Y.S.R. Cuddapah

News July 13, 2024

కడప ఎస్పీగా హర్షవర్ధన్ రాజు నియామకం

image

కడప జిల్లా నూతన ఎస్పీగా హర్షవర్ధన్ రాజును ప్రభుత్వం నియమించింది. కడప ఎస్పీగా పనిచేస్తున్న సిద్ధార్థ కౌశల్‌ను బదిలీ చేసింది. ఎన్నికల అనంతరం ఉన్నత అధికారులను బదిలీ ప్రక్రియ ప్రభుత్వం ప్రారంభించింది. అందులో భాగంగా కలెక్టర్‌ను మార్పు చేసిన విషయం తెలిసిందే. ఎస్పీగా నియమించబడ్డ హర్షవర్ధన్ రాజు గతంలో తిరుపతి ఎస్పీగా పనిచేశారు.

News July 13, 2024

దువ్వూరు: బ్రహ్మ సాగర్‌లో అడుగంటిన జలం

image

దువ్వూరు మండలం చల్లబసాయ పల్లె గ్రామం వద్ద ఉన్న బ్రహ్మ సాగర్ ఎస్సార్ 1లో నీరు అడుగంటింది. జలాశయంలో ప్రస్తుతం అట్టడుగునా నీరు ఉంది. జులై నెల రెండు వారాలు పూర్తయినప్పటికీ వర్షాల జాడ కనిపించడం లేదని రైతులు చెప్తున్నారు. దీంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రిజర్వాయర్‌లో నీరు అందుబాటులో ఉంటే పంటలు సాగు చేసుకోవచ్చని ఏడాది ఆరుతడి పంటలకే పరిమితం కావలసి వస్తుందని రైతులు వాపోతున్నారు.

News July 13, 2024

కడప: కళాశాలలకు ఇంటర్ పాస్ సర్టిఫికెట్లు

image

కడప జిల్లాలోని అన్ని జూనియర్ కళాశాలలకు 2024 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు పాస్ సర్టిఫికెట్లను సంబంధిత కళాశాలలకు పంపించామని ఇంటర్ ఆర్ఐఓ బండి వెంకటసుబ్బయ్య తెలిపారు. విద్యార్థులు నేరుగా కళాశాల ప్రిన్సిపాల్‌ను సంప్రదించి సర్టిఫికెట్లను పొందాలని తెలిపారు.

News July 13, 2024

ఓబులవారిపల్లె కానిస్టేబుల్ సస్పెన్షన్

image

నగదు గోల్‌మాల్ చేశారనే ఆరోపణలతో ఓ కానిస్టేబుల్‌పై వేటు పడింది. వివరాల్లోకి వెళితే.. ఓబులవారిపల్లె పోలీసు స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న మల్లికార్జునను ఎస్పీ కృష్ణారావు గురువారం సస్పెండ్ చేశారు. విధుల్లో భాగంగా రాజంపేట కోర్టుకు నిత్యం హాజరవుతూ న్యాయస్థానానికి సంబంధించి రూ.8 లక్షల నగదును గోల్‌మాల్ చేశారనే అభియోగంతో ఆయనను సస్పెండ్ చేశారని సమాచారం.

News July 13, 2024

ప్రొద్దుటూరు: అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త

image

మైలవరం మం, దొడియంకు చెందిన రేష్మ(25)కు 10 ఏళ్ల క్రితం అమృత నగర్‌కు చెందిన అన్వర్ బాషాతో ప్రేమ వివాహం జరిగింది. ఆమెకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని భర్త అనుమానం పెంచుకున్నాడు. 10 రోజుల క్రితం భర్తతో గొడవ పడి ఆమె తన పెద్దమ్మ ఇంటికి వెళ్లింది. శుక్రవారం భర్త ఆమె వద్దకు వెళ్లి సరదాగా పార్కు వెళ్దామంటూ పిలిచాడు. ఎకో పార్కుకు తీసుకెళ్లి గొంతు నులిమి చంపి పూడ్చి పెట్టి, స్టేషన్‌లో లొంగిపోయాడు.

News July 13, 2024

ఒంటిమిట్టలో తిరుమల లడ్డు ప్రసాదం

image

రెండవ అయోధ్యగా పేరుగాంచిన ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని సన్నిధిలో ఇకపై ప్రతినెలా నాలుగో శనివారం తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం భక్తులకు అందుబాటులో ఉండనుంది. టీటీడీ ఆధ్వర్యంలో ఒక లడ్డు రూ.50 చొప్పున విక్రయిస్తారు. ఉదయం 7:30 గంటల నుంచి భక్తులు కొనుగోలు చేయవచ్చు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆలయ అధికారులు తెలిపారు.

News July 13, 2024

అన్నమయ్య: రూ.13,102 కోట్లతో జిల్లా వార్షిక రుణ ప్రణాళిక ఆమోదం

image

అన్నమయ్య జిల్లాకు సంబంధించి 2024-25లో రూ.13,102 కోట్లతో జిల్లా వార్షిక రుణ ప్రణాళిక ఆమోదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి తెలిపారు. కలెక్టరేట్‌లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన బ్యాంకర్లతో డీసీసీ, డీఎల్ఆర్సీ సమావేశం నిర్వహించారు. 2024-25కు ప్రతిపాదిత వార్షిక రుణ ప్రణాళిక అంశాలపై జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ జి.ఆంజనేయులు కలెక్టరుకు వివరించారు.

News July 12, 2024

పులివెందుల ఎన్నికలపై బీటెక్ రవి సంచలన వ్యాఖ్యలు

image

పులివెందులలో జరిగిన సార్వత్రిక ఎన్నికలపై బీటెక్ రవి ఓ ఛానల్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘జగన్ TDP ఏజెంట్లతో MLA ఓట్లు TDPకి వేసి, MP ఓట్లు తాము వేసుకుంటామని అన్నారు. అలా 30-40 బూత్‌ల నుంచి తనకు ఫోన్లు చేయించారన్నారు. అందుకు TDP ఏజెంట్లు తనను సరే అనమన్నారని .. తాను కుదరని ఎంపీగా భూపేశ్ రెడ్డిని అభ్యర్థిగా నిలబెట్టామని, పార్టీకి చెడ్డ పేరు వస్తుంది అలా చేయకండి’ అని తాను అప్పుడే చెప్పానని అన్నారు.

News July 12, 2024

పులివెందుల: మద్యం మత్తులో నిప్పు అంటించుకుని మృతి

image

పులివెందుల పరిధిలోని బొగ్గుడిపల్లెలో గురువారం రాత్రి కారులో నిప్పు అంటించుకుని ప్రభాకర్ రెడ్డి (80) అనే వృద్ధుడు మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. బోగుడిపల్లి గ్రామానికి చెందిన ప్రభాకర్ రెడ్డికి గత కొద్దిరోజులుగా మతి స్థిమితం సరిగ్గా లేదు. గురువారం రాత్రి మద్యం మత్తులో కారులోకి వెళ్లి తనపై పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకుని మృతి చెందాడని తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 12, 2024

జమ్మలమడుగు: ‘ఈ భావికి భీముడికి సంబంధం ఉంది’

image

మహాభారతానికి పెద్దముడియం మండలం భీమగుండంలోని బావికి సంబంధం ఉందని అక్కడి ప్రజలు భావిస్తారు. పాండవులు వనవాసంలో ఉండగా ద్రౌపది భీముడిని నీళ్లు తీసుకొని తీసుకురమ్మని చెప్తుంది. అక్కడ అంతా రాతిమయమవడంతో నీరెక్కడా కనిపించదు. భీముడు గదతో ఒక రాతిని 101 ముక్కులుగా చేసి భూమి నుంచి నీరు తెప్పించాడని గ్రామస్థులు చెప్తున్నారు. దీంతో ఆ ఊరిని భీమగుండంగా పిలుస్తారని వారు తెలిపారు. ఆ భావిని భీముని గుండంగా పిలుస్తారు.