India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మాజీ సీఎం రాజశేఖర్రెడ్డిపై పులివెందుల TDP MLA అభ్యర్థి బీటెక్ రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘రాజశేఖర్ రెడ్డి సీఎం అవడం కోసం పులివెందులలో కొన్ని తప్పులు చేశారు. ఆ తప్పుల వలనే ప్రకృతి కూడా పసిగట్టి హెలికాఫ్టర్ ప్రమాదంలో చనిపోయారని ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. సీఎం అయ్యాక YSR మారినారన్నారు. కానీ జగన్ అధికారంలోకి వచ్చాక తప్పులు చేస్తున్నారని ఆరోపించారు. సీఎం జగన్ మళ్లీ అధికారంలోకి రారని అన్నారు.
మైదుకూరు నియోజకవర్గం ఖాజీపేట మండలం తవ్వారుపల్లి గ్రామానికి చెందిన హోంగార్డ్ చంద్రమోహన్ రెడ్డి కుమార్తె గాయత్రి రెడ్డి మిస్ ఆంధ్రప్రదేశ్ రన్నర్గా ఎంపికైంది. ఈ సందర్భంగా బుధవారం మండల ప్రజలు, చంద్రమోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు, బంధువులు సంతోషం వ్యక్తం చేశారు. గాయత్రిరెడ్డికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు.
మైదుకూరు డీఎస్పీ టి.వెంకటేశులుకు పోలీసుశాఖ ఉన్నతాధికారులు మంగళవారం చార్జ్ మెమో జారీ చేశారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజున మైదుకూరు నియోజకవర్గం పరిధిలో చాపాడు మండలంలో వైసీపీ, టీడీపీ ఏజెంట్ల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలపై మైదుకూరు డీఎస్పీ టి.వెంకటేశులు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారని ఎన్నికల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సంఘటనలో చాపాడు ఎస్ఐపై కూడా శాఖాపరమైన విచారణకు ఆదేశాలు ఇచ్చారు.
రాయచోటి నియోజకవర్గంలోని మాధవరం గ్రామంలోని మూల మురికివాళ్లపల్లెలో జరుగుతున్న గంగమ్మ తల్లి జాతరలో అపశృతి చోటు చేసుకుంది. గ్రామస్థులు చాందిని బండ్లు ఊరేగింపు సమయంలో రోడ్డు ప్రక్కనే పెద్ద పెద్ద మంటలు చెలరేగాయి. గమనించిన ఎస్సై భక్తవత్సలం, సిబ్బంది సమయస్ఫూర్తితో హుటాహుటిన నీళ్ల ట్యాంకర్ను తీసుకువచ్చి మంటలు వ్యాపించకుండా అదుపు చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
రాజకీయ పార్టీల తరఫున కౌంటింగ్ ఏజెంట్ల నియామకానికి ఈ నెల 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ విజయరామరాజు సూచించారు. పోస్టల్ బ్యాలెట్ ఏజెంట్ల కోసం డీఆర్వోలను, ఈవీఎంల లెక్కిపునకు సంబంధించి ఆర్వోలను సంప్రదించాలని చెప్పారు. కౌంటింగ్ కేంద్రంలోకి ఏజెంట్లు ఉదయం 7 గంటల్లోపు హాజరుకావాలని, పూర్తయ్యే వరకు అక్కడే ఉండాలన్నారు. 4వ తేదీ సాయంత్రం వరకు రాయకీయ ప్రతినిధుల ప్రవర్తనపై ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు.
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని సజావుగా, పారదర్శకంగా, పటిష్టంగా నిర్వహించేందుకు శాంతి భద్రతల దృష్ట్యా ఆంక్షలను కఠినతరం చేయడం జరుగుతుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.విజయ్ రామరాజు పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్ సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఎంసీసీ అమలు, 144 సెక్షన్ పాటింపుపై ఎస్పీ సిద్దార్థ్ కౌశల్తో కలిసి రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
ఎంసెట్లో తక్కువ మార్కులు వస్తాయన్న భయంతో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన బ్రహ్మంగారిమఠంలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. గొడ్లవీడుకు చెందిన లక్కినేని చిన్నయ్య కూతురు ప్రతిభ (19) పులివెందులలో ఇంటర్ పూర్తి చేసి ఎంసెట్ పరీక్ష రాసింది. తాజాగా ఆమె ఎంసెట్ ‘కీ’ చూసుకోగా తక్కువ మార్కులు వస్తాయని భయపడి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేశారు.
వైవీయూ అనుబంధ డిగ్రీ కళాశాలల బీఏ, బీబీఏ, బీకాం, బీఎస్సీ ఆరో సెమిస్టర్ పరీక్షా ఫలితాలను వీసీ ఆచార్య చింతా సుధాకర్ విడుదల చేశారు. వైవీయూలోని తన ఛాంబర్లో కులసచివులు ప్రొ. వై.పి వెంకటసుబ్బయ్య, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొ. ఎన్ ఈశ్వర్ రెడ్డితో కలిసి పరీక్షా ఫలితాల గణాంకాలను పరిశీలించారు. బీఏ, బీబీఏలో 100 శాతం పాసయ్యారని, బీకాంలో 98.38 శాతం, బీఎస్సీలో 98.93 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.
ఎంసెట్ లో తక్కువ మార్కులు వస్తాయన్న భయంతో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన బ్రహ్మంగారిమఠంలో జరిగింది. గొడ్లవీడుకు చెందిన లక్కినేని చిన్నయ్య కూతురు ప్రతిభ(19) పులివెందులలో ఇంటర్ పూర్తి చేసి ఎంసెట్ పరీక్ష రాసింది. తాజాగా ఆమె కీ చూసుకోగా తక్కువ మార్కులు వస్తాయని భయపడి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేశారు.
ఓట్ల లెక్కింపు తేదీ జూన్ 4 వచ్చేస్తోంది. ఉమ్మడి కడప జిల్లాలో 10 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాలు ఉండగా.. ఫలితాలకు మరో 7 రోజుల సమయమే ఉంది. ఓ వైపు ఉత్కంఠ నెలకొనగా, మరోవైపు బెట్టింగులు జోరందుకున్నాయి. గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో YCP క్లీన్ స్వీప్ చేయగా, తాజా ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. ఇరుపార్టీల నేతలు గెలుపుపై ధీమాగా ఉండగా, ఏ పార్టీది ఆధిపత్యం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
Sorry, no posts matched your criteria.