India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కడప జిల్లాలో ఓటింగ్ శాతం పెరగింది. దీంతో పాటు క్రాస్ ఓటింగ్ కూడా పడిందని జిల్లా ప్రజలు చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా ఎంపీ ఎన్నికలో షర్మిల ప్రభావం చూపినట్లు కాంగ్రెస్ శ్రేణులు చెప్పుకొచ్చాయి. ఎమ్మెల్యే ఓటు ఒక పార్టీకి, ఎంపీ ఓటు ఇంకోపార్టీకి వేసినట్లు జోరుగా చర్చ నడుస్తోంది. ఇది ఎవరికి మేలు, ఎవరికి కీడు జరిగిందో తెలుసుకోవాలంటే మరో వారం రోజులు వేచిచూడాల్సిందే. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.
కడప – రాయచోటి రహదారిలోని గువ్వల చెరువు ఘాట్లో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 1200 బీరు బాటిళ్లు ధ్వంసం అయ్యాయి. పాండిచ్చేరి నుంచి రాయపూర్కు బీరు బాటిళ్ల లోడుతో వెళ్తున్న లారీ ఘాట్ రోడ్డులో ఎదురుగా వస్తున్న సిమెంటు ట్యాంకర్ను ఢీకొంది. దీంతో బీరు బాటిళ్లు ధ్వంసం అయ్యాయని, ఇద్దరు లారీల డ్రైవర్లకు గాయాలయ్యాయని సీఐ శివశంకర్ నాయక్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు.
తన పేరిట ఉన్న ఆస్తి కోసం సొంత కోడలు కిడ్నాప్ చేసిందని రాజంపేటకు చెందిన లక్ష్మి నరసమ్మను చెప్పుకొచ్చారు. బాధితురాలి వివరాల ప్రకారం.. మన్నూరుకు చెందిన తనను తన కోడలు రేవతి వారం రోజుల కిందట కిడ్నాప్ చేసి రాయచోటికి తీసుకెళ్లిందని వాపోయింది. ఆస్తి కోసం ఆమెను ఇబ్బందులు పెట్టారని, ఏకంగా తప్పుడు కేసు పెట్టి జైలుకు కూడా పంపారని శనివారం జరిగిన పత్రికా సమావేశంలో వివరించింది.
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహణ కోసం మొత్తం 1035 మంది కౌంటింగ్ సిబ్బందికి మొదటి విడత ర్యాండమైజేషన్ ద్వారా విధులను కేటాయించడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్ లో జేసీ గణేష్ కుమార్, జిల్లా ఎలక్షన్ కంట్రోల్ రూమ్ ప్రత్యేక పర్యవేక్షకులు ప్రవీణ్ చంద్, డిఆర్ఓ గంగాధర్ గౌడ్ లతో కలిసి ర్యాండమైజేషన్ ప్రక్రియ నిర్వహించారు.
కడప జిల్లాలో గోవధ, జంతుబలులు నిషేదమని జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. నింబంధనలు అతిక్రమిస్తే ఆంధ్రప్రదేశ్ గోపద, జంతుబలులు నిషేద చట్టం 1977 ప్రకారం శిక్షార్హులని హెచ్చరించారు. చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు తప్పవన్నారు. దీనికి సంబంధించిన ఏదైన సమాచారం వుంటే జిల్లా నోడల్ ఆఫీసర్ దిశ డీఎస్పీకి అందించాలని కోరారు.
రాజంపేట ఆకులవీధిలోని నివాసం ఉంటున్న రామాయణం అంజి శుక్రవారం రాత్రి మిద్దె పైనుంచి పడ్డారు. కుటుంబ సభ్యులు గమనించి తిరుపతి ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియల్సి ఉంది.
ఎన్నికలకు అనుబంధంగా విధులు నిర్వహించడానికి కడప, అన్నమయ్య జిల్లాలలో మరికొంత మంది అధికారులను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ డీజీపీ శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. రైల్వేస్ డిఎస్పీ బి.మోహన్ రావు, సీఐడి డిఎస్పీ భాస్కర్ రావులను అన్నమయ్య జిల్లాలో నియమించారు. ఏసీపీ డీఎస్పీ జెస్సీ ప్రశాంతి, ఏసీపీ డీఎస్పీ ఎన్ సత్యానందంలను కడప జిల్లాలో నియమిస్తూ ఉత్తర్వులిచ్చారు.
యోగి వేమన యూనివర్సిటీ పరిధిలోని బద్వేల్ నారాయణమ్మ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కు చెందిన మురళీ కృష్ణ ఈ నెల 20వ తేదీ నుంచి 25వ తేదీవరకు తమిళనాడు ఫిజికల్ ఎడ్యుకేషన్ లో జరిగిన పవర్ లిఫ్టింగ్ పురుషుల విభాగంలో పాల్గొన్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచి వైవీయూకు బంగారు పతకం అందించారు. శనివారం ఉదయం మురళి కృష్ణను యూనివర్సిటీకి పిలిపించి వీసీ చింత సుధాకర్, అధ్యాపకులు సత్కరించారు.
జమ్మలమడుగు మండలం ఎస్. ఉప్పలపాడులో గురువారం రాత్రి ఎస్సీ కాలనీలో దొంగతనం జరిగింది. బాదితులు పెద్ద ఓబులేసు, భార్య గురుదేవి మాట్లాడుతూ.. రాత్రి ఇంటి మిద్దెపై నిద్రిస్తున్న సమయంలో ఇంటి తాళాలు పగలకొట్టి ఇంట్లో బీరువా తీసి 13 తులాల బంగారు, రూ.50 వేలు నగదును దొంగలు ఎత్తుకెళ్లారన్నారు. అలాగే పక్క ఇంట్లో కూడా దొంగతనం జరిగిందని తెలిపారు. జమ్మలమడుగు అర్బన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
భానుడి భగభగలతో జిల్లా ప్రజలు ఉక్కపోతకు గురవుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు కాస్త ఉపశమనం పొందినా.. తిరిగి సూర్యుడు విలయతాండవం చేస్తున్నాడు. శుక్రవారం జిల్లాలో అత్యధికంగా జమ్మలమడుగులో 41.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వల్లూరు, పెద్దముడియంలో 40.7, ఒంటిమిట్ట, కడప, సిద్దవటంలో 40.6, అట్లూరులో 39.1, చెన్నూరులో 39.8 డిగ్రీలు, ఇలా మిగిలిన మండలాల్లో సైతం 35 డిగ్రీల పైగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Sorry, no posts matched your criteria.