India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రొద్దుటూరు ఏడో వార్డులో పింఛన్ డబ్బు పంచలేదని తెలిసిందే. దీనికి కారణం ఏంటా అని అధికారులు విచారించారు. ఆ వార్డు సచివాలయ కార్యదర్శి మురళీమోహన్ పింఛన్ డబ్బు బ్యాంకు నుంచి డ్రా చేసి దొంగతనానికి గురైనట్లు పథకం పన్నాడు. పోలీసుల తమదైన శైలిలో విచారించగా.. బెట్టింగ్కు బానిసై సొంత ఖర్చులకు పింఛన్ డబ్బులు కాజేసినట్లు తేలడంతో డీఎస్పీ మురళీధర్ క్రిమినల్ కేసు నమోదు చేశారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా స్వీకరించే అర్జీలకు అర్జీదారులు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారం అందించాలని జిల్లా కలెక్టర్ వి.విజయరామరాజు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని సమావేశ హాలు నందు ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. అర్జీలను క్షేత్ర స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేయాలని అధికారులకు సూచించారు.
బ్రహ్మంగారిమఠం మండలం పెద్దిరాజుపల్లి ఎంపీపీఎస్లో ఎస్జీటీగా పనిచేస్తున్న బాలకృష్ణ బద్వేలులో టాటా ఏస్ ఢీకొనడంతో మృతి చెందాడు. బద్వేలులోని ఇంటినుంచి నీళ్లు తీసుకురావడానికి వెళ్తుంటే టాటా ఏస్ ఢీ కొట్టి అక్కడికక్కడే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఉపాధ్యాయుడి మృతి పట్ల మండల ఉపాధ్యాయుల విద్యాశాఖ అధికారి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు.
కడ జిల్లాలో తొలి రోజు గ్రామ సచివాలయ ఉద్యోగస్తులతో 96.57% లబ్ధిదారులకు పింఛన్ పంపిణీ పూర్తి చేశారు. ఈ సందర్భంగా జిల్లాలో 2,65,774 మంది పింఛన్దారులు ఉండగా వారికి 178,38,36,500 కోట్లు నిధులు విడుదల అయ్యాయి. మొదటి రోజు 2,56,667 మందికి 172,32,84,000 కోట్లు పంపిణీ చేయడం జరిగింది.
కడప అంగడి వీధికి చెందిన దూదేకుల మహబూబ్ చాంద్ (17) అనే విద్యార్థిని ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఐరన్ టాబ్లెట్లు మింగి ఆత్మహత్య చేసుకున్నట్లు సీఐ శివశంకర్ నాయక్ తెలిపారు. ఆయన వివరాల మేరకు.. మృతురాలిది పెద్దమండెం మండలం పెద్దపసుపుల గ్రామం కాగా, అంగడి వీధిలోని తన చిన్నమ్మ వద్ద ఉంటూ కడపలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నట్లు ఆయన తెలిపారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఖాజీపేట బాలికల ఉన్నత పాఠశాలలో సోమవారం మధ్యాహ్నం విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని సమాచారం. స్థానికుల వివరాల మేరకు.. విద్యార్థుల అస్వస్థదకు కలుషిత నీరే కారణమని, సుమారు 30 మంది విద్యార్థులు కడుపునొప్పితో ఇబ్బంది పడ్డారన్నారు. మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి వైద్య చికిత్స అందిస్తున్నారన్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రొద్దుటూరు 7వ వార్డు పరిధిలోని వార్డు సెక్రటరీ మురళీమోహన్కు రోడ్డు ప్రమాదం జరిగింది. గమనించిన స్థానికులు అతణ్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. తాను పెన్షన్లు పంపిణీ చేసేందుకు వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగిందని, ఆ సమయంలో స్పృహ కోల్పోయినట్లు తెలిపారు. పెన్షన్ సొమ్ము దాదాపు రూ.4 లక్షల ఎవరో తీసుకెళ్లారన్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పోలీసులు సీసీ ఫుటేజీలు పరిశీలిస్తున్నారు.
కడప జిల్లా ఒంటిమిట్ట మండలం పరిధిలోని కడప – చెన్నై ప్రధాన రహదారిపై మండపం పల్లి కనము వద్ద కారు, బస్సు ఢీకొన్న ఘటన సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కారు తీవ్రంగా దెబ్బతింది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించినట్లు గ్రామస్థులు వెల్లడించారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు అన్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
జూన్ 29వ తేదీన ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా 22 బెంచుల్లో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం జరిగింది. ఈ జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా 2367 కేసులను పరిష్కరించారు. ఇందులో క్రిమినల్ కేసులు 2036, సివిల్ కేసులు 217, ఫ్రీ లిటిగేషన్ కేసులు 114 పరిష్కారమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా కేసుల పరిష్కారంలో జిల్లా రెండవ ర్యాంకులో నిలిచింది.
మండలంలోని అంగడివీధికి చెందిన ఓ బాలిక (16) చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పెద్దముడియం మండలానికి చెందిన బాలిక అంగడివీధిలోని తన పిన్ని ఇంట్లో ఉంటూ చదువుకుంటోంది. కుటుంబ సభ్యులు తనని పెళ్లికి తీసుకువెళ్లలేదని మనస్తాపంతో అధిక మోతాదులో మాత్రలు మింగి అస్వస్థకు గురి కావడంతో, ఏలూరు హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.