India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రొద్దుటూరులో సోమవారం దారుణ హత్య జరిగిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాల మేరకు.. YMR కాలనీలో నివాసం ఉండే రత్నమ్మ భర్త చనిపోవడంతో రామచంద్రారెడ్డితో సహజీవనం చేస్తున్నారు. రత్నమ్మకు కొడుకు మహేశ్వరరెడ్డి ఉండగా, ముగ్గురు ఒకే ఇంట్లో ఉంటారు. మహేశ్వరరెడ్డికి, రామచంద్రారెడ్డి మధ్య గొడవ జరిగింది. దీంతో రామచంద్రారెడ్డి మహేశ్వరరెడ్డిని ముక్కలు ముక్కలుగా నరికి, సంచుల్లో వేసుకొని మైలవరం ఉత్తర కాలువవద్ద పడేశాడు.
కడప: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా స్వీకరించే అర్జీలకు నాణ్యమైన పరిష్కారం అందించాలని జిల్లా కలెక్టర్ వి.విజయరామరాజు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అర్జీల స్వీకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వి.విజయరామరాజుతో పాటు జాయింట్ కలెక్టర్ గణేశ్ కుమార్, పలు శాఖల జిల్లా అధికారులు ఫిర్యాదులు స్వీకరించారు.
AP- RGUKT పరిధిలోని 4 IIITల్లో 2024 -25 విద్యా సంవత్సరానికి సంబంధించి గత నెల 8న ప్రారంభమైన ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ మంగళవారం సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. ఏపీ IIITల్లో ఒకటైన కడప జిల్లా ఇడుపులపాయ 1100 మందికి ప్రవేశాలు కల్పిస్తారు. గతేడాది కంటే దరఖాస్తులు అధిక సంఖ్యలో వచ్చాయని సమాచారం. కాగా ప్రవేశాల తొలి విడత సెలక్షన్ లిస్ట్ జూలై 7న ‘www.rgukt.in’ వెబ్ సైట్లో విడుదల చేయనున్నారు.
AP- RGUKT పరిధిలోని 4 IIITల్లో 2024 -25 విద్యా సంవత్సరానికి సంబంధించి గత నెల 8న ప్రారంభమైన ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ 25న సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. ఏపీ IIITల్లో ఒకటైన కడప జిల్లా ఇడుపులపాయ 1100 మందికి ప్రవేశాలు కల్పిస్తారు. గతేడాది కంటే దరఖాస్తులు అధిక సంఖ్యలో వచ్చాయని సమాచారం. కాగా ప్రవేశాల తొలి విడత సెలక్షన్ లిస్ట్ జూలై 7న ‘www.rgukt.in’ వెబ్సైట్ విడుదల చేయనున్నారు.
ప్రొద్దుటూరు టూ టౌన్ పరిధిలో దాదాపు 7ఏళ్ల క్రితం హైందవి(21) అనే యువతి దారుణ హత్య కేసులో నిందితుడు నవీన్ కుమార్కు యావజ్జీవ కారాగార శిక్ష, రూ.1.50 వేలు జరిమానా విధిస్తూ ప్రొద్దుటూరు సెకండ్ ఏ.డీ.జె కోర్టు జడ్జి శ్రీ జి.ఎస్ రమేష్ కుమార్ సోమవారం తీర్పు ఇచ్చారు. కేసును సరైనా సమయంలో సాక్షులను కోర్టు హాజరు పరిచి ముద్దాయికి శిక్ష పడేలా చేసిన కోర్ట్ మానిటరింగ్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
జిల్లా వ్యాప్తంగా సోమవారం ఉదయం వరకు కురిసిన వర్షానికి కాశినాయన మండలంలో అత్యధిక వర్షపాతం నమోదయింది. కాశినాయన మండల పరిధిలో 7.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, బద్వేలు మండలంలో 1.6 మి.మీ., రాజుపాలెం మండల పరిధిలో 1.2 మి.మీ., వర్షపాతం నమోదయింది. జిల్లా వ్యాప్తంగా 9.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, జిల్లా సరాసరి 0.3 గా నమోదయింది.
ప్రొద్దుటూరులోని YMR కాలనీలోని మాజీ MLA ఇంటి ఎదురుగా దారుణ హత్య చోటు చేసుకుంది. పోలీసుల వివరాలు మేరకు.. పట్టణానికి చెందిన వెంకట మహేశ్వర్ రెడ్డి భారతి సిమెంట్ ఫ్యాక్టరీలో పని చేస్తున్నాడు. ఇతడిని ఇంట్లోనే దారుణంగా హత్య చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రాథమిక విచారణలో భూమిరెడ్డి రామచంద్రారెడ్డి అనే వ్యక్తి హత్య చేసినట్లు నిర్ధారించారు. కాగా శుక్రవారం అర్షత్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు.
కడపకు చెందిన యువకుడు ఇమ్రాన్ నెల్లూరు జిల్లాలోని మైపాడు బీచ్ కు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. కడపలోని ఆటో మెకానిక్ యూసుఫ్ కుమారుడైన ఇమ్రాన్ తన స్నేహితులతో కలిసి ఆటవిడుపు కోసం ఓ వాహనంలో ఆదివారం మైపాడు బీచ్కు వెళ్లారు. అక్కడ సరదాగా సముద్రంలో గడుపుతుండగా పెద్ద అల ఇమ్రాన్ను తీసుకెళ్లింది. స్థానికుల సహకారంతో ఇమ్రాన్ మృతదేహాన్ని వెలికితీసి కడపకు తీసుకువచ్చారు.
మాజీ సీఎం వైఎస్ జగన్ మూడవరోజు తన సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటిస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజలు, కార్యకర్తలతో ఆయన మమేకమవుతారు. మధ్యాహ్నం నుంచి ఆయన సతీమణి భారతితో రోడ్డు మార్గన బెంగళూరు వెళ్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా గత రెండ్రోజులుగా జగన్ను కలిసేందుకు వస్తున్న వైసీపీ కార్యకర్తలు, శ్రేణులను ఆయన ఆత్మీయంగా పలకరిస్తున్నారు.
వేంపల్లి మండలంలోని ఇడుపులపాయ సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ట్రిపుల్ ఐటీ సెక్యూరిటీ గార్డ్ ఎద్దుల రాజీవ్ ప్రసాద్ మృతి చెందాడు. వేంపల్లిలో నివాసం ఉంటున్న రాజీవ్ ప్రసాద్ ఆదివారం యథావిధిగా ద్విచక్ర వాహనంలో ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీకి విధులకు వెళ్లి తిరిగి వస్తుండగా వైయస్సార్ ఘాట్ సమీపంలో అదుపుతప్పి గోతిలో పడిపోయాడు. తీవ్ర గాయాల పాలైన అతడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
Sorry, no posts matched your criteria.