India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాయచోటి నియోజకవర్గ ఫలితం అభ్యర్థుల మధ్య దోబూచులాడుతోంది. మొదట్లో గడికోట ముందంజలో ఉండగా.. చివర్లో అనూహ్యంగా మండిపల్లి ఆధిక్యంలోకి దూసుకొచ్చారు. 20 రౌండ్లు ముగిసేసరికి 871 ఓట్ల మెజార్టీతో కూటమి అభ్యర్థి మండిపల్లి ముందంజలో ఉన్నారు. మరో రౌండ్ ఫలితం లెక్కించాల్సి ఉంది.
రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి విజయం సాధించారు. ఈయనకు మొత్తం 92609 ఓట్లు పోలవ్వగా.. టీడీపీ అభ్యర్థి సుగవాసి సుబ్రహ్మణ్యానికి 85593 ఓట్లు సాధించారు. దీంతో ఆకేపాటి 7016 ఓట్లతో విజయం సాధించారు.
రైల్వే కోడూరు జనసేన అభ్యర్థి అరవ శ్రీధర్ విజయం సాధించారు. ఈయనకు మొత్తం 77701 ఓట్లు పోలవ్వగా.. వైసీపీ అభ్యర్థి కొరముట్ల శ్రీనివాసుకి 67002 ఓట్లు సాధించారు. దీంతో శ్రీధర్ 10699 ఓట్లతో ఘన విజయం సాధించారు. మొదటి సారి ఆయన విజయం సాధించారు. అంతేకాకుండా ఉమ్మడి కడప జిల్లాలో జనసేన జెండా ఎగురవేశారు.
రాయచోటి నియోజకవర్గంలో టీడీపీకి అనూహ్య లీడింగ్ వచ్చింది. 19రౌండ్ వరకు లీడ్ ఉన్న గడికోట శ్రీకాంత్ రెడ్డి, 20వ రౌండ్లో 871 ఓట్లతో వెనుకపడ్డారు. ఇక చివరిగా ఒక్క రౌండ్ ఉంది. తుది విజేత ఎవరో కాసేపట్లో తేలనుంది.
బద్వేల్ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి దాసరి సుధ గెలిచారు. ఆమెకు 90,410 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ అభ్యర్థి బొజ్జ రోషన్నకు 81,843 ఓట్లు పడ్డాయి. దీంతో 8,567 మెజార్టీ ఓట్లతో గెలిచారు. దీంతో ఆమె రెండో సారి అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు.
కమలాపురం నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పుత్తా చైతన్య రెడ్డి విజయం సాధించారు. ఈయనకు 93898 ఓట్లు పోలవ్వగా.. ఆయన ప్రత్యర్థి పి.రవీంద్రనాథ్ రెడ్డికి 69244 ఓట్లు వచ్చాయి. దీంతో పుత్తా 24654 ఓట్ల మెజార్టీతో గెలిచారు. దీంతో ఆయన మెదటి సారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు.
NOTE: పోస్టల్ బ్యాలెట్ కలపకుండా
ప్రొద్దుటూరు నియోజకవర్గంలో టీడపీ జెండా పాతింది. 21353 ఓట్ల మెజారటీతో నంద్యాల వరదరాజుల రెడ్డి గెలిచారు. మొత్తం 1,04,272 ఓట్లు ఆయనకు పోలవగా.. వైసీపీ అభ్యర్థి రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డికి 82,919 ఓట్లు పోలయ్యాయి. దీంతో ఆయన 6వ సారి అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు.
ప్రొద్దుటూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరద రాజుల రెడ్డి గెలుపు దిశగా వెళ్తున్నారు. ఇప్పటికి 18 రౌండ్ ముగిసేసరిగి 22వేల ఓట్ల మెజార్టీలో కొనసాగుతున్నారు. ఇక కేవలం రెండు రౌండ్లు ఉండటంతో ఆయన గెలుపు లాంచనమే అని తెలుస్తోంది.
రాజంపేట వైసీపీ ఎంపీ అభ్యర్థి మిథున్ రెడ్డి 16367 ఓట్లతో ముందంజలో ఉన్నారు ఇప్పటివరకు 258603 ఓట్లు మిథున్ రెడ్డికి పోలవ్వగా.. కిరణ్ కుమార్ రెడ్డికి 241395 ఓట్లు పడ్డాయి.
కమలాపురంలో టీడీపీ అభ్యర్థి పుత్తా చైతన్య రెడ్డి ముందంజలో ఉన్నారు. ఇక్కడ వైసీపీ నుంచి రవీంద్రనాథ్ రెడ్డి, తదితరులు పోటీలో ఉన్నారు.
➠ 8వ రౌండ్లో ఓట్లు ఇలా..
➢ చైతన్య రెడ్డి: 40562
➢ రవీంద్రనాథ్ రెడ్డి: 28244
➠ 8వ రౌండ్ ముగిసే సరికి పుట్టా చైతన్య రెడ్డి 12318 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు.
Sorry, no posts matched your criteria.