Y.S.R. Cuddapah

News May 28, 2024

కడప జిల్లాలో తల్లులకు తప్పని కడుపు కోత

image

కడప జిల్లాలో సిజేరియన్లపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. WHO సంస్థ ప్రకారం 15 శాతం వరకు సిజేరియన్లకు అవకాశం ఉంటే.. జిల్లాలో మాత్రం ఆ సంఖ్య 50పైనే ఉంటుంది. 2023-24లో ప్రభుత్వ ఆసుపత్రిలో 10,890 ప్రసవాలు జరగ్గా అందులో 4,916 సిజేరియన్లే. అదే ప్రైవేట్ ఆస్పత్రిలో 22,667 ప్రసవాలు జరగ్గా ఏకంగా 14,346 మంది తల్లుల కడుపును డాక్టర్లు కోశారు. కొన్ని ఆస్పత్రిల్లో ఈ సంఖ్య 80 శాతంపైనే ఉంటోంది.

News May 28, 2024

అంతర్జాతీయ స్థాయికి కడప లెక్చరర్ 

image

కడప నగరంలోని ప్రభుత్వ పురుషుల కళాశాలలో ఫిజిక్స్ లెక్చరర్‌గా పనిచేస్తున్న డాక్టర్ బి.సుధాకర్ రెడ్డికి కాలిఫోర్నియాకు చెందిన ‘స్కాలర్ జీపీఎస్’ సంస్థ అధ్యయనంలో ఉత్తమ పరిశోధకుడిగా అవకాశం దక్కింది. స్కాలర్ జీపీఎస్ ర్యాకింగ్ అనలైటిక్స్‌లో భౌతికశాస్త్ర విభాగంలో ఈయన ప్రపంచవ్యాప్తంగా ఉన్న భౌతికశాస్త్ర పరిశోధకుల్లో చోటు దక్కించుకున్నాడు. పలువురు ఆయన్ను అభినందించారు. 

News May 28, 2024

వేంపల్లి: విద్యుత్ షాక్‌తో బాలుడి మృతి

image

వేంపల్లిలో సోమవారం విషాదం నెలకొంది. కడప రోడ్డులో ఉన్న వాటర్ సర్వీసింగ్ సెంటర్లో పనిచేస్తున్న స్థానిక ఎస్సీ కాలనీకి చెందిన ఊటుకూరు మనోజ్ అనే బాలుడు విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. కారుకు నీటితో సర్వీసింగ్ చేస్తుండగా పొరపాటున నీరు మోటార్‌పై పడి మనోజ్ విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. దీంతో చికిత్స కోసం బాలుడిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

News May 28, 2024

కడప: స్ట్రాంగ్ రూమ్ పరిశీలించిన జిల్లా ఎస్పీ

image

కడప జిల్లాకు సంబంధించి ఈవీఎం మిషన్లు భద్రపరిచిన స్ట్రాంగ్ రూంను జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్ట్రాంగ్ రూమ్ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బందోబస్తు భద్రతపై సిబ్బందితో చర్చించారు. 24 గంటలు అప్రమత్తంగా ఉండేలా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. జూన్ 4 వరకు బందోబస్తులో ఎటువంటి అలసత్వం వహించరాదని సిబ్బందికి సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవన్నారు.

News May 27, 2024

మైదుకూరు: ఆటోను ఢీ కొన్న ఆర్టీసీ బస్సు.. వ్యక్తి మృతి

image

మైదుకూరు మండల పరిధిలోని కేశలింగయ్య పల్లె వద్ద సోమవారం సాయంత్రం ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో మైదుకూరు మండలం ఉత్సలవరం గ్రామానికి చెందిన సుంకర కొండయ్య(55) అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తిని స్థానికులు మైదుకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే తలకు బలమైన గాయం తగిలి మృతి చెందినట్లు వైద్యులు గుర్తించారు. మైదుకూరు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

News May 27, 2024

కడప: చికిత్స పొందుతున్న యువకులు మృతి

image

చిట్వేలిలోని అంబేడ్కర్ సర్కిల్ వద్ద కొద్ది గంటల క్రితం ఓ కారు, బైక్‌ను<<13327396>> ఢీకొన్న<<>> విషయం తెలిసిందే. తాజాగా ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆ ఇద్దరు యువకులు మృతి చెందారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న చిట్వేలి పోలీసులు విచారణ చేపట్టారు.

News May 27, 2024

వైవీయూ బీటెక్ సెమిస్టర్ ఫలితాలు విడుదల

image

వైవీయూ పరిధిలోని ప్రొద్దుటూరు వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించిన బీటెక్ 4వ సంవత్సరం 2వ సెమిస్టర్ ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఫలితాలను వైవీయూ వైస్ ఛాన్స్‌లర్ ఆచార్య చింతా సుధాకర్, రిజిస్ట్రార్ ఆచార్య వై.పి వెంకటసుబ్బయ్య, ప్రిన్సిపల్ ఆచార్య ఎస్. రఘునాథరెడ్డి, ప్రొద్దుటూరు ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య నాగరాజు, పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య ఎన్.ఈశ్వర్ రెడ్డి విడుదల చేశారు.

News May 27, 2024

కడప: పది సప్లిమెంటరీ పరీక్షకు 368 మంది గైర్హాజరు

image

పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి ఈరోజు జరిగిన ఇంగ్లిష్ పరీక్షకు కడప జిల్లాలో 16 సెంటర్లలో మొత్తం 247 మంది పరీక్షలకు హాజరయ్యారని విద్యా శాఖ అధికారి అనురాధ తెలిపారు. 615 విద్యార్థులకు గాను 368 మంది విద్యార్థులు గైర్హాజరు అయ్యారు. 40.16% హాజరు కాగా, గైర్హాజరు శాతం 59.84% ఉందన్నారు. 02 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు 08 సెంటర్లను పరిశీలించారన్నారు.

News May 27, 2024

ఎర్రగుంట్ల: లారీ, బైకు డీ.. మహిళ మృతి

image

ఎర్రగుంట్ల మండల పరిధిలోని కడప-తాడిపత్రి జాతీయ రహదారి రాణివనం వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల వివరాల మేరకు.. ఎర్రగుంట్ల మండలం, రాణివనంకు చెందిన ఆరీఫ్ తన తల్లితోపాటు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆరీఫ్ తల్లి అక్కడికక్కడే మృతి చెందగా, ఆరీఫ్‌కు గాయాలయ్యాయి. ఈ ప్రమాదం గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News May 27, 2024

కడప: గండికోట అందాలు అదరహో

image

కడప జిల్లాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ, ఎందరో పర్యాటకులను మనవైపు చూసేలా చేసింది మన గండికోట. చుట్టూ ఆహ్లాదకరమైన కొండలు, మూడు వైపుల పెన్నా నది లోయ, అబ్బుర పరిచే శిల్ప సంపద, రాజులు, రాజ్యాల వైభవం గండికోట సొంతం. వర్షాలు పడేకొద్దీ గండికోట అందాలు మరింత ఆకర్షణగా ఉంటాయి. ప్రస్తుతం కొద్ది వర్షపాతానికే గండికోట పరిసర ప్రాంతాలు పచ్చగా మారాయి. దీంతో పర్యాటకుల సంఖ్య భారీగా పెరుగుతోంది.