Y.S.R. Cuddapah

News July 30, 2024

రాయచోటి మహిళా VROపై వేధింపులు?

image

రాయచోటి మండలం గ్రామ సచివాలయం మహిళా VRO వేధింపులకు గురవుతోంది. వివరాల్లోకి వెళితే.. చెన్నముక్కపల్లికి చెందిన చవాకుల రాజేశ్ వేధిస్తున్నాడని మహిళా వీఆర్వో ఆరోపిస్తోంది. సచివాలయానికి రావడంలేదంటూ తాను చెప్పినట్లు వినాలని వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తోంది. తనను అనుసరిస్తూ అమె ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లి ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని మహిళా వీఆర్వో ఆరోపిస్తోంది.

News July 30, 2024

కడప: వాళ్లకు ఇదే చివరి ఫొటో

image

తెలుగు గంగ జలాశయంలోకి ఈత కొట్టడానికి వెళ్లిన ముదస్సీర్, రహ్మతుల్లా, షాహిద్‌ మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఈత కొట్టడానికి ముందు సెల్ఫీ ఫొటో తీసుకున్నారు. అనంతరం నీటిలో దిగగా ప్రమాదవశాత్తు ముగ్గురూ చనిపోయారు. కాగా వారు కలిసి తీసుకున్న ఆఖరి సెల్ఫీ ఫొటో అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది. ఆ ఫొటో చూసిన విధి వారి స్నేహాన్ని చూసి ఓర్వలేక ఇలా చేసిందని అంటున్నారు.

News July 30, 2024

రాజంపేటలో ఘరానా మోసం

image

పట్టణంలోని ఉస్మాన్ నగర్‌కు చెందిన ఓ వ్యక్తి తన అకౌంట్‌లో రూ.1500 డిపాజిట్ చేస్తే రూ.1లక్ష ఇస్తామని చెప్పడంతో నమ్మి పలువురు మోసపోయిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. మాయమాటలు నమ్మిన పలువురు రూ.7500 డిపాజిట్ చేశారు. అనంతరం మొబైల్ నంబర్‌కు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వస్తోందని తెలిపారు. తాము మోసపోయామని బాధిత మహిళలు విలేకర్ల ఎదుట వాపోయారు. అయితే ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు అంటున్నారు.

News July 30, 2024

రాజంపేట: విద్యార్థినులను చితకబాదిన టీచర్

image

రాజంపేటలో టీచర్ విద్యార్థులను చితకబాదింది. పట్నంలోని రాంనగర్ ఎంపీపీ పాఠశాలలో టీచర్ కవిత సోమవారం విద్యార్థులను చితకబాదిందని తల్లిదండ్రులు ఆరోపించారు. పాఠశాలలోని ముగ్గురు విద్యార్థినులను రెండు చేతుల వేలపై స్కేల్‌తో కొట్టడంతో రక్త గాయాలయ్యాయని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. చదవడం రాలేదనే కోపంతో కొట్టానని టీచర్ చెప్పింది. విచారించి తగిన నిర్ణయం తీసుకుంటానని MEO-1 రఘునాథరాజు తెలిపారు

News July 30, 2024

కడపలో సమస్యల పరిష్కార వేదిక నిర్వహించిన జిల్లా ఎస్పీ

image

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని కడప జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పోలీస్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలోని పెన్నార్ పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో ఎస్పీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుంచి జిల్లా ఎస్పీ నేరుగా ఫిర్యాదులను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

News July 29, 2024

‘కడప జిల్లాలో సజావుగా ఇసుక పంపిణీ జరగాలి’

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇసుక పంపిణీ విధానం జిల్లాలో సజావుగా, సులభతరంగా అమలు చేయాలని కడప జిల్లా కలెక్టర్ శివశంకర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం వీసీ ద్వారా జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌తోపాటు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు హాజరయ్యారు. నూతన ఉచిత ఇసుక విధానంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పారదర్శకంగా పంపిణీ జరగాలన్నారు.

News July 29, 2024

కోడి కోసం కడప జిల్లాలో హత్య

image

నందలూరు మండలం ఎర్రచెరువుపల్లిలో ఆదివారం రాత్రి దారుణ ఘటన చోటుచేసుకుంది. వెంకటరెడ్డి తన కోడి ఎవరో దొంగిలించారని రోడ్డుపై అరుస్తుండగా.. ఆ వీధిలోని ప్రతాప్ ఆగ్రహించాడు. నీ కోడి మా ఇంట్లో ఉంది రమ్మంటూ ఇంట్లోకి తీసుకెళ్లి అతని తలపై నరికి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న బంధువులు రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, మెరుగైన చికిత్స నిమిత్తం తిరుపతికి తీసుకువెళ్లగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు.

News July 29, 2024

కొండాపురంలో రాళ్ల దాడి.. ప్రభుత్వ వాహనాల ధ్వంసం

image

కొండాపురం మండలంలో ఓ వర్గానికి చెందిన నేతల మధ్య వర్గ విభేదాలు ఏర్పడ్డాయి. టీ కోడూరులో అక్రమ గ్రావెల్ తవ్వకాల విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగి ఒకరిపై ఒకరు రాళ్లతో దాడి చేసుకున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వారిని నిలువరించాలని ప్రయత్నించగా, పోలీసులపైనే దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 3 ప్రభుత్వ వాహనాలు ధ్వంసమయ్యాయి. పలువురు పోలీసులకు గాయాలయ్యాయి.

News July 29, 2024

‘78వ పంద్రాగస్టు వేడుకలు ఘనంగా నిర్వహించాలి’

image

జిల్లా ప్రజలందరిలో దేశభక్తి భావాలు రేకెత్తించేలా పండుగ వాతావరణంలో 78వ పంద్రాగస్టు వేడుకలను పెద్దఎత్తున చేపట్టేందుకు, ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా అధికారులను జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఆదేశించారు. రాయచోటి కలెక్టరేట్లోని సమావేశ హాల్లో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లా అభివృద్ధిపై బుక్‌లెట్‌ను సిద్ధం చేయాలన్నారు.

News July 29, 2024

కడప: వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్య

image

చింతకొమ్మదిన్నె మండలం బోడేద్దులపల్లికి చెందిన మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లి వివరాల ప్రకారం.. 11 సంవత్సరాల క్రితం భానుకు వివాహం చేశామని, అప్పటినుంచి ఆమెను భర్త, బంధువులు అదనపు కట్నం కోసం వేధిస్తూన్నారని తెలిపారు. వారి వేధింపులు తట్టుకోలేక ఆదివారం ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. ఈ విషయంపై నేడు పోలీసులు కేసు నమోదు చేశారు.