India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కడప జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కాలేజ్ల్లో ప్రవేశానికి జూన్ 10వ తేదీ తుది గడువని కడప ప్రభుత్వ మైనార్టీ ఐటీఐ ప్రిన్సిపల్, కన్వీనర్ ఎం.జ్ఞాన కుమార్ తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు తమ వివరాలను iti.ap.gov.in వెబ్ సైట్ ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు. 10వ తరగతి పాస్/ ఫెయిల్ అయిన అభ్యర్థులు ప్రవేశాలకు అర్హులన్నారు. అభ్యర్థులు తమకు సమీపంలో ఉన్న ఐటీఐల వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీఎండీసీ డైరెక్టర్ పదవికి కడప జిల్లాలోని వేంపల్లెకు చెందిన ఈఎస్ సల్మా బుధవారం రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని విజయవాడలోని ఏపీఎండీసీ ఛైర్మన్కు సమర్పించారు. 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో వైసీపీ పరాజయానికి చింతిస్తూ, నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు.
ఎన్నికల ఫలితాల్లో ఉమ్మడి కడప జిల్లాపై TDP పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. కూటమిగా ఏర్పడి 7 స్థానాలు గెలిచింది. YCP ఆవిర్భవం నుంచి ఉమ్మడి జిల్లాపై జగన్ పూర్తి పట్టు సాధించారు. అందుకు తగ్గట్టుగానే 2014, 19 ఎన్నికల్లో అదే విధంగా సీట్లను గెలిచింది. ప్రస్తుత ఎన్నికల్లో YCP కంచుకోటలైన RCT, KMP, PDTR, మైదుకూరు, కోడూరు, కడప, జమ్మలమడుగు స్థానాల్లో కూటమి జయకేతనం వేసింది. దీంతో YCP ఆత్మ సంరక్షణలో పడింది.
ఐదేళ్ల అరాచకపాలనతో విసుగు చెందిన రాష్ర్ట ప్రజలంతా కసితో టీడీపీకి ఓటేశారని మాజీ మంత్రి, సి. రామచంద్రయ్య అన్నారు. కడపలో ఆయన మాట్లాడుతూ.. జగన్ ఓడిపోయి ప్రజలపై నిందలు వేయడం సరికాదన్నారు. జగన్ తీరుతో కడప జిల్లా ప్రజలు తలదించుకోవాల్సి వచ్చిందన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు విచ్చలవిడిగా దోచుకున్నారని వారికి ప్రజలు సరైన గుణపాఠం చెప్పారన్నారు. వైసీపీ నేతలు ఇప్పటికైనా ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు.
కమలాపురం మండలం పెద్దచెప్పలిలో విధులు నిర్వహిస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ ఆది భాస్కర్ (52) మృతి చెందినట్లు ఏపీవో సారధి తెలిపారు. ఏపీవో వివరాల మేరకు.. అనారోగ్యంతో కడప హాస్పిటల్లో చికిత్స పొందుతూ భాస్కర్ బుధవారం సాయంత్రం మృతి చెందినట్లు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు.
నీట్ యూజీ (ఎంబీబీఎస్) 2024 ఫలితాలలో రామాపురం మండలంలోని నల్లగుట్టపల్లి గ్రామం కస్పాకు చెందిన బండపల్లి మేఘన, బండపల్లి మధుసూదన్ రెడ్డిల కుమార్తె బండపల్లి నేహా రెడ్డి మెరిశారు. నేహా రెడ్డి 670 మార్కులు సాధించి ఆలిండియా ఈడబ్ల్యూఎస్ కోటాలో 1651వ ర్యాంక్ సాధించారు. కృషి, పట్టుదలతో విజయవాడలో లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుని 670 మార్కులు సాధించినట్లు తల్లిదండ్రులు చెప్పారు.
ఉమ్మడి కడప జిల్లాలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 7 స్థానాల్లో కూటమి, 3 స్థానాల్లో వైసీపీ గెలిచింది. వీరిలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి (61687) అత్యధిక మెజార్టీ ఓట్లు లభిస్తే.. రాయచోటి టీడీపీ ఎమ్మెల్యే మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి(2495) అత్యల్ప మెజార్టీ ఓట్లతో గెలిచారు. జగన్కు ఇది హ్యాట్రిక్ విజయం కాగా.. మండిపల్లికి ఇది మొదటి గెలుపు.
కడప జిల్లాలో ఎవరు ఎన్నిసార్లు ఎమ్మెల్యేలుగా గెలిచారంటే..
* అరవ శ్రీధర్: మొదటి సారి
* పుత్తా చైతన్య రెడ్డి: మొదటి సారి
* రెడ్డప్పగారి మాధవిరెడ్డి: మొదటి సారి
* మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి: మొదటి సారి
* పుట్టాసుధాకర్ యాదవ్: మొదటి సారి
* దాసరి సుధ: రెండోసారి
* వైఎస్ జగన్: మూడోసారి
* ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి: మూడోసారి
* ఆదినారాయణ రెడ్డి: నాలుగోసారి
* నంద్యాల వరదరాజుల రెడ్డి: ఆరోసారి
కడప జిల్లా నుంచి తొలిసారి ముగ్గురు ఎమ్మెల్యేలుగా పోటీచేసి అసెంబ్లీలోకి అడుగుపెడుతున్నారు. వారిలో కడప టీడీపీ నుంచి పోటీచేసిన రెడ్డప్పగారి మాధవిరెడ్డి, రైల్వే కోడూరు జనసేన అభ్యర్థి అరవ శ్రీధర్, కమలాపురం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పుత్తా చైతన్య రెడ్డి ఉన్నారు. అలాగే అత్యధిక సార్లు (6) ఎమ్మెల్యేగా గెలిచి నంద్యాల వరద రాజులరెడ్డి YSR, బిజివేముల వీరారెడ్డి, డీఎల్ రవీంద్రారెడ్డి సరసన చేరారు.
జమ్మలమడుగులో ఓ రికార్డు బద్దలయింది. ఈ నియోజకవర్గంలో అత్యధిక సార్లు MLAగా గెలిచిన వ్యక్తిగా ఆదినారాయణ రెడ్డి నిలిచారు. ఈయన 2004, 2009లో కాంగ్రెస్ నుంచి పోటీచేసి గెలిచారు. ఆ తర్వాత 2014లో YCP నుంచి, ఇప్పుడు BJP నుంచి పోటీచేసి కూడా విజయం సాధించారు. ఇదే నియోజకవర్గంలో మూడు సార్లు ఎమ్మెల్యేగా పొన్నపురెడ్డి శివారెడ్డి గెలిచారు. ఆయన రికార్డును ఆదినారాయణ రెడ్డి బ్రేక్ చేశారు.
Sorry, no posts matched your criteria.