Y.S.R. Cuddapah

News July 10, 2024

రేపు కడపలో జాబ్ మేళా.. అర్హతలివే!

image

జిల్లా ఉపాధి కల్పనాధికారి కార్యాలయంలో గురువారం ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి సురేశ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. హెచ్డీఎఫ్సీ లైఫ్, ఆల్ డిక్సన్, కాంపోజిట్ టెక్నాలజీ, ట్రయోవిజన్ కంపెనీల్లో వివిధ హోదాలలో పనిచేయుటకు టెన్త్, ఇంటర్, ఐటిఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ చదివిన విద్యార్థులు అర్హులని తెలిపారు. 18 నుంచి 32 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలని తెలిపారు.

News July 10, 2024

కడప టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ మృతి

image

కడప మున్సిపల్ కార్పొరేషన్‌లో పనిచేస్తున్న టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ మంగళవారం గుండుపోటుతో మృతి చెందారు. కుటుం సెలవులపై స్వగ్రామం నంద్యాలకు వెళ్లిన రామారావు(42) రెండు రోజుల క్రితం హార్ట్ స్ట్రోక్ రాగా చికిత్స నిమిత్తం హైదరాబాద్ తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి 9 గంటలకి మృతి చెందాడని తెలిపారు. వారి మరణానికి మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులు దిగ్భ్రాంతి చెందారు.

News July 10, 2024

పెండ్లిమర్రి: టిప్పర్ బోల్తా.. డ్రైవర్ మృతి

image

కడప – పులివెందుల ప్రధాన రహదారిలో పెండ్లిమర్రి మండలంలోని గుర్రాల చింతలపల్లె వద్ద మంగళవారం రాత్రి అదుపుతప్పి మినీ టిప్పర్ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో వేములకు చెందిన టిప్పర్ డ్రైవర్ గంగాధర్ అక్కడికక్కడే మృతి చెందాడు. వేముల నుంచి కడపకు ముగ్గురాయి లోడుతో వెళుతున్న టిప్పర్ అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో గంగాధర్ టిప్పర్ క్యాబిన్లో ఇరుక్కుపోయి తీవ్ర గాయాలతో మృతి చెందగా, క్లీనర్ గాయపడ్డాడు.

News July 10, 2024

ఉక్కు పరిశ్రమ కోసం మంత్రి మండిపల్లికి వినతి

image

కడపలో ఉక్కు పరిశ్రమను నిర్మించాలని కోరుతూ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి విద్యార్థి యువజన సంఘాల నాయకులు మంగళవారం వినతి పత్రం ఇచ్చారు. ఏటా లక్షలాది మంది నిరుద్యోగులు ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు మంత్రికి తెలిపారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తే లక్షలాది మందికి ఉద్యోగాలు దొరుకుతాయని వారు మంత్రికి విన్నవించారు.

News July 9, 2024

కడప: రైలు కింద పడివ్యక్తి మృతి  

image

కుమార్తె పెళ్లికి చేసిన అప్పులు తీర్చలేక ఓ తండ్రి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన కడపలో జరిగింది. రైల్వే హెడ్ కానిస్టేబుల్ సుభాన్ వివరాల మేరకు.. కడప మండలం ఎర్రముక్కపల్లెకు చెందిన భాస్కర్ ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. కుమార్తె వివాహానికి చేసిన అప్పులు తీర్చలేక జీవితంపై విరక్తి చెందాడు. ఈ క్రమంలో మంగళవారం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించారు. 

News July 9, 2024

ప్రజా సంక్షేమమే చంద్రబాబు ధ్యేయం: మంత్రి మండిపల్లి

image

ప్రజా సంక్షేమమే సీఎం చంద్రబాబు ధ్యేయమని మంత్రి మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి అన్నారు. కడప జడ్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. అవినీతిని ప్రోత్సహించే ప్రసక్తే లేదని, వచ్చే 5 ఏళ్లలో ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంటామన్నారు. ఉమ్మడి కడప జిల్లాలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులు, ఇతర సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు.

News July 9, 2024

రాయచోటి: పెట్రోల్ పోసుకొని వ్యక్తి ఆత్మహత్య

image

రాయచోటిలోని కొత్తపేట రామాపురం చౌడేశ్వరి టెంపుల్ వద్ద ఈశ్వర్ రెడ్డి (35) ఒంటిమీద పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. మంగళవారం ఆయన ఇంటి నుంచి మంటలు రావడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి డోర్ పగలగొట్టి చూడగా ఆయన అప్పటికే చనిపోయాడు. ఈశ్వర్ రెడ్డికి ఏడాది కిందటే వివాహమైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News July 9, 2024

సిద్దవటం: రైలు కింద పడి మేకల కాపరి మృతి

image

సిద్దవటం మండలం మాధవరం-1 గ్రామ పంచాయతీలోని గడుసుపల్లి కాలనీకి చెందిన మేకల కాపరి మామిడి రామసుబ్బారెడ్డి మంగళవారం రైలు కింద పడి మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. ఆయన మేకలు రైల్వే ట్రాక్‌పై పరిగెత్తడంతో వాటిని తప్పించబోయి కాపరి కూడా రైలు కింద పడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఆయనతో పాటు రెండు మేకలు కూడా రైలు కింద పడి మృతి చెందాయన్నారు.

News July 9, 2024

ఖాజీపేట: పది దుకాణాల్లో దొంగతనాలు

image

మండల కేంద్రమైన ఖాజీపేటలో సోమవారం రాత్రి పది దుకాణాల్లో చోరీ జరిగింది. గుర్తుతెలియని దుండగులు దుకాణాల పైకప్పులుగా ఉన్న రేకులను తొలగించారు. తరువాత అందులో నుంచి దుకాణాల లోపలికి దిగి క్యాష్ బాక్సుల్లో ఉన్న నగదును దోచుకెళ్లారు. ఖాజీపేటలో ఒకే రోజు 10 షాపుల్లో దొంగతనం జరగడం ఇదే మొదటి సారని స్థానికులు చర్చించుకుంటున్నారు.

News July 9, 2024

చింతకొమ్మదిన్నె: భర్త చేతిలో భార్య హత్య

image

మండలంలోని పాపాసాహెబపేట చెందిన లక్ష్మీదేవిని భర్త వెంకటసుబ్బారెడ్డి రోకలిబండతో బాది హత్య చేశాడు. SI శ్రీనివాసులు రెడ్డి కథనం మేరకు.. వెంకటసుబ్బారెడ్డికి తన భార్య లక్ష్మిదేవితో తరచూ గొడవ పడేవాడు. సోమవారం ఇద్దరూ గొడవపడగా.. సుబ్బారెడ్డి ఆగ్రహంతో క్షణికావేశంలో రోకలిబండతో భార్య తలపై బాదాడు. తీవ్ర గాయాలైన లక్ష్మీదేవిని రిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ మరణించిందని తెలిపారు. కేసు నమోదు చేశామన్నారు.