India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
2024 ఎన్నికల నగారా మోగింది. అటు కూటమి, ఇటు YCP అభ్యర్థుల ప్రకటలను చేస్తున్నారు. అయితే సీఎం జగన్ ఈ సారి రాష్ట్రంలో చాలా మార్పులు చేశారు. కానీ.. వైఎస్ఆర్ జిల్లాలోనే ఎటువంటి మార్పులు లేవు. 2019 ఎన్నికల్లో నిలబడ్డ వారే ఇప్పుడు కూడా నిలబడుతున్నారు. TDP ఇప్పటి వరకు ప్రకటించిన వారిలో మాధవిరెడ్డి, బీటెక్ రవి, పుత్తా చైతన్య రెడ్డి కొత్తగా బరిలో నిలబడుతున్నారు. వీరిలో ఎంతమంది విజయం సాధిస్తారో చూడాలి.
ఉమ్మడి కడప జిల్లాలో అభ్యర్థుల ఖరారుతో ఎన్నికల సమరానికి పార్టీలు సిద్ధమయ్యాయి. టీడీపీ 6 స్థానాలను ఇప్పటికే ప్రకటించగా, వైసీపీ శనివారం అభ్యర్థులను ప్రకటించడంతో జిల్లా వ్యాప్తంగా పూర్తి స్పష్టత వచ్చింది. ఇక ఎన్నికల ప్రచారమే తరువాయి. బద్వేలు, రాజంపేట, కోడూరు, జమ్మలమడుగు స్థానాల్లో TDPతో పొత్తులో ఉన్న జనసేన, బీజేపీకి ఏ సీట్లు వెళ్తాయో చూడాలి. ఏదేమైనా జిల్లాలో పూర్తి స్పష్టతతో పార్టీలు దూసుకుపోతున్నాయి.
లక్కిరెడ్డిపల్లె మండలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కుర్నూతల పంచాయతీ బొమ్మేపల్లికి చెందిన యోగానందరెడ్డి భార్య రమణమ్మ (32)ను ఆదివారం తెల్లవారుజామున దారుణంగా హత్య చేశాడు. అనంతరం లక్కిరెడ్డిపల్లి పోలీస్ స్టేషన్లో యోగానందరెడ్డి లొంగిపోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ గంగానాధ బాబు, ఎస్ఐ విష్ణువర్ధన్ క్లూస్ టీంతో మృతదేహాన్ని పరిశీలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కాశినాయన మండలంలోని నరసాపురంలో అనుమానాస్పద స్థితిలో సాధువు ఆదివారం మృతి చెందడం స్థానికులు గుర్తించారు. నరసాపురం సమీపంలోని అంకాలమ్మ రాతి శిలల సమీపంలో కత్తితో పొడుచుకొని సాధువు మృతిచెందినట్లు స్థానికులు చెప్తున్నారు. జ్యోతి క్షేత్రంలో ఉండే సాధువు శనివారం నరసాపురం ఆసుపత్రిలో అనారోగ్య సమస్యలతో చూపించుకున్నాడని స్థానికులు చెబుతున్నారు. ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
కడప జిల్లాలో ఇద్దరు సీనియర్ నాయకులపై అందరి దృష్టి ఉంది. కారణం వారు 9వ సారి ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్నారు. వారే శెట్టిపల్లె రఘురామిరెడ్డి, నంద్యాల వరదరాజులరెడ్డి. ఇద్దరికీ 40 ఏళ్ల పై చిలుకు రాజకీయ అనుభవం ఉంది. వరద 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, 3 సార్లు ఓడారు. రఘురామిరెడ్డి 4 సార్లు గెలిచి, 4 ఓడారు. ఇప్పడు వీరిద్దరు 9వ సారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. మరోసారి వీరు గెలిచి చరిత్ర సృష్టిస్తారా?
గ్రామ/వార్డు వాలంటీర్లు రాజకీయ నేతలతో తిరిగిన, పార్టీలకు అనుకూలంగా ప్రచారం చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ విజయరామరాజు హెచ్చరించారు. కడపలో శనివారం ఎస్పీ, కమిషనర్తో కలిసి ఈ వ్యాఖ్యలు చేశారు. జిల్లాలో నేటి నుంచి ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందన్నారు. వాలంటీర్లు రూల్స్ అతిక్రమించినట్లు ఎవరైన ఫిర్యాదు చేస్తే వారిని తక్షణమే విధుల నుంచి తొలగిస్తామన్నారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా సహకరించాలన్నారు.
కడప జిల్లా ఎన్నికల కంట్రోల్ రూమ్ అధికారిగా నగరపాలక సంస్థ కమిషనర్ సూర్య సాయి ప్రవీణ్ చంద్ను నియమించినట్టు జిల్లా కలెక్టర్ విజయరామరాజు తెలిపారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కడప కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. రాజకీయ పార్టీల నేతలు 08562 315672 ఈ నంబర్కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. వంటనే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు.
కడప జిల్లాలో సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని జిల్లా కలెక్టర్ విజయరామ రాజు పేర్కొన్నారు. కడప కలెక్టర్ కార్యాలయంలో ఎస్పీ సిద్దార్థ్ కౌశల్తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 16.22 లక్షల మంది ఓటర్లు ఉన్నారని, పురుషులు 7.92 లక్షలు, మహిళలు 8.29 లక్షల మంది, 214 మంది ట్రాన్స్జెండర్ ఓటర్లు ఉన్నారన్నారు. 2035 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామన్నారు.
వైఎస్ జగన్ తన రాజకీయ ప్రస్థానాన్ని కాంగ్రెస్లో ప్రారంభించి, 2009 మే నెలలో తొలిసారిగా కడప ఎంపీగా గెలిచారు. అనంతరం 2011 ఉప ఎన్నికల్లో 5,45,672 ఓట్ల మెజార్టీతో విజయం సాధిస్తారు. 2014 పులివెందుల ఎమ్మెల్యేగా 75,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతో, 2019లో 90,110 భారీ మెజార్టీతో గెలిచారు. దీంతో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిచిన అభ్యర్థిగా జగన్ చరిత్ర సృష్టించారు.
సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగడంతో కడప జిల్లాలో ఎన్నికల కోడ్ తక్షణమే అమలులోకి వచ్చింది. దీనిపై జిల్లా కలెక్టర్ విజయరామరాజు ఎస్పీ సిద్ధార్థ కౌశల్ కలెక్టర్ కార్యాలయంలో మరికాసేపట్లో కీలక మీడియా సమావేశం నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో జరిగే ఎన్నికల నిర్వహణ సంబంధించి పలు విషయాలను కలెక్టరు, ఎస్పీ వెల్లడిస్తారు.
Sorry, no posts matched your criteria.