రి అనిత సూచించారు. వైజాగ్ నుంచి హోంమంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కడప ఎస్పీ కార్యాలయం నుంచి ఎస్పీ హర్షవర్ధన్ రాజు హాజరయ్యారు. సైబర్ నేరాలను అరికట్టేందుకు విస్తృతంగా అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. గంజాయి నిర్మూలనే లక్ష్యంగా రూపొందించిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలుకు, గట్టి చర్యలు తీసుకోవాలని సూచించారు.
కడప జిల్లాలో గంజాయి నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర హోం మంత్రి అనిత సూచించారు. వైజాగ్ నుంచి హోంమంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కడప ఎస్పీ కార్యాలయం నుంచి ఎస్పీ హర్షవర్ధన్ రాజు హాజరయ్యారు. సైబర్ నేరాలను అరికట్టేందుకు విస్తృతంగా అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. గంజాయి నిర్మూలనే లక్ష్యంగా రూపొందించిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలుకు, గట్టి చర్యలు తీసుకోవాలని సూచించారు.
కడప జిల్లాలో గంజాయి నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర హోం మంత్రి అనిత సూచించారు. వైజాగ్ నుంచి హోంమంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కడప ఎస్పీ కార్యాలయం నుంచి ఎస్పీ హర్షవర్ధన్ రాజు హాజరయ్యారు. సైబర్ నేరాలను అరికట్టేందుకు విస్తృతంగా అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. గంజాయి నిర్మూలనే లక్ష్యంగా రూపొందించిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలుకు, గట్టి చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఏ.ఆర్ పోలీస్ సిబ్బంది సంక్షేమానికి తగిన చర్యలు చేపట్టాలని జిల్లా SP హర్షవర్ధన్ రాజు AR పోలీస్ అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏ.ఆర్ పోలీస్ అధికారులతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. పారదర్శకంగా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. గార్డు విధులు, ఎస్కార్ట్ విధులు, వ్యక్తిగత భద్రతా అధికారుల (పి.ఎస్.ఓ) నిర్వహించే సిబ్బంది వివరాలు ఏ.ఆర్ అదనపు SP కృష్ణారావును అడిగి తెలుసుకున్నారు.
రాయచోటి మండలం గ్రామ సచివాలయం మహిళా VRO వేధింపులకు గురవుతోంది. వివరాల్లోకి వెళితే.. చెన్నముక్కపల్లికి చెందిన చవాకుల రాజేశ్ వేధిస్తున్నాడని మహిళా వీఆర్వో ఆరోపిస్తోంది. సచివాలయానికి రావడంలేదంటూ తాను చెప్పినట్లు వినాలని వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తోంది. తనను అనుసరిస్తూ అమె ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లి ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని మహిళా వీఆర్వో ఆరోపిస్తోంది.
Sorry, no posts matched your criteria.