India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఖాజీపేట సెక్షన్ బయనపల్లి బీట్, కొండపేట తెలుగుగంగ కెనాల్ వద్ద ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న స్మగ్లర్లు అక్రమంగా తరలిస్తున్న 10 ఎర్రచందనం దుంగలు, కారు, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు ఫ్లయింగ్ స్క్వాడ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ గురు ప్రభాకర్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. 10 ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తుండడంతో దాడులు నిర్వహించి నలుగురు స్మగ్లర్లను అరెస్ట్ చేశామన్నారు.

పోలీస్ శాఖలో విశిష్ట సేవలందించి సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రతిష్టాత్మక ఇండియన్ పోలీస్ మెడల్ అందుకున్న రెడ్ శాండల్ టాస్క్ ఫోర్స్ సీఐ ఎ.సాదిక్ అలీని కడప జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ప్రత్యేకంగా అభినందించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో మెడల్ గ్రహీత సాదిక్ అలీ జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇదే స్పూర్తితో మున్ముందు విధులు నిర్వర్తించాలని ఎస్పీ ఆకాంక్షించారు.

కడప జిల్లా జడ్పీటీసీలు ఈ నెల 21వ తేదీ విజయవాడకు రావాలంటూ వైసీపీ అధిష్ఠానం ఆదేశాలు జారీ చేసింది. జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవి నిలుపుకోవడానికి మాజీ సీఎం జగన్ జడ్పీటీసీలతో సమావేశం అవుతున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవికి ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి రాజీనామా చేయడంతో జడ్పీ ఛైర్మన్ పదవి ఖాళీగా ఉంది.

కడప జిల్లా అదనపు ఎస్పీ లోసారి సుధాకర్ బదిలీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా అదనపు ఎస్పీలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా కడప అదనపు ఎస్పీ సుధాకర్ ను ఏసీబీ అదనపు ఎస్పీ గా బదిలీ చేశారు. ఈయన స్థానంలో ఎవరిని నియమించలేదు. గత ఏడాది సుధాకర్ జిల్లా అదనపు ఎస్పీ గా బాధ్యతలు చేపట్టారు. గత ఎన్నికలను ఉన్నతాధికారుల సారథ్యంలో ప్రశాంతంగా నిర్వహించేందుకు గట్టి చర్యలు తీసుకున్నారు.

పట్టణ పరిధిలోని బోస్ నగర్ ఏరియాలో గ్యాస్ సిలిండర్ పేలి తల్లిబిడ్డలు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. వారి వివరాల మేరకు.. బోస్నగర్ ఏరియా, తోగాట వీధిలో శనివారం గ్యాస్ సిలిండర్ పేలిన ప్రమాదంలో తల్లితోపాటు ఇద్దరు బిడ్డలు మృతి చెందినట్లు తెలిపారు. ఈ పేలుడు పై స్థానికులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

హౌసింగ్ పథకంలో లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గృహ నిర్మాణాలను నాణ్యతతో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శివశంకర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో కాంట్రాక్టర్లతో గృహ నిర్మాణాలపై జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పక్క గృహాల నిర్మాణంలో నిర్దేశిత లక్ష్యాల సాధనలో నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

కలసపాడు మండలంలోని మామిళ్లపల్లె వద్ద గురువారం రాత్రి కారులో వెళ్తున్న మహిళలపై దౌర్జన్యం చేసి అసభ్యంగా ప్రవర్తించిన ఐదుగురు యువకులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై చిరంజీవి తెలిపారు. గురువారం రాత్రి లింగారెడ్డిపల్లెలో జరుగుతున్న వివాహానికి మహానంది పల్లె గ్రామానికి చెందిన నలుగురు మహిళలు, మరో ఇద్దరు వ్యక్తులు కారులో వెళ్తుండగా మామిళ్లపల్లె వద్ద 5 మంది యువకులు కారులోని మహిళలపై దౌర్జన్యం చేశారు.

ప్రొద్దుటూరులోని అన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో శనివారం వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రొద్దుటూరు ఐఎంఏ అధ్యక్షుడు డా. మహేష్, కార్యదర్శి డాక్టర్ హరీష్ కుమార్ తెలిపారు. కలకత్తాలో మహిళ వైద్యురాలిపై జరిగిన అమానుష సంఘటనను నిరసిస్తూ ఐఎంఏ ఒకరోజు వైద్య సేవల బంద్కు పిలుపునిచ్చిందని, ఇందులో భాగంగా శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు అత్యవసర సేవలు మినహా వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లు తెలిపారు.

పేదల సొంతింటి కల సహకారం చేసే దిశగా హౌసింగ్ పథకంలో లబ్ధిదారులకు పెండింగ్ లేకుండా గృహ నిర్మాణాలను నాణ్యతతో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శివశంకర్ అధికారులు ఆదేశించారు. కడప కలెక్టర్ కార్యాలయంలో గృహ నిర్మాణ శాఖ అధికారులతో కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం హౌసింగ్ పథకంలో భాగంగా ఇప్పటికే గృహాలు మంజూరై ఇంటి నిర్మాణ ప్రక్రియలో ఉన్న నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.

కడప జిల్లా వ్యాప్తంగా పలువురు సీఐలను బదిలీ చేస్తూ కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఉత్తర్వులు జారీ చేశారు. అనంతపురం, కడప, అన్నమయ్య, నంద్యాల జిల్లాలకు సంబంధించిన 28 మంది సీఐలకు స్థానచలనం కల్పిస్తూ కాసేపటి క్రితం ఆదేశాలు ఇచ్చారు. వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లలో రిపోర్ట్ చేసుకోవాలని ఉత్తర్వుల్లో డీఐజీ పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.