India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆప్కాబ్ ఛైర్ పర్సన్ పదవికి మల్లెల ఝాన్సీ రాణి బుధవారం రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని ప్రిన్సిపల్ సెక్రటరీకి పంపినట్లు ఆమె పేర్కొన్నారు. 2021 జులై 26 నుంచి ఆప్కాబ్ ఛైర్ పర్సన్ గా పనిచేస్తున్నానని, 2024 జనవరి 12న నాటి ప్రభుత్వం 2024 జులై 17 వరకు తన పదవీ కాలాన్ని పొడిగించిందన్నారు. వైసీపీ ప్రభుత్వం సహకార బ్యాంకులను లాభాల బాటలో నడిపి అభివృద్ధికి కృషి చేసిందని తెలిపారు.
యోగి వేమన యూనివర్సిటీ ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ, ఎంపీఈడీ (పీజీ) 2, 4 సెమిస్టర్ల పరీక్షలు ఈనెల 28వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ ఎన్ ఈశ్వర్ రెడ్డి వెల్లడించారు. 2వ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 28, జులై 1, 3, 5, 8, 10 తేదీలలో, 4వ సెమిస్టర్ పరీక్షలు ఈనెల 29, జులై 2, 4, 6, 9, 11 తేదీలలో జరుగుతాయన్నారు. వీటితోపాటు ఎంబీఏ పరీక్షలు మొదలవుతాయన్నారు.
ప్రొద్దుటూరు MLA నంద్యాల వరదరాజులరెడ్డి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా మంత్రి పదవి లభించలేదు. ఈయన 1985లో TDP తరఫున గెలిచిన ఆయన తర్వాత కాంగ్రెస్లో చేరి 1989లో పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత వరుసగా మూడు సార్లు MLAగా విజయం సాధించారు. తిరిగి ఈ ఎన్నికల్లో 22,744 మెజార్టీ ఓట్లతో గెలిచారు. ఈయనకు మంత్రి పదవి ఖాయమని ఆయన వర్గీయులు ఆశించారు. కానీ ఆయనకు మంత్రి పదవి లభించకపోవడంతో నిరాశ చెందారు.
రాయచోటి ఎమ్మెల్యే మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణస్వీకారం చేయించారు. ‘మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి అను నేను.. శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తాను’ అంటూ ప్రమాణం చేశారు.
మంత్రివర్గ జాబితాలో చోటు దక్కుతుందని ఆశలు పెట్టుకున్న ఉమ్మడి కడప జిల్లా నేతలకు నిరేశే ఎదురైంది. వైసీపీ హయాంలో సీఎంగా జగన్, డిప్యూటీ సీఎంగా అంజాద్ బాషా జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించారు. కాగా తాజా మంత్రివర్గ జాబితాలో ఉమ్మడి కడప జిల్లా నుంచి కేవలం రాయచోటి ఎమ్మెల్యే మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి మాత్రమే మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. దీనిపై మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి.
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుడు, బీసీ రాష్ట్ర నేత సిద్దవటం యానాదయ్య మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కు పంపించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామికి సేవ చేసే భాగ్యం కల్పించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
రాయచోటి నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మంత్రివర్గ జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఈయన 2021లో టీడీపీలో చేరారు. ఈయన తండ్రి నాగిరెడ్డి, సోదరుడు నారాయణరెడ్డి చెరో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2024లో టికెట్ దక్కించుకున్న రాంప్రసాద్ రెడ్డి.. వైసీపీ అభ్యర్థి గడికోట శ్రీకాంత్ రెడ్డిపై గెలుపొంది.. జిల్లాలో మంత్రి పదవి దక్కించుకున్న ఏకైక నేతగా నిలిచారు.
పోరుమామిళ్ల మండలంలోని నర్సింగపల్లి గ్రామానికి చెందిన ఎం.ఓబులేసు సీఆర్పీఎఫ్ జవానుగా పనిచేస్తున్నాడు. ఇతను ప్రస్తుతం ఒడిశాలో విధులు నిర్వర్తిస్తున్నాడు. మంగళవారం స్వగ్రామానికి కారులో వస్తుండగా ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలోని బీఆర్ జంక్షన్ సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ ఆయన కారును ఢీకొట్టింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. జవాను మృతితో స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఏపీలో కొత్తగా కొలువుదీరే మంత్రుల జాబితాను టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా ప్రకటించారు. 24 మందితో కూడిన జాబితాను జాబితాను తాజాగా ఆయన ప్రకటించారు. ఇందులో భాగంగా ఉమ్మడి కడప జిల్లా నుంచి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డిని మాత్రమే మంత్రి పదవి వరించింది. ఈయన రాయచోటి నియోజకవర్గం నుంచి వైసీపీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డిపై విజయం సాధించారు. ఈయనకు అభినందలు వెల్లువెత్తుతున్నాయి.
కడపలోని వైఎస్ రాజారెడ్డి-ఏసీఏ క్రికెట్ మైదానం వేదికగా జూన్ 30 నుంచి జులై 3వ తేదీ వరకు ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్ -3 క్రికెట్ మ్యాచులు ప్రారంభం కానున్నాయి. ప్రారంభ వేడుకలు జూన్ 30వ తేదీన నిర్వహించనున్నట్లు జిల్లా క్రికెట్ సంఘం ప్రతినిధులు తెలిపారు. ప్రతిరోజు 2 మ్యాచ్లు చొప్పున డే అండ్ నైట్ మ్యాచులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్రికెట్ అభిమానులు ఉచితంగా మ్యాచులను వీక్షించవచ్చు అని తెలిపారు.
Sorry, no posts matched your criteria.