India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రోడ్డు ప్రమాదంలో కుటుంబ సభ్యులను కోల్పోతే ఎంత నరకంగా ఉంటుందో నాకు తెలుసని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ఆదివారం మంత్రిగా బాధ్యతలు తీసుకున్న అనంతరం మాట్లాడుతూ.. మా నాన్న ఎమ్మెల్యేగా ఉండేవాడు. నాకు 11 ఏళ్ల వయసు ఉన్నప్పుడు రోడ్డు ప్రమాదంలో ఆయనను కోల్పోయాను. రోడ్లు బాగుంటే ప్రమాదాలు జరగవు. జగన్ ప్రభుత్వం రోడ్లను పట్టించుకోలేదన్నారు. రెండు నెలల్లో రోడ్ల బాగుపై దృష్టిపెడతామన్నారు.
కడప నగరంలోని పీవీఆర్ ఇండోర్ స్టేడియంలో ఈనెల 30వ తేదీన జిల్లాస్థాయి బ్యాడ్మింటన్ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఎస్. భాస్కర్ రెడ్డి, శ్రీనివాసులరెడ్డి తెలిపారు. అండర్ -19 జూనియర్ విభాగం, సీనియర్ విభాగంలో పురుషులు, మహిళల విభాగం ఎంపికలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో విడివిడిగా ఎంపికలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలం సానిపాయ పరిధిలో ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న ముగ్గురు స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి నాలుగు ఎర్రచందనం దుంగలతో పాటు కారు, మోటారు సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. శనివారం రాత్రి సానిపాయ పరిధిలో కూంబింగ్ చేపట్టగా అటవీ ప్రాంతంలో కొందరు వ్యక్తులు కారులో ఎర్రచందనం దుంగలను లోడ్ చేస్తూ కనిపించగా, అరెస్ట్ చేశామని తెలిపారు.
పులివెందులలో నేడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. ఇందులో భాగంగా వైఎస్ జగన్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజలు, నాయకులు ఎవరూ అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డి, ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్, ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, మేయర్ సురేశ్ బాబు, తదితరులు పాల్గొన్నారు.
ప్రతి సోమవారం “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ” ద్వారా ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులను స్వీకరించే కార్యక్రమాన్ని పటిష్ఠంగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు పేర్కొన్నారు. ఈనెల 24వ తేదీ నుంచి ప్రతి సోమవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలోని ప్రజా ఫిర్యాదుల స్వీకరణ వేదిక ద్వారా ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తామని తెలిపారు.
కడప జిల్లాలోని ప్రముఖ మైలవరం జలాశయం పాలకుల నిర్లక్ష్యంతో సమస్యలకు నిలయంగా మారిందని స్థానికులు వాపోతున్నారు. నలభై ఏళ్ల క్రితం నిర్మించిన ఈ ప్రాజెక్ట్ కడప, కర్నూలు జిల్లాల పరిధిలోని 75 గ్రామాలకు ప్రతి రోజు 0.008 టీఎంసీల నీటిని అందిస్తోంది. అయితే జలాశయంపై నిర్మించిన 2.85 కి.మీ రహదారి పాడైందని, రక్షణ గోడ సైత చాలా వరకు కూలిందని వారు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని కోరారు.
బీమా సొమ్ము కోసం బామ్మర్దిని బావ హత్య చేసిన ఘటన చెన్నూరులో జరిగింది. కనుపర్తి చెందిన నారాయణరెడ్డి పేరున చెన్నూరుకు చెందిన అతని సోదరి భర్త బాల గురుప్రసాద్రెడ్డి రూ.12.5 లక్షలకు 2 బీమా పాలసీలు చేయించారు. నామినీగా అతని సోదరి పేరు నమోదు చేయించారు. బీమా సొమ్ము కోసం 18న చెన్నూరు శివారులో మద్యం మత్తులో ఉన్న నారాయణరెడ్డిని అతని బావ తలపై దిమ్మెతో కొట్టి హతమార్చినట్లు సీఐ శంకర్ నాయక్ తెలిపారు.
ఆంధ్ర భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో శనివారం పౌర్ణమి సందర్భంగా సీతారాములకు ఘనంగా కళ్యాణం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో గల కళ్యాణ వేదిక వద్ద ప్రత్యేక మండపం ఏర్పాటు చేసి సీతారాములను కొలువు తీర్చి ఆలయ అర్చకులు కళ్యాణ తంతు నిర్వహించారు. స్వామి వారి కళ్యాణాన్ని తిలకించేందుకు అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.
కడప జిల్లా పర్యటనకు వచ్చిన మాజీ సీఎం వైఎస్ జగన్ ను చూసేందుకు పులివెందులలోని ఆయన క్యాంప్ ఆఫీస్ కు కార్యకర్తలు, నాయకులు పోటెత్తారు. జగన్ వచ్చిన వెంటనే ఆయనతో కరచాలనం చేసి మాట్లాడేందుకు కొంత మంది యువకులు ఒక్కసారిగా పోటీపడ్డారు. జగన్ ను కలిసేందుకు తోసుకోగా పక్కనే ఉన్న కిటికీపై పడటంతో కిటికీ అద్దం పగిలి, ఓ యువకుడికి చేతికి కూడా గాయమైంది. ఇంటిపై దాడి అని వచ్చిన కథనాలను వైసీపీ నాయకులు ఖండించారు.
ప్రొద్దుటూరు పట్టణంలోని రామేశ్వరం రోడ్డులో శుక్రవారం అర్ధరాత్రి దారుణ హత్య ఘటన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. అర్షద్ (37) అనే వ్యక్తి రామేశ్వరం రోడ్డు వద్ద ఉన్న మద్యం దుకాణం సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు బండరాయితో తలపై మోది హత్య చేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.