India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జిల్లాలో మొత్తం 11 ఇసుక స్టాక్ యార్డులు సిద్ధంగా ఉన్నాయి. టన్ను ఇసుక ధరల వివరాలు.. కొండాపురం మండలంలోని కె. వెంకటాపురం, పి. అనంతపురంలో రూ.340, కమలాపురంలో రూ.341, సిద్దవటం మండలంలోని జ్యోతిగ్రామంలో రూ.340, గోపవరంలో రూ.468, పోరుమామిళ్లలో రూ.587, పెండ్లిమర్రి మండలం పడగాలపల్లె, కొత్తూరుల్లో రూ.340, వీఎన్ పల్లె మండలంలోని ఎర్రబల్లెలో రూ.340, పులివెందులలో రూ.468, మైదుకూరులో రూ.400గా ధరలు ఉన్నాయి.
పరిశ్రమల్లో ప్రమాదాలు జరగకుండా భద్రతా చర్యలను మరింత పటిష్ఠం చేయాలని కలెక్టర్ శివశంకర్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా పరిశ్రమల భద్రతా కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని పరిశ్రమల్లో కార్మికులకు రక్షణ కల్పించేందుకు భద్రతా చర్యలు తీసుకోవాలన్నారు. డీఆర్వో గంగాధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారం ఇస్తే కేసును బట్టి నగదు బహుమతిని అందజేస్తామని సిద్దవటం రేంజర్ కళావతి తెలిపారు. మండల కేంద్రమైన సిద్దవటం అటవీశాఖ కార్యాలయంలో సోమవారం ఆమె మాట్లాడుతూ.. సిద్దవటం రేంజ్లో గత మూడు రోజులుగా 4 బృందాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి ఆనవాళ్లు కనిపించలేదన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించిన వివరాలు ఇస్తే వారి పేర్లు గొప్యంగా ఉంచుతామన్నారు.
కడప జిల్లా పాఠశాల ఆర్జేడీ రాఘవరెడ్డిపై బదిలీ వేటు వేశారు. ఇటీవల రాఘవరెడ్డిపై అవినీతి, అక్రమాలపై ఆరోపణలు రావడంతో విద్యాశాఖ విచారణ చేపట్టారు. క్రమశిక్షణా చర్యల కింద రాఘవరెడ్డిని విద్యాశాఖ అధికారులు బదిలీ చేశారు. ప్రభుత్వానికి రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు. అప్పటి వరకు కడప పాఠశాల ఆర్జేడిగా కర్నూలు డీఈఓ శామ్యూల్కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఆయన తనయుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఘనంగా నివాళులర్పించారు. ఇడుపులపాయలోని తన తండ్రి సమాధి వద్ద తన తల్లి వైఎస్ విజయమ్మ, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. జగన్ వెంట మాజీ ఎమ్మెల్యేలు, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
రాయచోటిలో ఆదివారం దారుణ హత్య జరిగింది. రాయచోటి మసీదు వీధికి చెందిన ఇర్షాద్ అలీ రెడ్డిబాషా కుమార్తెను వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో ఆమె సోదరుడు ఇబ్రహీం(22) తరచూ మద్యం తాగి సోదరి ఇంటికి వచ్చి వేధింపులకు గురి చేసేవాడు. దీంతో విసుగుచెందిన ఇర్షాద్ బావమరిదిని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే మద్యం తాగుదామని చెప్పి గున్నికుంట్లకు తీసుకెళ్లి ఫుల్లుగా తాగించి బీరుసీసాతో గొంతు కోసి హత్య చేశాడు.
పులివెందుల: రాబోయే కాలంలో ప్రతీ కార్యకర్తకు తనతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటుందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భరోసానిచ్చారు. పులివెందుల పర్యటనలో భాగంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు, మాజీ నేతలతో కూడా చర్చించారు. కార్యకర్తలు, నాయకులు ఎవరూ అధైర్యపడవద్దు, పార్టీ అండగా ఉంటుందని, అందరం కలిసి కట్టుగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని వివరించారు.
చాపాడు మండలం పల్లవోలు వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. ప్రొద్దుటూరు నుంచి మైదుకూరు వీరయ్య(60) బైకుపై వెళ్తుండగా వెనుక వైపు నుంచి వేగంగా కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వీరయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. కారులో ఉన్నవారు మద్యం మత్తులో ఉన్నారని స్థానికులు తెలిపారు. కాగా మృతుడు నాగులపల్లెకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.
చిత్తూరు – కర్నూల్ ఎన్హెచ్పై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరో కోణం వెలుగులోకి వచ్చింది. కడపకు చెందిన ఐదుగురు రాత్రి కారులో గువ్వలచెరువులో పాలకోవ తినడానికి వెళ్లారు. తినేసి వస్తున్న సమయంలో ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీకొట్టారు. దీంతో అక్కడికక్కడే నలుగురు మృతి చెందగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న మంత్రి మండిపల్లి సొంత నిధుల నుంచి రూ.లక్ష తక్షణ సాయం కింద అందించారు.
ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రేపు కడప జిల్లాకు రానున్నారు. తన తండ్రి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతిని పురస్కరించుకొని ఇడుపులపాయలోని ఆయన సమాధి వద్ద నివాళులు అర్పించేందుకు ఆమె జిల్లాకు రానున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. తన తండ్రికి నివాళులు అర్పించిన అనంతరం ఆమె విజయవాడకు వెళ్ళనున్నారు. సాయంత్రం వైఎస్ జయంతి సభకు తెలంగాణ సీఎం రానున్న విషయం తెలిసిందే.
Sorry, no posts matched your criteria.