Y.S.R. Cuddapah

News July 29, 2024

పంచాయతీలలో సమస్యలపై కాల్ సెంటర్ ఏర్పాటు

image

అన్నమయ్య జిల్లా 30 మండలాల పరిధిలోని పంచాయితీలలో పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యలు, వీధిలైట్ల నిర్వహణ, పంచాయతీల ఫిర్యాదులకు సంబంధించి జిల్లా స్థాయిలో కాల్ సెంటర్ ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక హాలులో పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి జిల్లాస్థాయి కాల్ సెంటర్ ఏర్పాటు ప్రచార పోస్టర్లను ఆవిష్కరించారు.

News July 29, 2024

అర్జీదారులకు పరిష్కారం అందాలి: కలెక్టర్ శివశంకర్

image

సమస్యల పరిష్కారం కోసం జిల్లా కేంద్రానికి వచ్చే అర్జీదారులకు నాణ్యమైన పరిష్కారాలను చూపాలని,  జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి అన్ని ప్రభుత్వ శాఖల అధికారులను ఆదేశించారు. నేడు కలెక్టరేట్లోని గ్రీవెన్స్ సెల్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటితో పాటు అదితి సింగ్, డిఆర్వో గంగాధర్ గౌడ్, ఐసీడీఎస్ పీడీ శ్రీలక్ష్మీలు హాజరయ్యారు.

News July 29, 2024

కడప: మృతదేహాలు వెలికితీత

image

కడప జిల్లాలోని తెలుగు గంగ ప్రాజెక్టు అంతర్భాగమైన సబ్ రిజర్వాయర్-1లో ముగ్గురు గల్లంతైన విషయం తెలిసిందే. సోమవారం ఉదయం నుంచి గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు ఆ యువకుల మృతదేహాలు లభించాయి. ముగ్గురు కూడా ప్రొద్దుటూరు పట్టణం పవర్ హౌస్ రోడ్డుకు చెందిన వారిగా గుర్తించాయి. దీంతో వారి తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగిపోయారు.

News July 29, 2024

కడప: గల్లంతైన యువకుల వివరాల గుర్తింపు

image

దువ్వూరు మండలం చల్లబాసాయ పల్లె వద్ద సబ్సిడరీ రిజర్వాయర్-1లో ఆదివారం గల్లంతైన యువకుల ఆచూకీ లభించింది. ఘటనా స్థలంలోని సెల్‌ఫోన్ల ఆధారంగా ప్రొద్దుటూరుకు చెందిన ఎస్.కె ముదాపీర్(22), పఠాన్ రహమతుల్లా(23), వేంపల్లి సాహిద్(23) మునిగిపోయినట్లు గుర్తించారు. నిన్న సాయంత్రం ఈతకొట్టడానికి దిగి గల్లంతయ్యారు. గాలింపు చర్యలు కొనసాగుతుండగా ఎలాంటి ఆచూకీ లభించలేదు.

News July 29, 2024

దువ్వూరు: చల్లబసాయపల్లె డ్యామ్‌లో ముగ్గురు గల్లంతు

image

కడప జిల్లా దువ్వూరు మండలంలోని చల్లబాసాయపల్లె సమీపంలోని తెలుగు గంగ ప్రాజెక్టు అంతర్భాగమైన సబ్సిడీ రిజర్వాయర్-1లో ముగ్గురు గల్లంతయ్యారు. ఆదివారం విహారయాత్ర కోసం వెళ్లిన ప్రొద్దుటూరుకు చెందిన ముగ్గురు వ్యక్తులు డ్యామ్‌లో ఈత కొడుతుండగా గల్లంతైనట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 29, 2024

కమలాపురం: పోలీసుల అదుపులో ఘరానా మోసగాడు

image

సుమారు 75 మందిని మోసం చేసిన ఘరానా మోసగాడు పోలీసులకు చిక్కాడు. కమలాపురానికి చెందిన కైప నాగేంద్రప్రసాద్ శర్మ తక్కువ ధరలకే కార్లు, భూములు ఇప్పిస్తానని చెప్పి రూ.12.83కోట్లు దండుకున్నాడు. ఇతడిని 2021లో KPHB పోలీసులు అరెస్ట్ చేశారు. బెయిల్‌పై బయటికి వచ్చి తప్పించుకు తిరుగుతున్నాడు. అరెస్ట్ చేద్దామని వస్తే వాగ్వాదం పెట్టుకునేవాడు. బెంగళూరులో ఉన్న అతడిని అరెస్ట్ చేసి ఆదివారం రిమాండుకు తరలించారు.

News July 29, 2024

వేముల: 37 ఏళ్ల తర్వాత కలిశారు

image

వేముల మండలంలో ఓ అపూర్వ ఘటన చోటుచేసుకుంది. 1987-88లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకున్న 10వ తరగతి విద్యార్థులు ఒక్క చోటకి చేరుకున్నారు. ఆదివారం వారంతా వారు చదువుకున్న పాఠశాలలో గడిపారు. దాదాపు 37 ఏళ్ల తర్వాత చిన్నప్పుడు వాళ్లు చేసిన చిలిపి పనులు, టీచర్లతో తిట్లు, అభినందనలు, తోటి స్నేహితుడికి ఏడిపించడం ఇలా చిన్నప్పుడు వారు చేసిన మధుర స్మృతులను నెమరేసుకున్నారు.

News July 29, 2024

రాష్ట్ర స్థాయి పోటీలకు ప్రొద్దుటూరు విద్యార్థులు

image

నంద్యాలలో నేడు జరిగిన జిల్లా స్థాయి జంప్ రోప్ పోటీలలో ప్రొద్దుటూరులోని ఓ పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులు పసిడి, రజతం, కాంస్య పథకాలు సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల కరస్పాండెంట్ షేక్ ఇలియాస్ తెలిపారు. ఆగస్టు నెలలో మహారాష్ట్రలోని నాసిక్‌లో జరిగే రాష్ట్రస్థాయి జంప్ రోప్ పోటీలలో వీరు పాల్గొంటారని చెప్పారు. అనంతరం పాఠశాల సిబ్బంది విద్యార్థులను అభినందించారు.

News July 29, 2024

కడప ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదుల స్వీకరణ

image

ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తామని జిల్లా ఎస్పీ హర్ష వర్ధన్ రాజు తెలిపారు. ఉదయం జిల్లా పోలీసు కార్యాలయంలో ఈ కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తామని, వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలోని ప్రజలు ఈ కార్యక్రమం సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ సూచించారు.

News July 28, 2024

ఓబులవారిపల్లి: ముగ్గురాళ్ల గుట్ట కింద మృతదేహం

image

ఓబులవారిపల్లి మండలం కొర్లకుంటలో ముగ్గు రాళ్ల కుప్ప కింద ఓ మృతదేహం కలకలం రేపింది. మృతుడు మంగంపేట ఎస్టీ కాలనీకి చెందిన వెలుగు రాజేంద్ర (35)గా స్థానికులు గుర్తించారు. మృతుడికి భార్య జ్యోతి, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.