Y.S.R. Cuddapah

News April 30, 2024

కమలాపురంలో యువకుని దారుణ హత్య

image

కమలాపురంలో ఓ యువకుడిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేసిన ఘటన మంగళవారం వేకువజామున జరిగింది. పోలీసుల కథనం మేరకు.. కమలాపురం పక్కీరి వీధిలో నివాసం ఉంటున్న మహమ్మద్ ఘని (26)ని గుర్తు తెలియని దుండగలు ఇంట్లోకి చొరబడి విచక్షణా రహితంగా కత్తులతో హత్యచేసినట్లు తెలిపారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు సీఐ రామకృష్ణారెడ్డి, SI హృషికేషవరెడ్డి కేసు నమోదు చేసి, దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

News April 30, 2024

నేడు సీఎం జగన్ కడప జిల్లా పర్యటన వివరాలు

image

సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు మైదుకూరుకు రానున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు ఆయన పర్యటన వివరాలను వెల్లడించారు. ఉ. 9.40 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 10.45కు ప్రకాశం జిల్లా టంగుటూరు చేరుకొని బహిరంగ సభలో పాల్గొననున్నారు. అక్కడి నుంచి 12.45కి మైదుకూరుకు హెలికాప్టర్లో రానున్నారు. 12.55గం.కు సభాస్థలికి చేరుకుని 1.10-1.55 గంటల వరకు కొనసాగించనున్నారు. 2.10గం.కు అన్నమయ్య జిల్లాకు బయలుదేరుతారు.

News April 30, 2024

ఎన్నికల నిబంధనలు తప్పకుండా పాటించాలి: కలెక్టర్

image

కేంద్ర ఎన్నికల సంఘం నియమ నిబంధనలను తూచా తప్పక పాటిస్తూ నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుందని కడప జిల్లా కలెక్టర్ వి.విజయరామరాజు రాజకీయ పార్టీల ప్రతినిధులు, బరిలో నిలిచిన అభ్యర్థులకు సూచించారు. కలెక్టర్ కార్యాలయంలో రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఉపసంహరణ అనంతరం.. బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితాను, వారికి కేటాయించిన పార్టీ గుర్తుల జాబితాను కూడా తెలియజేయడం జరిగిందన్నారు.

News April 29, 2024

కడప: స్ట్రాంగ్ రూమ్ కౌంటింగ్ కేంద్రంగా ఉర్దూ యూనివర్సిటీ

image

జిల్లాలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రంగా జాతీయ ఉర్దూ యూనివర్సిటీని ఎంపిక చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ విజయరామరాజు తెలిపారు. కడప శివారులోని రిమ్స్ ప్రభుత్వాసుపత్రి వద్ద ఉన్న మౌలానా అబుల్ కలాం జాతీయ ఉర్దూ యూనివర్సిటీ(MAANU)ను ఎన్నికల సంఘం సిఫార్సు మేరకు ఎంపిక చేసామన్నారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు సిద్ధం చేశామన్నారు.

News April 29, 2024

జిల్లాలో పులివెందుల టాప్.. బరిలో 27 మంది

image

కడప జిల్లాలో ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ పడుతున్న నియోజకవర్గాల్లో పులివెందుల టాప్‌లో నిలిచింది. ఇక్కడ మొత్తం 27 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం 53 నామినేషన్లు దాఖలు కాగా, 10 నామినేషన్లు తిరస్కరించామని, 10 నామినేషన్లు ఉపసంహరించుకున్నారని చెప్పారు. దీంతో 27 మంది అభ్యర్థులు ఎన్నికల పోటీలో ఉన్నారు. దీంతో సీఎం జగన్ పై ఇక్కడ 26 మంది పోటీ పడుతున్నారు.

News April 29, 2024

కడప: వైసీపీలోకి కాంగ్రెస్ నేత నజీర్ అహ్మద్

image

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నజీర్ అహ్మద్ ఆ పార్టీని వీడారు. వైఎస్ షర్మిల వచ్చాక కాంగ్రెస్ పార్టీలో తనకు జరిగిన అవమానాన్ని భరించలేక, మనస్తాపంతో కాంగ్రెస్ పార్టీని వీడి వైసీపీలో చేరానన్నారు. ఆయనకు అవినాశ్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి అంజాద్ బాషా, మేయర్ సురేశ్ బాబులు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్‌లో ఉన్న తనను అవమానపరిచారని ఆరోపించారు.

News April 29, 2024

కడప పార్లమెంట్ పరిధిలో ఫైనల్ అభ్యర్థుల వివరాలు

image

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కడప పార్లమెంటు స్థానానికి ఫైనల్ అభ్యర్థుల వివరాలను జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి విజయరామరాజు తెలిపారు. మొత్తం 47 నామినేషన్లు దాఖలు కాగా 20 నామినేషన్లు పరిశీలనలో తిరస్కరించామని, చివరకు 14 మంది ఎన్నికల పోటీలో నిలిచారన్నారు. ప్రధాన పార్టీలైన వైసీపీ నుంచి వైఎస్ అవినాశ్‌రెడ్డి, టీడీపీ నుంచి భూపేశ్‌రెడ్డి, కాంగ్రెస్ తరఫున వైఎస్ షర్మిల ఎన్నికల బరిలో ఉన్నారన్నారు.

News April 29, 2024

కడప: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య

image

కడప జిల్లాలో సోమవారం విషాదం నెలకొంది. వల్లూరులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు కుటుంబ కలహాలతో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 29, 2024

సిద్దవటం: వడదెబ్బతో యువకుడి మృతి

image

సిద్దవటం మండలంలో వడదెబ్బకు గురై నాగేంద్ర అనే యువకుడు మృతి చెందిన సంఘటన ఆదివారం జరిగింది. లింగంపల్లికి చెందిన నాగేంద్ర పనులు ముగించుకొని ఆటోలో వెళుతుండగా స్పృహ కోల్పోయి పడిపోయాడు. స్థానికులు గుర్తించి చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

News April 29, 2024

మే 2న జిల్లాకు రానున్న చంద్రబాబు, లోకేశ్

image

ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వచ్చే నెల 2న రాయచోటి, కడపకు రానున్నారు. మధ్యాహ్నం రాయచోటిలో జరిగే బహిరంగసభలో పాల్గొననున్న చంద్రబాబు సాయంత్రం కడప నగరానికి చేరుకుని రోడ్ షోలో పాల్గొని ప్రజాగళం బహిరంగసభలో ప్రసంగించనున్నారు. ఆయనతో పాటు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ రానున్నారు. యువతతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు.