India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
YCP ఎమ్మెల్సీ, మండలి డిప్యూటీ ఛైర్ పర్సన్ జకియా ఖానం శుక్రవారం నారా లోకేశ్ మర్యాదపూర్వంగా కలిశారు. ఒకవైపు YCP నేతలు చట్ట సభలను బహిష్కరించినా, జకియా ఖానం మండలికి హాజరవుతున్నారు. దీంతో ఆమె TDPలోకి వెళ్లే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. 2019లో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అయ్యారు. 2021లో డిప్యూటి స్పీకర్గా ఎన్నికయ్యారు.
కడప ఒకటో పట్టణ ఠాణా ఎస్ఐ మధుసూదన్రెడ్డిని వీఆర్కు పంపుతూ జిల్లా పోలీసు అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. వారం రోజుల కిందట ఎస్ఐ రాజీవ్ పార్కు వద్ద ఓ యువకుడిని లాఠీతో చితకబాదిన విషయం తెలిసిందే. దీనిపై దళిత సంఘాలు, ప్రజా సంఘాలు వివిధ రూపాల్లో ఆందోళనలు చేశారు. ఈ నేపథ్యంలో మధుసూదన్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యల్లో భాగంగా వీఆర్కు పంపినట్లు పోలీసు శాఖ తెలిపారు.
అప్రమత్తంగా ఉండటం వల్ల సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయవచ్చని డీఎస్పీ మురళీధర్ తెలిపారు. ప్రొద్దుటూరు మండలం గోపవరం వద్ద ఉన్న పశువైద్య కళాశాలలో శుక్రవారం విద్యార్థులకు సైబర్ సెక్యూరిటీ, డ్రగ్స్ అడిక్షన్, యాంటీ ర్యాగింగ్, రోడ్డు సేఫ్టీపై అవగాహన కల్పించారు. డీఎస్పీ మాట్లాడుతూ.. అమ్మాయిలు సైబర్ క్రైమ్స్ బారిన పడి లైంగిక వేధింపులకు గురవుతున్నారన్నారు. ఆన్లైన్ గేమ్స్, యాప్స్ వల్ల నష్టపోతున్నారని తెలిపారు.
వైవీయూ డిగ్రీ కోర్సులలో నమోదైన విద్యార్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకొని ప్రవేశాలు పొందాలని వైవీయూ ప్రవేశాల సంచాలకులు డాక్టర్ లక్ష్మీప్రసాద్ తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆన్లైన్ అడ్మిషన్ మాడ్యూల్ ఫర్ డిగ్రీ కాలేజెస్ వెబ్ ఆప్షన్ ప్రారంభమైందన్నారు. బీఎస్సీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బీకాం కంప్యూటర్ ఆనర్స్ కోర్సులు ఈ విద్యా సంవత్సరం నుంచి వైవీయూలో ప్రారంభించామన్నారు.
పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాల స్పాట్ అడ్మిషన్లు జులై 31వ తేదీన నిర్వహించినట్లు జిల్లా కోఆర్డినేటర్ సిహెచ్ జ్యోతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కడప జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు, సెకండ్ షిఫ్ట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో జులై 31 తేదీన స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు ఉపయోగించుకోవాలని సూచించారు.
ప్రజల ప్రాణ భద్రత కోసం చేపడుతున్న రోడ్డు భద్రత చర్యల ఆంక్షలను మరింత కఠినతరం చేయాలని కడప జిల్లా కలెక్టర్ శివశంకర్ సంబందిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో జిల్లా రహదారుల భద్రతా సమన్వయ కమిటీ సమావేశంలో కలెక్టర్, ఎస్పీ హర్షవర్ధన్ పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్న రహదారులపై ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చర్యలను కఠినతరం చేయాలని సంబందిత అధికారులను ఆదేశించారు.
నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆధ్వర్యంలో షార్ట్ ఫిలిం నిర్మాణ పోటీలను నిర్వహించనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఫిల్మ్ మేకర్లు మానవ హక్కులపై చిత్రం తీసి ఆగస్టు 30 లోపు తమకు చేరేలా పంపాలన్నారు. ఈ పోటీ ద్వారా మేకర్స్లోని సృజనాత్మకతను గుర్తిస్తామని అన్నారు. గెలుపొందిన వారికి మొదటి బహుమతి రూ.2 లక్షలు, ద్వితీయ రూ.1.50 లక్షలు, తృతీయ లక్ష ఇవ్వనున్నారు. వివరాలకు htpp://nhrc.nic.in సంప్రదించాలన్నారు.
కడప: నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆఫ్ కొరియా 2024లో అత్యుత్తమ విదేశీ పరిశోధకులకు అందించే బ్రెయిన్ పూల్ ఫెలోషిప్ వైవీయూ మెటీరియల్స్ సైన్స్ నానోటెక్నాలజీ ప్రొ.ఎం.వి.శంకర్ కు లభించింది. దక్షిణ కొరియాలోని ప్రపంచ ర్యాంకింగ్ సంస్థ కొంకుక్ యూనివర్శిటీలో పని చేయడానికి ఈయనను ఆహ్వానించింది. ప్రపంచవ్యాప్తంగా ఎంపికైన 81 మంది సభ్యులలో ఆయన ఒకరు. వీసీ ప్రొ కె.కృష్ణారెడ్డి, రిజిస్ట్రార్ రఘునాథ రెడ్డి అభినందించారు.
అన్ని రంగాల్లో ఏపీలో కడప జిల్లాను టాప్-5లో నిలపాలని కలెక్టర్ శివశంకర్ లోతేటి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని గ్రీవెన్స్ సెల్ హాలులో జేసీ అదితి సింగ్తో కలిసి కలెక్టర్ జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. RSKల ద్వారా వ్యవసాయ, ఉద్యాన రంగ సేవలను విస్తృతం చేయాలన్నారు. ఎపీఎంఐపీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను సన్న చిన్నకారు రైతులకు అందేలా చర్యలు చేపట్టాలన్నారు.
108 వాహనాల్లో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ (EMT) ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మేనేజర్ ఒక ప్రకటనలో తెలిపారు. జీఎన్ఎం, బీఎస్సీ లైఫ్ సైన్సెస్, బి. ఫార్మసీ, బీఎస్సీ నర్సింగ్ తదితర కోర్సులు చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులని చెప్పారు. రేపటి లోపు న్యూ రిమ్స్లోని 108 కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.