India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మైదుకూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డికి హైకోర్టు ముందస్తు బెయిలు మంజూరు చేసింది. రూ.30 వేలతో రెండు పూచీకత్తులు సమర్పించాలని స్పష్టం చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వీఆర్కే కృపాసాగర్ మంగళవారం ఈమేరకు తీర్పు ఇచ్చారు. ఎన్నికల సమయంలో చాపాడు పోలీసులు తనపై నమోదు చేసిన హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ కేసులో ముందస్తు బెయిలు మంజూరు చేయాలని రఘురామిరెడ్డి హైకోర్టులో వ్యాజ్యం వేశారు.
వైవీయూ కెమిస్ట్రీ స్కాలర్ వై.వి. దివ్యశ్రీకి వైవీయూ డాక్టరేట్ ప్రదానం చేసింది. కెమిస్ట్రీ ప్రొ. ఎన్.సి. గంగిరెడ్డి పర్యవేక్షణలో ‘ఇటానియం బేస్డ్ నానో క్యాటలిస్ట్ డే డిగ్రీడేషన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ అండ్ ఆర్గానిక్ ట్రాన్స్ఫర్మేషన్’పై చేసిన పరిశోధనకు డాక్టరేట్ ప్రదానం చేసినట్లు వైవీయూ పరీక్షల నిర్వహణాధికారి ప్రొ. ఎన్. ఈశ్వర్ రెడ్డి తెలిపారు. ఈమె ప్రొద్దుటూరులో వార్డు సెక్రటరీగా పనిచేస్తున్నారు.
మైలవరం మండలం దొమ్మర నంద్యాల గ్రామానికి చెందిన గర్భవతి అంజనమ్మ, ఇద్దరు పిల్లలతో పాటు మంగళవారం రాత్రి 8గం. మైలవరం డ్యామ్ 13వ గేటు వద్ద ఆత్మహత్యకు ప్రయత్నించింది. పోలీసులకు అందిన సమాచారం మేరకు వెంటనే ఎస్సై, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాధితురాలిని స్టేషన్కు తరలించి విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా ఇంట్లో సమస్యలే కారణమని అందువల్లే ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసుల విచారణలో అంజనమ్మ తెలిపింది.
జిల్లాలోని ఆసుపత్రుల్లో సౌకర్యాలను పెంచాలని జిల్లా కలెక్టర్ శివ శంకర్ లోతేటి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్లో పారామెడికల్ సిబ్బంది నియామక నోటిఫికేషన్పై, కడప జీజీహెచ్, క్యాన్సర్ కేర్ సెంటర్, జిల్లా ఆసుపత్రి ప్రొద్దుటూరు, జీజీహెచ్ పులివెందుల ఆసుపత్రుల్లో సౌకర్యాలు, సదుపాయాలు తదితర అంశాలపై కలెక్టర్ సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు.
కామర్స్ చదివిన వారికి విస్తృత ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని వైవీయూ వీసీ ఆచార్య కె. కృష్ణారెడ్డి ఉద్బోధించారు. విశ్వవిద్యాలయంలో కామర్స్ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆచార్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. సమాజానికి ఒక దీపదారిలా ఉండేలా జ్ఞానాన్ని పొందాలన్నారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎస్ రఘునాథరెడ్డి మాట్లాడుతూ.. నిత్యం సానుకూల ఆలోచనలు చేయాలని సూచించారు.
పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, పర్యావరణ సహిత, ఆరోగ్యకర ఆహ్లాదకర వాతావరణంలో గణేశ్ చతుర్థి, విజయదశమి ఉత్సవాలను జరిగేలా ప్రజల్లో అవగాహన పెంచాలని చేపట్టాలని జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి అధికారులను ఆదేశించారు. జిల్లాలో పర్యావరణ సహితంగా గణేశ్ చతుర్థి, విజయదశమి ఉత్సవాల నిర్వహణ, సీజనల్ వ్యాధుల నియంత్రణ, పారిశుద్ధ్యంపై వీసీ నిర్వహించారు. అనంతరం పోస్టర్లు ఆవిష్కరించారు.
ప్యాసింజర్ ట్రైన్లో ప్రయాణిస్తున్న బాలుడు కిందపడగా తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాణికుల వివరాల ప్రకారం.. ప్యాసింజర్ ట్రైన్లో ప్రయాణిస్తున్న బాలుడు హుస్సేన్ ప్రమాదవశాత్తు గంగాయిపల్లె – కమలాపురం మార్గమధ్యలో కింద పడ్డాడు. గాయపడ్డ బాలుడిని కమలాపురం ప్రభుత్వ హాస్పిటల్లో ప్రాథమిక చికిత్స అందించి అనంతరం కడప రిమ్స్కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మంగళవారం అసెంబ్లీ సమావేశంలో మాజీ సీఎం జగన్పై రెచ్చిపోయారు. ‘జగన్ వ్యక్తిగతంగా నాపై కోడికత్తి కేసు, వివేకానంద రెడ్డి హత్య కేసు పెట్టారు. 2019 మార్చి 15న ఉదయం వివేకాకు గుండెపోటు అని చెప్పిన వ్యక్తి చివరికి నేను వైరస్లా దూరి చంపానన్నారు. జగన్ ఎంతోమందిని చంపించారు. అనంతబాబు ఒకరిని చంపి డిక్కీలో తీసుకొచ్చారు’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
కడపలో విచ్చలవిడిగా గంజాయి రవాణా జరుగుతోందని, పోలీసులు వెంటనే గంజాయి విక్రయాలపై మెరుపు దాడులు చేయాలని TDP జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి (వాసు) కోరారు. YCP పాలనలో కడప నగరంలో విచ్చలవిడిగా గంజాయి విక్రయాలు సాగాయని, గంజాయి వల్ల యువత నాశనం అయిందన్నారు. దీనిపై నూతనంగా బాధ్యతలు తీసుకున్న ఎస్పీతో పాటు ఇతర పోలీసు అధికారులు స్పందించి ఎక్కడికక్కడ మెరుపుదాడులు నిర్వహించి గంజాయి కట్టడి చేయాలని సూచించారు.
ఏపీలో వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు మంజూరు చేస్తామన్నారు. విశాఖ-చెన్నై కారిడార్లో కొప్పర్తికి నిధులు కేటాయించినట్లు తెలిపారు. నీళ్లు, రోడ్లు, హైవేల అభివృద్ధికై నిధులు కేటాయిస్తున్నట్లు నిర్మలా తెలిపారు.
Sorry, no posts matched your criteria.