India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జిల్లాలో పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. ఫలితాల కోసం అటు అభ్యర్థులు, ఇటు ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ ఉంది. 2019లో ఉమ్మడి జిల్లాలో 10 స్థానాలను క్లీన్ స్విప్ చేసిన YCP ఈసారి అదే ధీమాతో ఉంది. అటు TDPకి ఈసారి మెజార్టీ సీట్లు వస్తాయని లెక్కలు వేసుకుంటోంది. మరోవైపు కాంగ్రెస్ పట్టు సాధించాలని చూస్తుండగా, దీంతో ఎవరు గెలుస్తారా అని చర్చ నడుస్తోంది. మరి మీ MLAగా ఎవరు గెలవబోతున్నారు.
మండలంలోని పెద్దులపల్లెకి చెందిన EX ZPTC, YCP నాయకుడు రామకృష్ణారెడ్డిపై బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు. పెద్దులపల్లె పరిధిలోని ప్రభుత్వ భూమి S.NO:331లో 10 ఎకరాలను ఆక్రమించాడని పలు ఆరోపణలు రావడంతో రెవెన్యూ అధికారులు భూములను పరిశీలించి నోటీసులు ఇచ్చారు. ఆక్రమిత భూమిలో రాత్రికి రాత్రే మొక్కలు నాటడంతో గుర్తించిన MRO మహేశ్వరి బాయ్ సిబ్బందితో మొక్కలను తొలగించారు. MRO ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.
ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ కు సంబంధించి టెన్త్, ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 1 నుంచి 8వ తేదీ వరకు జరుగుతాయని డీఈవో అనురాధ, ఓపెన్ స్కూల్ జిల్లా కోఆర్డినేటర్ కెవి సుబ్బారెడ్డి తెలిపారు. పదో తరగతికి సంబంధించి 5 కేంద్రాల్లో 768 మంది అభ్యాసకులు, ఇంటర్మీడియట్కు సంబంధించి 7 కేంద్రాల్లో 1373 మంది పరీక్ష రాయనున్నారని తెలిపారు. ఈ పరీక్షలు మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు జరుగుతాయన్నారు
కోడూరులో హోంగార్డుగా పనిచేసే టి.ప్రతాప్ ఓ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. రైల్వే పోలీసుల వివరాల మేరకు.. హైదరాబాద్కు చెందిన భార్యాభర్తలు తమ కుమార్తె(15)తో కలిసి మంగళవారం ట్రైన్లో బయలుదేరారు. బాలిక అప్పర్ బెర్త్లో నిద్రింస్తుంది. తనతో ఒక వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించడాన్ని గమనించి తల్లికి చెప్పింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోర్టు అతడికి 14 రోజుల రిమాండ్ విధించి జైలుకు తరలించారు.
చింతకొమ్మదిన్నె మండల పరిధిలోని కేఎస్ఆర్ఎమ్, కేఓఆర్ఎం క్రికెట్ మైదానంలో నిర్వహిస్తున్న ఏసీఏ అంతర్ జిల్లాల సీనియర్ వన్డే క్రికెట్లో బుధవారం నిర్వహించిన మ్యాచ్లో కడప, నెల్లూరు జట్లు విజయం సాధించాయి. కడప జట్టు 310 పరుగులు చేయగా, చిత్తూరు 247 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. దీంతో కడప జట్టు 63 పరుగుల తేడాతో విజయం సాధించింది. మరో మ్యాచ్లో నెల్లూరు జట్టు 8 వికెట్ల తేడాతో కర్నూలు జట్టుపై విజయం సాధించింది.
ఆసుపత్రిలో అబార్షన్ అయిన వారి వివరాలు సేకరించడంతోపాటు ఎక్కడ స్కానింగ్ చేయించింది, ఎక్కడ అబార్షన్లు చేయించుకున్నారు తదితర వివరాలను కచ్చితంగా సేకరించి నమోదు చేయాలని డిప్యూటీ డీఎంహెచ్ఓ, నోడల్ ఆఫీసర్ డాక్టర్ ఉమామహేశ్వర్ కుమార్ ఆదేశించారు. బుధవారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో సబ్ డిస్ట్రిక్ట్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ నిర్వహించారు. పలువురు వైద్యులు పాల్గొన్నారు.
ఇటీవల కాలంలో ఎమ్మెల్యే తాలుకా అంటూ పలువురు వాహనాల నంబర్ ప్లేట్లను తయారు చేసి వైరల్ చేస్తున్నారు. ఈక్రమంలో ‘బాబాయిని లేపినోడి తాలూకా’ అని ఉన్న ఓ ప్లేట్ సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. ఇదే ఫొటోను టీడీపీ X(ట్విటర్)లో పోస్ట్ చేసింది. దానికి ‘అవినాష్ రెడ్డి బండి భలే ఉంది’ అంటూ కామెంట్ చేసింది.
చిట్వేలి మండలం కేఎస్ అగ్రహారం గ్రామపంచాయతీ పరిధిలోని ఎగవూరు గంగమ్మ జాతర గురువారం జరగనున్నది. ఈ జాతర జరిగి దాదాపు 37 సంవత్సరాలు కావస్తోంది. ఊరిలో ఏ చిన్న కార్యక్రమం చేయాలన్నా ఈ తల్లి ఆశీసులతో ప్రారంభిస్తారని గ్రామస్థులు తెలిపారు. 37 సంవత్సరాల తర్వాత యువకులు అంతా ఎలాగైనా జాతర జరిపించుకోవాలని పట్టుబట్టి మరీ నిర్వహిస్తున్నారు. ఊరంతా బంధువులతో కళకళలాడుతోంది.
కడప నుంచి విమానాల రాకపోకల వివరాలు ఈ విధంగా ఉన్నట్లు ఎయిర్పోర్ట్ డైరెక్టర్ శివప్రసాద్ తెలిపారు.
✈ కడప-హైదరాబాద్: ప్రతిరోజు
✈ కడప-విజయవాడ-కడప: సోమ, బుధ, శుక్ర, ఆదివారం
✈ చెన్నై-కడప-చెన్నై: సోమ, బుధ, శుక్ర, ఆదివారం
✈ బెంగళూరు-కడప-బెంగళూరు: మంగళ, గురు, శనివారం
✈ కడప-విశాఖపట్నం-కడప: మంగళ, గురు, శనివారం
జిల్లాలోని అట్లూరులో నివాసముంటున్న యువతి(22) యాసిడ్ తాగి ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన స్థానికులు అంబులెన్స్కి సమాచారం ఇవ్వటంతో వెంటనే రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.