Y.S.R. Cuddapah

News June 20, 2024

కడప: ఇసుక కుంభకోణంపై విచారణకు ఆర్డీఓ ఆదేశం

image

ఆదినిమ్మాయిపల్లె ఆనకట్ట వద్ద జరిగిన రూ.600 కోట్ల ఇసుక కుంభకోణంపై విచారణకు ఆదేశిస్తూ ఆర్డీఓ మధుసూదన్ ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ ప్రతినిధి బృందం రవిశంకర్ రెడ్డి నాయకత్వాన 2019 నుంచి 24 వరకు జరిగిన కుంభకోణం మీద వినతిపత్రం ఇచ్చి విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో మైనింగ్, పోలీస్, రెవెన్యూ అధికారులతో కమిటీని ఏర్పాటు చేస్తూ విచారణ చేయాలని ఆర్డీవో ఆదేశించారు.

News June 19, 2024

కడప: రైలు ఢీకొని మహిళ మృతి

image

రైలు ఢీకొని గుర్తుతెలియని మహిళ మృతి చెందిన ఘటన కడపలో జరిగింది. రైల్వే సీఐ నాగార్జున తెలిపిన వివరాల ప్రకారం.. కడప – కనుమలోపల్లి మార్గమధ్యంలో ఓ మహిళ ఇవాళ ఉదయం అకస్మాత్తుగా రైలు పట్టాల పైకి రావడంతో అదే మార్గంలో వెళ్తున్న గూడ్స్ ఢీకొని మృతి చెందినట్లు రైల్వే సీఐ నాగార్జున తెలిపారు. ఫోటోలో కనబడుతున్న మహిళ మృతదేహం ఆనవాళ్లను ఎవరైనా గుర్తించినట్లయితే కడప రైల్వే పోలీసులను సంప్రదించాలని సీఐ సూచించారు.

News June 19, 2024

YS రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని తొలగించాలి: TNSF

image

యూనివర్సిటీలలో రాజకీయ నాయకుల విగ్రహాలు పెట్టడాన్ని TNSF నేతలు తప్పుబట్టారు. ఇందులో భాగంగా TNSF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్, కడప జిల్లా అధ్యక్షుడు బొజ్జ తిరుమలేశ్ YVU వీసీ ప్రొఫెసర్ చింత సుధాకర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. నిబంధనలకు విరుద్ధంగా యోగివేమన విశ్వవిద్యాలయంలో ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని తొలగించాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రం అందజేశారు.

News June 19, 2024

కడప: బస్సు ప్రమాదాల్లో 8మంది మృతి

image

కడప జిల్లాలో అద్దె ఆర్టీసీ బస్సులతో తరచూ ప్రాణాలు పోతున్నాయి. ఈ నెల 16వ తేదీన కడప శివారులో స్కూటీని ఢీకొనగా ఇద్దరు మృతి చెందారు. మరుసటి రోజే కడప డిపోకు చెందిన అద్దె ఆర్టీసీ, కారును ఢీకొనగా మరో ఇద్దరు ప్రాణాలు విడిచారు. మొత్తంగా చూసుకుంటే 2024 జనవరి నుంచి జూన్17 వరకు ఎనిమిది ఆర్టీసీ బస్సులు ప్రమాదానికి గురవ్వగా …ఎనిమిది మంది మృతి చెందగా పలువురు గాయాల పాలయ్యారు.

News June 19, 2024

కడప జిల్లాలో పలువురు సీఐలు ఎస్ఐల బదిలీలు

image

కడప జిల్లాలో వివిధ స్టేషన్లలో పనిచేస్తున్న సీఐలు, ఎస్సైలను బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఉత్తర్వులు జారీ చేశారు. 5 మంది ఎస్సైలు, నలుగురు సీఐలకు స్థానచలనం కల్పించారు. కడప 1 టౌన్ సీఐగా రామకృష్ణ, కాజీపేట సీఐగా ప్రొద్దుటూరు రూరల్ సీఐ రమణారెడ్డిని నియమించారు. ప్రస్తుత1 టౌన్ సీఐ, కాజీపేట సీఐలను కర్నూలు వీఆర్ఓ అటాచ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. వెంటనే రిపోర్ట్ చేసుకోవాలని సూచించారు.

News June 19, 2024

కడపలో పోలీసుల పై కరపత్రాల కలకలం

image

కడప నగరంలో ఓ పోలీస్ స్టేషన్‌లో పోలీసు అధికారులు సార్వత్రిక ఎన్నికల్లో వివిధ పార్టీలకు చెందిన వారి నుంచి డబ్బులను తీసుకుని సిబ్బందికి పంపిణీ చేయకుండా అవినీతికి పాల్పడ్డారంటూ గుర్తు తెలియని వ్యక్తులు ‘కరపత్రాలు’ ముద్రించి రాత్రి వేళల్లో పంపిణీ చేశారు. ఈ సంఘటన పోలీసు అధికారుల్లో అసహనం, ప్రజల్లో కలకలం రేపింది. ఈ సంఘటనపై ఎవరు కరపత్రాలను తయారు చేశారు? ఎవరు పంపిణీ చేశారు? అనే విషయాలపై ఆరా తీస్తున్నారు.

News June 19, 2024

కడప: బస్సు హెల్పర్ పై దాడి.. ముగ్గురు అరెస్టు

image

కడప నగరంలోని వన్‌టౌన్‌ పరిధిలో ఆర్టీసీ పాత అసుపత్రి ఆవరణంలో డిసెంబర్‌ 30న హెల్పర్‌ ప్రసాద్‌పై, రవి కుమార్‌, కిషోర్‌కుమార్‌, మరో 5మందితో కలిసి దాడి చేసిన సంఘటనలో ముగ్గురిని అరెస్ట్‌ చేసినట్లు సీఐ భాస్కర్‌రెడ్డి తెలిపారు. ఈ ఘటనలో అరెస్టయిన వారిలో రవికుమార్‌, ప్రశాంత్‌, మునీంద్ర ఉన్నారు. ఈ ప్లేస్‌లో మరి కొంతమంది పరార్‌లో ఉన్నారు. వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారని తెలిపారు.

News June 19, 2024

కడప నుంచి విమాన సర్వీసులు పెంచాలి: MP

image

కడప నుంచి విమాన సర్వీసులు పెంచాలని సీఎం రమేశ్ కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకి మంగళవారం వినతి పత్రం అందించారు. ఉడాన్ పథకంతో దేశీయ ట్రూజెట్ సంస్థ 2018లో కడప నుంచి నాలుగు ప్రాంతాలకు రెగ్యులర్‌గా విమాన సర్వీసులు ప్రారంభిస్తే, వైసీపీ వీజీఎఫ్ చెల్లించక సర్వీసులు నిలిపివేసిందని ఆరోపించారు. కడప-ముంబయి, కడప- హైదరాబాద్ విమానాలను రెగ్యులర్‌గా నడిపేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

News June 19, 2024

ప్రభుత్వ సేవలను విస్తృతం చేయాలి: అన్నమయ్య కలెక్టర్

image

ప్రభుత్వ శాఖలలో ప్రజలకు అందించే రోజువారి సేవలను విస్తృతం చేయడంపై దృష్టి పెట్టాలని కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం రాయచోటిలోని కలెక్టరేట్లో ఆర్డీఓలు, తహశీల్దార్లు, ఎంపీడీఓలు, మునిసిపల్ కమిషనర్లతో సమావేశం నిర్వహించారు. గ్రామ వార్డు సచివాలయ సేవలు, భూ సేకరణ, సివిల్ సప్లై తదితర అంశాలపై వారికి దిశా నిర్దేశం చేశారు.

News June 18, 2024

జమ్మలమడుగులో 3ఏళ్లుగా నిలిచిపోయిన అభివృద్ధి: ఆది

image

జమ్మలమడుగు మున్సిపాలిటీలో 3 సంవత్సరాల నుంచి ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదని ఎమ్మెల్యే చదిపిరాళ్ల ఆదినారాయణ రెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం స్థానిక నగర పంచాయతీ కార్యాలయంలో అత్యవసర సమావేశాన్ని ఛైర్‌పర్సన్ శివమ్మ అధ్యక్షతన నిర్వహించారు. మున్సిపాలిటీకి సాధారణ నిధులు ఎంత మేర వస్తున్నాయి, ఎంత ఖర్చు చేశారన్న విషయాలపై ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు.