Y.S.R. Cuddapah

News July 28, 2024

కడప: రేపు డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం

image

ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు రేపు ఉదయం కలెక్టర్ కార్యాలయంలో డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ శివ శంకర్ తెలిపారు. ఉదయం 9:30 నుంచి 10:30 వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజలు నేరుగా 08562-244437 ఫోన్ నంబర్‌కు ఫోన్ చేసి సమస్యలు తెలుపవచ్చన్నారు. వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.

News July 28, 2024

కడప జిల్లాలో పింఛన్ల పంపిణీలో 5,594 ఉద్యోగులు

image

కడప జిల్లాలో 645 గ్రామ, వార్డు సచివాలయాలు ఉండగా, వాటిలో పనిచేసేవారు 6,877 మంది. కాగా వారిలో 5,594 మంది మాత్రమే అందుబాటులో ఉన్నారు. 724 చోట్ల ఇతరులకు అదనపు బాధ్యతలు అప్పగించారు. మరో 559 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వచ్చే నెల 1న పైన తెలిపిన 5,594 మంది సచివాలయ ఉద్యోగులు పింఛను నగదును అందజేయాలని జిల్లా DRDO తెలిపారు. ఒక్కో ఉద్యోగి 50 నుంచి 100 మందికి ఇవ్వాలని, అంతకుమించి ఎక్కువ మందికి ఇవ్వకూడదన్నారు.

News July 28, 2024

కడప-పులివెందుల రహదారిపై ప్రమాదం.. ఒకరు మృతి

image

వేముల మండలం బెస్తవారిపల్లె గ్రామ సమీపంలో శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో నేషనల్ హైవే పనుల కోసం బిహార్ నుంచి వచ్చిన ఓ కార్మికుడు బైక్‌పై వెళుతూ ప్రమాదవశాత్తు రూట్ లైన్ ఇనుప కడ్డీలను ఢీకొట్టాడు. ఆదివారం ఉదయం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

News July 28, 2024

కడప: వర్షాలు లేక జలాశయాలు ఖాళీ

image

కడప జిల్లాలో ఈ ఏడాది ఆశించిన మేర వర్షాలు పడకపోవడంతో జలాశయాలు వెలవెలబోతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో 11 జలాశయాలు ఉండగా వాటిల్లో కనీసం 50% నీటి సామర్థ్యం కూడా లేదని అధికారులు చెబుతున్నారు. సగిలేరు, బుగ్గ వంక జలాశయాలయితే పూర్తిగా ఖాళీ అయినట్లు అధికారులు తెలిపారు. కృష్ణా జలాలను తరలించి జలశయాలను నీటితో నింపాలని రైతులు కోరారు.

News July 27, 2024

పులివెందుల బుడ్డోడికి ఇండియా బుక్ ఆఫ్ రికార్డు

image

పులివెందుల పట్టణంలోని ప్రముఖ వైద్యులు డాక్టర్ శరణ్య, డాక్టర్ నవీన్‌ల కుమారుడు తనయ్ సాయి అనే బుడతడు 18 నెలల వయస్సులోనే ఇండియా బుక్ రికార్డు సాధించాడు. దీనిపై తల్లిదండ్రులు, బంధువులు, సన్నిహితులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శరణ్య మాట్లాడుతూ.. 18 నెలల వయస్సులో 11 నిమిషాల 29 సెకండ్లలో 100 పదాలకు యాక్షన్ చేశాడని తెలిపారు.

News July 27, 2024

వల్లూరు: ట్రాక్టర్ కింద పడి విద్యార్థిని మృతి

image

వల్లూరు మండల పరిధిలోని పెద్దపుత్తలో శనివారం సాయంత్రం ట్రాక్టర్ కింద పడి విద్యార్థిని మృతి చెందింది. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న రెడ్డెమ్మ అనే బాలిక పాఠశాల ముగిసిన అనంతరం సైకిల్లో ఇంటికి వస్తుండగా రాళ్ళ లోడుతో వెళుతున్న ట్రాక్టర్ ఢీకొట్టింది. దీంతో విద్యార్థిని తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనా స్థలాన్ని ఎస్సై వెంకటరమణ పరిశీలించారు.

News July 27, 2024

కడప: త్వరలో జిల్లాలో డీఎస్పీలు, సీఐల బదిలీలు

image

కడప జిల్లాలో వివిధ ప్రదేశాల్లో డీఎస్పీలుగా, సీఐలుగా పనిచేస్తున్న వారిని త్వరలో బదిలీ చేసేందుకు ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను త్వరలో విడుదల చేస్తారని పోలీసు వర్గాల ద్వారా వచ్చిన విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే కడప డీఎస్పీతో పాటు పలువురు డీఎస్పీలు, సీఐలు మెడికల్ లీవ్‌లో వెళ్లడం గమనార్హం.

News July 27, 2024

కడప జిల్లాలో 40 మంది తహసీల్దార్లు రిలీవ్

image

సార్వత్రిక ఎన్నికల సమయంలో బదిలీపై కడప జిల్లాకు వచ్చిన 40 మంది తహశీల్దార్లను తిరిగి ఆయా జిల్లాలకు బదిలీ చేస్తూ కలెక్టర్ శివశంకర్ ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం వారంతా రిలీవ్ అయ్యారు. ఇక్కడి నుంచి వెళ్లిన వారు సోమవారం జిల్లాకు రానున్నట్లు తెలుస్తోంది. బదిలీపై వెళ్లిన తహశీల్దార్ల స్థానంలో డిప్యూటీ తహశీల్దార్లకు అదనపు బాధ్యతలు అప్పగించారు.

News July 27, 2024

మైదుకూరు: కులం పేరుతో దూషించారని ఫిర్యాదు

image

మైదుకూరు మండలంలోని ఓ ZPHSలో ఉపాధ్యాయుడు ఏడో తరగతి విద్యార్థిని కులం పేరుతో దూషించి పాఠశాల నుంచి గెంటేశారనే సమాచారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పూర్వ విద్యార్థి చరణ్ కుమార్ పాఠశాలకు వచ్చి బాధిత విద్యార్థిని పిలిచి మాట్లాడుతుండగా ఆ ఉపాధ్యాయుడు జోక్యం చేసుకుని దాడి చేసి కులం పేరుతో దూషించారు. చరణ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీనిపై కేసు నమోదు కాలేదని పోలీసులు తెలిపారు.

News July 27, 2024

వైసీపీ హయాంలో బీటెక్ రవిపై 10 కేసులు: టీడీపీ

image

వైసీపీ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయకులుపై 2,560 కేసులు నమోదు చేశారని చంద్రబాబు అన్నారు. కడప జిల్లాలో జగన్ పై పోటీ చేసిన బీటెక్ రవిపై జిల్లాలో అత్యధికంగా 10 కేసులు నమోదయ్యాయి. కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్యరెడ్డిపై నాలుగు కేసులు, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డిపై ఒక కేసు నమోదయ్యాయని అన్నారు. అలాగే జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిపై కేసుల పరంపర కొనసాగిందని ఆరోపించారు.