India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కేంద్ర పౌర విమానాయన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు రేపు కడపకు వస్తున్నట్లు అధికారులు తెలిపారు. రేపు సాయంత్రం కడప కలెక్టర్ కార్యాలయంలో ప్రధానమంత్రి కిసాన్ నిధుల విడుదల కార్యక్రమంలో కడప నుంచి ఆయన పాల్గొంటారని పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లను అధికారులు సిద్ధం చేస్తున్నారు. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పర్యటన పూర్తి షెడ్యూల్ తెలియాల్సి ఉంది.
కేంద్ర పౌర విమానాయన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు రేపు కడపకు వస్తున్నట్లు అధికారులు తెలిపారు. రేపు సాయంత్రం కడప కలెక్టర్ కార్యాలయంలో ప్రధానమంత్రి కిసాన్ నిధుల విడుదల కార్యక్రమంలో కడప నుంచి ఆయన పాల్గొంటారని పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లను అధికారులు సిద్ధం చేస్తున్నారు. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పర్యటన పూర్తి షెడ్యూల్ తెలియాల్సి ఉంది.
మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కడప జిల్లా పర్యటన వాయిదా పడింది. రేపటినుండి 5 రోజులు పాటు జిల్లాలో ఇడుపులపాయతో పాటు పలు ప్రాంతాల్లో పర్యటన ఉండగా..19 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం, ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఉన్న కారణంగా పర్యటనను వాయిదా వేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
రైల్వే కోడూరు ఓబులవారిపల్లి మండలం బొమ్మవరం దగ్గర విద్యుత్తు లైన్ బొప్పాయి లారీకి తగిలి లారీ దగ్ధమైంది. అందులో 30 మంది కూలీలు ఉన్నారు. మంగమ్మ మరణించగా మిగతా కూలీలు లారీ నుంచి దూకి పరిగెత్తారు. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన రైల్వేకోడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరిని తిరుపతి రూయాకు పంపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కడప నగర శివారులో సోమవారం ఆర్టీసీ బస్సు కారును ఢీకొంది. వివరాల్లోకి వెళ్తే.. ఈరోజు సాయంత్రం కడప నగర శివారులో కడప టు చెన్నై జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో కారును బస్సు ఢీకొట్టడంతో కారు ధ్వంసమైంది. దీంతో కారులోని ప్రయాణిస్తున్న కారులోనే రక్తపుమడుగులో ఇరుక్కుపోయారు. ఈ ఘటనలో ఎవరికి ఏం జరిగిందో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కడప జిల్లా బద్వేలు వాసులు నెల్లూరుకు వెళ్తుండగా కారుపై పెద్దపులి దాడి చేసిన ఘటన కలకలం రేపింది. మర్రిపాడు మండలంలోని కదిరి నాయుడుపల్లి అటవీ ప్రాంతంలో హైవేపై వెళ్తుండగా సోమవారం పులి దాడి చేసింది. ఇందులో కారు కొంత దూరం పులిని ఈడ్చుకెళ్లగా పులికి గాయాలయైనట్లు సమాచారం. ప్రమాదం తర్వాత పులి సమీప అడవిలోకి వెళ్లిపోవడంతో చుట్టుపక్కల ప్రాంతాల వారు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
కడప జిల్లాకు మంగళవారం మాజీ సీఎం జగన్ రానున్నట్లు వైసీపీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో వైసీపీ ఓటమి తర్వాత వైఎస్ జగన్ తొలిసారి సొంత జిల్లాకు రానున్నారు. మంగళవారం నుంచి నాలుగు లేదా ఐదు రోజులు పాటు ఇడుపులపాయ, కడప జిల్లాలో ఉండి కార్యకర్తలు నాయకులతో సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు పార్టీ నాయకులు తెలిపారు.
అంగన్వాడీ చిన్నారులకు సరఫరా చేసే పోషకాహార వస్తువులపై టీడీపీ ప్రభుత్వం మాజీ సీఎం జగన్ ఫొటోలను తొలగించింది. దానికి బదులుగా ప్రభుత్వ రాజముద్రను వేసి చిన్నారులకు పోషకాహారాలను పంపిణీ చేస్తోంది. అయితే గతంలో కొన్నింటిపై జగన్ ఫొటోను ముద్రించడంపై ప్రజలు వ్యతిరేకత వ్యక్తపరిచిన విషయం తెలిసిందే..!
పోరుమామిళ్ల మండలం అక్కల రెడ్డి పల్లె గ్రామ సమీపాన టెలిఫోన్ టవర్కు ఉరి వేసుకొని సోమవారం ఉదయం యువకుడు మృతి చెందినట్లు స్థానికులు గుర్తించారు. మృతుడు దాసరపల్లి ప్రేమ సాగర్ (22) గా తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోరుమామిళ్ల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ ముడమాల బాలముని రెడ్డి ఆదివారం రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్కు, మేనేజింగ్ డైరెక్టర్కు పంపినట్లు ఆయన తెలిపారు. కూటమి అధికారంలోకి రావడంతో తమ పదవికి రాజీనామా చేసినట్లు ఆయన తెలిపారు.
Sorry, no posts matched your criteria.