India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

విద్యుత్ షాక్తో రైతు మృతి చెందిన ఘటన రైల్వే కోడూరు మండలం బొజ్జవారిపల్లె గ్రామంలో జరిగింది. మంగళవారం సాయంత్రం రైతు జనార్ధన్(51) పొలానికి నీరు పెట్టడానికి వెళ్లగా అక్కడ ప్రమాదవశాత్తు కరెంట్ షాక్కు గురయ్యాడు. గమనించిన స్థానికులు ఆయన్ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో రాజంపేటలో టీడీపీ తరఫున పోటీ చేసిన సుగవాసి బాలసుబ్రమణ్యం మంగళవారం ఉండవల్లిలో భేటీ అయ్యారు. రాజంపేట నియోజకవర్గంలో తన ఓటమికి గల కారణాలను చంద్రబాబుకు సుగవాసి వివరించారు. రాజంపేటను జిల్లా చేయడం, మెడికల్ కాలేజ్, అన్నమయ్య ప్రాజెక్ట్ తదితర అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

మాజీ సీఎం జగన్ బుధవారం పులివెందుల పర్యటనకు రానున్నారు. బుధవారం మధ్యాహ్నం 3గంటలకు విజయవాడ విమానాశ్రయం నుంచి బయలుదేరి సాయంత్రం 4 గంటలకు కడప ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డుమార్గంలో పులివెందుల చేరుకుంటారు. తిరిగి జూన్ 21వ తేదీ మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో విజయవాడ చేరుకుంటారు.

మాజీ సీఎం జగన్ అధ్యక్షతన ఈ నెల 22న శనివారం ఉదయం 10.30కి తాడేపల్లిలోని జగన్ క్యాంప్ కార్యాలయంలో సమావేశం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి కడప జిల్లాలోని ఎమ్మెల్యేలతో పాటు , ఈ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులందరూ హాజరుకానున్నారు. వీరితో పాటు ఎంపీలు మినహా పార్లమెంట్కు పోటీ చేసిన అభ్యర్థులను కూడా ఆహ్వానించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.

నిడిజివ్వి గ్రామంలో జూదం ఆడుతున్న 16 మందిని ఎర్రగుంట్ల పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 72,750 నగదును స్వాధీనం చేసుకునట్లు ఎస్సై భాస్కర్ రెడ్డి తెలిపారు. అదే విధంగా పోట్లదుర్తి గ్రామంలో జూదం ఆడుతున్న 8 మందిని అదుపులోకి తీసుకుని రూ.24,750 నగదు స్వాధీనం చేసుకున్నారు.

కడపలో సోమవారం తొలిసారిగా MLAలు సోమవారం సమావేశమయ్యారు. అక్రమార్కుల పనిపట్టాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. గతంలో అంటకాగిన అధికారుల భరతం పట్టాలని, దీనిలో ఎలాంటి మినహాయింపులు లేవనే అభిప్రాయానికి వచ్చారు. జిల్లా TDP శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన R&Bలో చర్చించారు. దీనికి కమలాపురం MLA పుత్తా హాజరుకాలేదు. అయిదేళ్లు కార్యకర్తలను వేధించిన వారిని గుర్తించి తీవ్రవను బట్టి సస్పండ్ చేయించాలని అభిప్రాయానికి వచ్చారు.

కలసపాడు మండలంలోని కొండపేట గ్రామంలో సోమవారం ఇండ్లా శీను(31)అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడని హెడ్ కానిస్టేబుల్ విజయకుమార్ తెలిపారు. శీను సోదరుడు ఓబులేసు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోరుమామిళ్ల ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించామని ఆయన చెప్పారు.

కేంద్ర పౌర విమానాయన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు రేపు కడపకు వస్తున్నట్లు అధికారులు తెలిపారు. రేపు సాయంత్రం కడప కలెక్టర్ కార్యాలయంలో ప్రధానమంత్రి కిసాన్ నిధుల విడుదల కార్యక్రమంలో కడప నుంచి ఆయన పాల్గొంటారని పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లను అధికారులు సిద్ధం చేస్తున్నారు. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పర్యటన పూర్తి షెడ్యూల్ తెలియాల్సి ఉంది.

కేంద్ర పౌర విమానాయన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు రేపు కడపకు వస్తున్నట్లు అధికారులు తెలిపారు. రేపు సాయంత్రం కడప కలెక్టర్ కార్యాలయంలో ప్రధానమంత్రి కిసాన్ నిధుల విడుదల కార్యక్రమంలో కడప నుంచి ఆయన పాల్గొంటారని పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లను అధికారులు సిద్ధం చేస్తున్నారు. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పర్యటన పూర్తి షెడ్యూల్ తెలియాల్సి ఉంది.

మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కడప జిల్లా పర్యటన వాయిదా పడింది. రేపటినుండి 5 రోజులు పాటు జిల్లాలో ఇడుపులపాయతో పాటు పలు ప్రాంతాల్లో పర్యటన ఉండగా..19 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం, ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఉన్న కారణంగా పర్యటనను వాయిదా వేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
Sorry, no posts matched your criteria.