India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ముద్దనూరు ప్రధాన రహదారిలోని చిటిమిటి చింతల గ్రామ సమీపంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసుల వివరాలు మేరకు.. ముద్దనూరు మండలం చింతకుంట గ్రామానికి చెందిన మార్క్ (49) మృతిచెందాడు. బైక్ పై వివాహానికి వెళ్లి వస్తుండగా చిటిమట్టి చింతల వద్ద ట్రాక్టర్ ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. దీనిపై ఏఎస్ఐ మురళి యాదవ్ కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు తెలిపారు.
కడప నబీకోటలో ఈనెల 23న వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. నబీకోటలో ఉండే మాధవ్ (35)ని 14 ఏళ్ల బాలిక ప్రేమించింది. ఇంట్లో వద్దని చెప్పినా వినకుండా గతేడాది ప్రేమ వివాహం చేసుకోగా, వీరికి ఏడాది బాలుడు ఉన్నాడు. భర్త మాధవ్, అత్త వెంకటసుబ్బమ్మతో పాటు మరో ఇద్దరు కలిసి ఆమెను వేధించారు. వేధింపులు తాళలేక ఆమె ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి నలుగురిని అరెస్టు చేశారు.
బి.కోడూరు మండలంలోని రాజుపాలెం దళితవాడకు చెందిన మున్నెల్లి అనూష గురువారం ఉదయం ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు. పోరుమామిళ్లలోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ చదువుతున్న ఆమె వేసవి సెలవుల్లో వనిపెంటలోని పెద్దమ్మ ఇంటికి వెళ్ళింది. అక్కడ ఒక అబ్బాయితో పరిచయం పెంచుకుంది. ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు ఆమెను మందలించారు. దీంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంది.
జిల్లాలో జులై 1, 2 తేదీల్లో చేపట్టనున్న పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని పగడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. రాయచోటి కలెక్టరేట్లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్, డిఆర్డీఏ పీడీ సత్యనారాయణ, జిఎస్ డబ్ల్యుఓ ఏవో లక్ష్మీపతి, తదితర అధికారులు పాల్గొన్నారు.
జిల్లావ్యాప్తంగా ఈనెల 29న జాతీయ మెగా లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ జస్టిస్ శ్రీదేవి తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో లోక్ అదాలత్తో సత్వర పరిష్కారం కోసం చర్యలు తీసుకున్నట్లు జస్టిస్ శ్రీదేవి తెలిపారు. లోక్ అదాలత్ ద్వారా బాధితులకు సత్వర న్యాయం జరుగుతుందని, అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు.
సుండుపల్లె పింఛా ప్రాజెక్టు నదిలో ప్రమాదవశాత్తూ పడి యశ్వంత్ నాయక్(15)విద్యార్థి మృతి చెందినట్లు ఎస్సై హుస్సేన్ తెలిపారు. ఎస్ఐ వివరాల మేరకు పింఛాకు చెందిన మునె నాయక్ కుమారుడు యశ్వంత్ బుధవారం పింఛానదిలో స్నానం చేసేందుకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడిపోయి మృతి చెందాడు. పోలీసులు గురువారం మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేశారు.
AP- RGUKT పరిధిలోని 4 IIITల్లో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి గత నెల 8న ప్రారంభమైన ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ 25వ తేదీకి ముగిసింది. ఈఏడాది 4,400 ప్రవేశాలకు గాను 53,863 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. జులై 11న ఎంపికైన అభ్యర్థుల
జాబితాను ప్రకటించనున్నట్లు తెలిపారు. జులై 22, 23న నూజివీడు, ఇడుపులపాయ,
24, 25న ఒంగోలు, 26, 27న శ్రీకాకుళం IIIT అభ్యర్థులకు కౌన్సెలింగ్ జరగనుంది.
కేంద్ర ప్రభుత్వ నీతి ఆయోగ్ సంస్థ ఆదేశాల మేరకు జూలై 4న జిల్లాలో సంపూర్ణత అభయాన్ కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ యం.అభిషిక్త్ కిషోర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రాం క్రింద సంపూర్ణత అభయాన్ కార్యక్రమం అమలు, సాధించాల్సిన లక్ష్యాలు, చేపట్టాల్సిన చర్యలు తదితర అంశాలపై పలు శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు.
వీరబల్లి మండల కొత్తవడ్డెపల్లిలో ఇంట్లో ఉండొద్దని కోడలు అత్తమామలకు విషం పెట్టి చంపిన ఘటన గురువారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు మేరకు.. కొడుకు, కోడలు కలిసి సుబ్బన్న(80), నాగమ్మ(70) చంపేందుకు అన్నంలో విషం కలిపారు. అది తిన్న దంపతులు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దంపతులు మరణించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేస్తే ఏదో జిల్లాలు అభివృద్ధి పథంలో నడిపేందుకు అనుకున్నా కానీ ఇక్కడ చూస్తే ప్రజాధనం దుర్వినియోగం చేసి పెద్ద పెద్ద కార్యాలయాల భవనాలు కడతారని అనుకోలేదనీ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. గురువారం మంత్రి రాయచోటిలోని వైసీపీ కార్యాలయం నిర్మాణాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు.
Sorry, no posts matched your criteria.