India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కడపలోని సాయిబాబా స్కూల్లో పైకప్పు పెచ్చుుల ఊడిపడి ఆరుగురు విద్యార్థులు గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి పాఠశాల ఛైర్మన్, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డిపై కేసు నమోదు చేశారు. నిర్లక్ష్యం వల్లే పాఠశాల గది పైకప్పు కూలిందని పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఈ ఘటనలో గాయపడిన విద్యార్థులు చికిత్స పొందుతున్నారు.
నీట్, నెట్ పరీక్ష పేపర్ల లీకేజీపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ డీవైఎఫ్ఐ, ఇతర విద్యార్థి సంఘాలు జులై 4న దేశ వ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీల బంద్కు పిలుపునిచ్చాయి. కడపలో వారు మాట్లాడుతూ.. కేంద్ర విద్యాశాఖమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గత ఐదేళ్లలో 65 పేపర్ లీకేజీ ఘటనలు జరిగాయని, దీనిపై పార్లమెంట్లో మోదీ చర్చించి న్యాయం చేయాలని కోరారు. లీకేజీలతో విద్యార్థులు నష్టపోయారన్నారు.
కడప జిల్లా కలెక్టర్ విజయరామరాజును బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేశారు. ఇందులో భాగంగా జిల్లా నూతన కలెక్టర్గా లోతేటి శివశంకర్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మూడు సంవత్సరాల క్రితం జిల్లా కలెక్టర్గా విజయరామరాజు బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడడంతో కలెక్టర్లను బదిలీ చేసినట్టు తెలుస్తోంది.
<<13545953>>ఎస్సైపై మండిపడ్డ<<>> ఘటన చర్చనీయాంశం కావడంతో మంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్య హరిత స్పందించారు. ‘బందోబస్తుకు ఒక్క కానిస్టేబుల్ లేకుండా వారం రోజులుగా పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నా. పింఛను పంపిణీ ప్రభుత్వ కార్యక్రమం కావడంతో పోలీసులే భద్రత గురించి చెప్పారు. వారి కోసం గంటకుపైగా రోడ్డుపై వేచి ఉన్నా. అధికారి క్యాజువల్ డ్రెస్లో వచ్చారు. దీంతోనే ప్రశ్నించా. ఇదే పెద్ద నేరంగా మారింది’. అని అన్నారు.
ఎర్రచందనం అక్రమ రవాణాపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేస్తున్న ఆరోపణలకు సంబంధించి ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నానని రాజంపేట MP మిథున్ రెడ్డి అన్నారు. పవన్ దీక్షలో కూడా అలవోకగా అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. ‘ఆయన చేతిలో అధికారం, పోలీసులు, వ్యవస్థలు ఉన్నాయి. ఐదేళ్ల సమయం ఉంది. సత్యశోధనకు నేను సిద్ధంగా ఉన్నానని, తనపై ఆరోపణలు నిరూపించకపోతే పవన్ బహిరంగ క్షమాపణలు చెప్పేందుకు సిద్ధమా?’ అని ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కడప నగరం (పాత కలెక్టరేట్)లోని బీసీ స్టడీ సర్కిల్లో డీఎస్సీ సెకండరీ గ్రేడ్ టీచర్స్ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఏపీ బీసీ స్టడీ సర్కిల్ ఉమ్మడి కడప జిల్లా సంచాలకులు డాక్టర్ వల్లూరు బ్రహ్మయ్య తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు టీటీసీ అర్హత కలిగి ఉండి, టెట్ అర్హత సాధించిన వారు 10వ తేదీ లోపు ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
బ్రహ్మంగారిమఠం మండలం ఈశ్వరమ్మ గృహ సమీపంలోని అటవీ ప్రాంతంలో సోమవారం ఓ గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. మృతుడి వయస్సు 40 నుంచి 45 ఏళ్ల మధ్య ఉంటుందని, ముఖభాగం గుర్తు పట్టలేని విధంగా పాడైపోయిందని పోలీసులు తెలిపారు. శవం కాలిన ఆనవాళ్లు కనిపించడంతో ఎవరైనా నిప్పంటించి చంపారా అనే అనుమానాలు వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
జిల్లాలోని పెండ్లిమర్రి మండలం వెళ్లటూరు గ్రామానికి చెందిన బత్తల వెంకటలక్ష్మీ (24) అనే యువతి ఎగువచెరువు కాశినాయన గుడి దగ్గర ఉన్న అడవుల్లో ఉరి వేసుకొని మరణించినట్లుగా పెండ్లిమర్రి ఎస్సై హరిప్రసాద్ తెలిపారు. కానీ మృతికి గల ఎటువంటి కారణాలు తెలియకపోవడంతో ఇది హత్యనా?, లేక ఆత్మహత్యనా? అనే విషయంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
సీకేదిన్నె మండలంలోని అంగడి వీధికి చెందిన దూదేకుల మహబూబ్ చాంద్(17)అనే విద్యార్థిని సోమవారం ఆత్మహత్య చేసుకున్నట్లు సీకేదిన్నె సీఐ శివ శంకర్ నాయక్ తెలిపారు. మొదటి సంవత్సరం ఇంటర్ పరీక్ష ఫలితాల్లో తక్కువ మార్కులు వచ్చాయని తల్లిదండ్రులు ఆమెను మందలించడంతో మనస్థాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో నిద్రమాత్రలు మింగిగా.. ఏలూరులో చికిత్స పొందుతూ మృతి చెందింది. దీనిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
కడప నగరం ఎన్టీఓ కాలనీకి చెందిన పి. ఉమామహేశ్వర్, శ్రీలక్ష్మి దంపతుల కుమార్తె అయిన పసుపులేటి చిన్మయ చదరంగం క్రీడలో రాణిస్తోంది. విద్యామందిర్ హైస్కూల్లో 6వ తరగతి చదువుతున్న ఈ చిన్నారి అండర్-10 విభాగం నుంచి చదరంగం ర్యాంకింగ్ టోర్నమెంట్లో పాల్గొని అంతర్జాతీయ స్థాయిలో 1523 రేటింగ్ సాధించింది. తాజాగా సోమవారం జారీ చేసిన రేటింగ్స్ ఈ చిన్నారికి 1523 రేటింగ్ దక్కింది.
Sorry, no posts matched your criteria.