India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదలకు జిల్లా అధికారులు ప్రతిపాదనలను పంపారు. ఇందులో భాగంగా కడప కేంద్ర కారాగారం నుంచి 2023లో 11 మంది, 2024లో ఐదుగురు, తాజాగా నలుగురు ఖైదీలను కలిపి మొత్తం 20 మంది పేర్లతో కూడిన జాబితాను రాష్ట్ర జైల్ల శాఖ ప్రధాన కార్యాలయానికి పంపారు. రాష్ట్ర ప్రభుత్వం ఖైదీల విడుదలపై కమిటీ ద్వారా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
నేడు అంతర్జాతీయ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని జనాభా అధ్యయన కేంద్ర గ్రోత్ రేట్ ఆధారంగా జనాభా గణాంకాలను విడుదల చేశారు. దీని ప్రకారం ప్రస్తుతం కడప జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో 20,60,654 జనాభా ఉన్నట్లు తెలిపారు. కాగా 2011 జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి కడప జిల్లాలో 28,84,524 మంది ఉన్నారు. కాగా ఈఏడాది జిల్లాలో భారీగా జనాభా పెరిగిందని తెలిపారు.
TDP ప్రభుత్వం చెప్పిన ఉచిత ఇసుక అనేది అబద్ధమని MLC డీసీ గోవిందరెడ్డి విమర్శించారు. ఉచిత ఇసుక మాటలకే పరిమితమైందని, చంద్రబాబు కొత్త రకం దోపిడీకి తెరలేపారన్నారు. జగన్ హయాంలో పారదర్శకంగా ఇసుకను అందజేయడంతో రూ.కోట్ల ధనం ప్రభుత్వ ఖజానాలోకి వచ్చేదన్నారు. ఇప్పుడు ఆ డబ్బంతా టీడీపీ నేతల జేబుల్లోకి వెళ్తుందని ఆరోపించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం ప్రజల నుంచి ఒక్క రూపాయి తీసుకోకుండా ఇసుక ఇవ్వాలన్నారు.
ప్రజలు వ్యయ ప్రయాసలకు గురి కాకుండా వాలిపోయిన స్తంభాలు, తక్కువ ఎత్తులో ఉన్న లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు వంటి విద్యుత్ సమస్యలను వాట్సాప్ ద్వారా తెలపాలని విద్యుత్ శాఖ అధికారి రమణ అన్నారు. ఈ మేరకు ఫిర్యాదుదారుని పేరు, చిరునామా, వారి చరవాణితో వాట్సాప్ నంబర్ 9440814264కు పంపించాలని కోరారు. హెల్ప్ డెస్క్ సిబ్బంది సంబంధిత అధికారులకు తెలిపి సమస్య పరిష్కారం అయ్యేంత వరకు అనుసరిస్తారని వివరించారు.
ఒంటిమిట్ట కోదండ రామాలయంలో జులై 21న స్వామివారి పౌర్ణమి కళ్యాణం నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు బుధవారం వెల్లడించారు. రూ.1,000 ఆన్లైన్ ద్వారా గానీ, నేరుగా ఆలయంలో గాని సమర్పించి కళ్యాణంలో ఉభయదారులుగా వ్యవహరించవచ్చని వారు తెలిపారు. జులై 21న వ్యాస పౌర్ణమి కూడా ఉందని చెప్పారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.
➤ IIITలో గంజాయి.. లోకేశ్ ఆగ్రహం
➤ కడప హైవేపై రోడ్డు ప్రమాదం
➤ కడప టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ మృతి
➤ ఒంటిమిట్టలో నీళ్లు లేక భక్తుల ఇక్కట్లు
➤ జగన్ రాజీనామా వార్తల్లో నిజం లేదు: సురేశ్
➤ కొండాపురంలో ఏడుగురి అరెస్ట్
➤ సీఎంకు మండిపల్లి పాలాభిషేకం
➤ పౌర సరఫరాల శాఖలో భారీ అవినీతి: ఎమ్మెల్సీ రాం గోపాల్ రెడ్డి
గత వైసీపీ ప్రభుత్వంలో పౌర సరఫరాల శాఖలో భారీ అవినీతి జరిగిందని టీడీపీ ఎమ్మెల్సీ రాం గోపాల్ రెడ్డి ఆరోపించారు. పులివెందులలో ఆయన మాట్లాడుతూ.. బియ్యం మిల్లర్ల నుంచి గోడౌన్కు వచ్చే సమయంలో వైసీపీ నేతల ద్వారా భారీగా పక్క దారి పట్టయన్నారు. జిల్లాలో ఈ దోపిడీపై క్షేత్రస్థాయిలో పర్యటించి అవినీతిని బయటకు తీస్తానని స్పష్టం చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్రంగా విచారించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు.
విద్యార్థులకు పోషక విలువలతో కూడిన నాణ్యమైన భోజనం పెట్టాలని జిల్లా కలెక్టర్ శివ శంకర్ అన్నారు. కాశినాయన మండలంలోని నరసాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాలు, మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. విద్యార్థులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు.
మైదుకూరు పట్టణ పరిధిలోని బద్వేలు రోడ్డులో గల పశువుల సంతను నంద్యాల రోడ్డులోని మార్కెట్ కమిటీ స్థలానికి మారుస్తూ బుధవారం మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం చేశారు. స్థానిక మున్సిపల్ కార్యాలయ సభ భవనంలో గురువారం జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్ సుమలత పశువుల సంతను పాత స్థలానికి మార్చాలని కోరగా ఇతర కౌన్సిలర్లు తీర్మానం చేశారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ.. ఎన్నికల హామీ మేరకు సంత మార్చాలన్నారు.
ఆంధ్ర భద్రాద్రిగా విరాజుల్లుతున్న శ్రీ ఒంటిమిట్ట కోదండరామ స్వామి దేవాలయంలో బుధవారం జూన్ నెలకి సంబంధించి టిటిడి అధికారుల సమక్షంలో హుండీ లెక్కింపు జరిగింది. ఈ సందర్భంగా ఆలయ రంగం మండపంలో స్వామివారి హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. లెక్కింపు అనంతరం జూన్ నెలకి సంబంధించి రూ. 4,06,902 వచ్చిందని ఆలయ టిటిడి అధికారులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.