India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ప్రొద్దుటూరు కో-ఆపరేటివ్ బ్యాంకు ఛైర్మన్ పదవి TDP ఖాతాలోకి చేరింది. YCP తరఫున ఉన్న ఛైర్మన్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు ఛైర్మన్ పదవికి సోమవారం ఎన్నికలు జరిగాయి. TDP అభ్యర్థిగా 4వ డైరెక్టర్ బొగ్గుల వెంకటసుబ్బారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈయనకు పోటీగా ఎవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో ఛైర్మన్గా వెంకట సుబ్బారెడ్డి ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారి ఎ.రాజశేఖర్ ప్రకటించారు.

కడప జిల్లా సంస్కృతి సంప్రదాయాలకు నిలయమని వాటి విలువలను నేటితరం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కలెక్టర్ శివశంకర్ తెలిపారు. అంతర్జాతీయ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా కడప హౌసింగ్ బోర్డు రామాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో వైల్డ్ లైఫ్ చిత్రాలు సాహస సుందరమైన చిత్రాలు జిల్లాలోని ప్రసిద్ధ శిల్పకళా నదులు దేవాలయానికి సంబంధించిన కళ్ళు చెదిరే దాదాపు 450 పైగా రంగురంగుల చిత్రాలను ప్రదర్శనకు ఉంచారు.

కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమను నిర్మించాలని డిమాండ్ చేస్తూ సోమవారం బద్వేల్ ఆర్డీవో చంద్రమోహన్కు PRSYF ఆధ్వర్యంలో వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా PRSYF రాష్ట్ర కన్వీనర్ కన్నెలూరు శంకర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం విభజన హామీలోని ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి ఎన్డీఏ ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. దీనివల్ల వేల మంది యువతకు ఉపాధి లభిస్తుందన్నారు.

✎ కడప: ఆర్టీసీ ఈడీ నియామకంపై అయోమయం
✎ ఒంటిమిట్ట: వైభవంగా కోదండ రాముని పౌర్ణమి కళ్యాణం
✎ బెంగళూరులో విద్యుత్ షాక్తో కడప యువకుడి మృతి
✎ వైసీపీ నేతలు కారుకూతలు కూస్తున్నారు: బీటెక్ రవి
✎ ప్రొద్దుటూరు: 25న జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలు
✎ కంపెనీలు తెచ్చే ముఖమా వైఎస్ జగన్ నీది?: బీటెక్ రవి
✎ ముద్దనూరు: 500 క్యూసెక్కుల నీరు విడుదల
✎ కడప జిల్లాలో బాధ్యతలు చేపట్టిన ఎస్సై, సీఐలు

ఈనెల 25న ప్రొద్దుటూరులోని అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్ మైదానంలో జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించనున్నట్లు బాష అథ్లెటిక్స్ ఫౌండేషన్ కార్యదర్శి అహ్మర్ బాష, జిల్లా అథ్లెటిక్స్ సంఘం అధ్యక్షుడు వీరకళ్యాణ్ రెడ్డి తెలిపారు. అండర్ 14, 16 బాలబాలికలకు ఏ, బీ, సీ విభాగాల్లో పరుగు, లాంగ్ జంప్, హై జంప్, బ్యాక్ త్రో, కిడ్స్ జావలిన్ త్రో, షాట్ పుట్ పోటీలు నిర్వహిస్తామని వారు పేర్కొన్నారు.

కడప జిల్లా అట్లూరు మండలం కోనరాజుపల్లె బీసీ కాలనీకి చెందిన ముఖం నరసయ్య కుమారుడు నవీన్ (23) బెంగళూరులో శనివారం ప్రమాదవశాత్తు విద్యుత్ఘాతానికి గురై మృతి చెందాడు. కొన్ని రోజులుగా జీవనోపాధి కోసం బెంగళూరుకి వెళ్లి నివాసం ఉంటున్నారు. తాను నివాసం ఉంటున్న గదిలో విద్యుత్ షాక్తో మృత్యువాత పడ్డాడు. మరణ వార్త వినగానే మృతుని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

కడప నగరంలోని తిరుపతి బైపాస్ రోడ్డులో గల టయోటా షోరూం వద్ద ఓ వ్యక్తి మృతదేహం స్థానికులు గుర్తించారు. విషయాన్ని రిమ్స్ పోలీసులకు తెలుపగా ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ సుభాష్ చంద్రబోస్ వివరాలను సేకరిస్తున్నారు. మృతి చెందిన వ్యక్తి పేరు రమేష్ నాయక గుర్తించారు. వ్యక్తిపై ఎటువంటి గాయాలు లేవని ప్రాథమికంగా గుర్తించామని ఎస్సై తెలిపారు. పూర్తి వివరాలను సాయంత్రంలోగా వెల్లడిస్తామన్నారు.

కడప నగరంలోని డాక్టర్ YSR క్రీడాపాఠశాలలో ఈనెల 21న జిల్లాస్థాయి వెయిట్ లిఫ్టింగ్ ఎంపికలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ జిల్లా కార్యదర్శి టి. నారాయణరావు తెలిపారు.సబ్ జూనియర్,జూనియర్,సీనియర్ విభాగాల్లో బాలబాలికలకు ఎంపికలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.జిల్లా జట్టుకు ఎంపికయిన వారు ఈనెల 31నుంచి సెప్టెంబర్ 1వరకు అనకాపల్లి నందు రాష్ట్రస్థాయి వెయిట్రిఫ్టింగ్ పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందని వివరించారు.

కడప RTC కడప జోన్ ED నియామకంపై అయోమయ పరిస్థితి నెలకొంది. కడప పరిధిలో 8 జిల్లాలు, 52 డిపోలు, 1వర్క్షాప్ ఉండగా, అందులో దాదాపు 25 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. నాలుగు జోన్లలో కడప జోన్ పెద్ద జోన్గా గుర్తింపు పొందింది. ప్రతినిత్యం ఈడీ పలు అంశాలపై నిర్ణయాలు తీసుకుని అధికారులు, ఉద్యోగులను సమన్వయం చేసుకుంటూ ముందుకు తీసుకు వెళుతుంటారు. అలాంటి కీలక అధికారి లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

కడప ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు సోమవారం డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కడప జిల్లా కలెక్టర్ శివశంకర్ ఆదివారం తెలిపారు. జిల్లా ప్రజలు ఉదయం 9.30 నుంచి 10.30 గంటల వరకు 08562-244437 ల్యాండ్ లైన్ నంబర్కు ఫోన్ చేసి తమ సమస్యలను విన్నవించుకోవాలని కలెక్టర్ సూచించారు.
Sorry, no posts matched your criteria.