India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాజంపేట మండలం పోలి గ్రామం సమీపంలో సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పర్, ఆటో ఢీకొన్న ఘటనలో వెంకటలక్ష్మి (40) అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికుల సహాయంతో చికిత్స నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇంటి, నీటి పన్నుల వసూళ్లలో పులివెందుల మొదటి స్థానంలో నిలిచిందని ఆ సంస్థ కమిషనర్ తెలిపారు. జిల్లాలో పన్ను వసూళ్లలో పులివెందుల 83.90%తో ప్రథమ స్థానంలో నిలిచింది. కడప 82.8% ద్వితీయ స్థానం, ఎర్రగుంట్ల 77.30 % మూడో స్థానాల్లో ఉన్నట్లు కమిషనర్లు తెలిపారు. మున్సిపల్ సచివాలయ ఉద్యోగుల కృషితో, వినియోదారుల సహకారంతో పన్ను వసూలు చేసినట్లు అధికారులు తెలిపారు.
రాష్ట్ర రాజకీయాల్లో జమ్మలమడుగుకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రస్తుతం YCP నుంచి సిట్టింగ్ MLA డా. మూలె సుధీర్ రెడ్డి మరోసారి బరిలో ఉన్నారు. ఒకప్పుడు వరుస విజయాలతో జమ్మలమడుగులో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్న ఆది నారాయణ రెడ్డి మరోసారి తన హవా కొనసాగించేందుకు కూటమి అభ్యర్థిగా సిద్దమయ్యారు. రాజకీయాలకు ముందు కెమిస్ట్రీ టీచర్గా పనిచేశారు. మరి ఇద్దరిలో గెలుపెవరిదో కామెంట్ చేయండి.
ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల ఏప్రిల్ 5న కడపకు రానున్నారు. నగరంలోని ఓ షోరూమ్ ప్రారంభించేందుకు శ్రీలీల వస్తున్నట్లు తెలిపారు. అందుకు సంబంధించి షోరూం నిర్వాహకులు కడప పట్టణంలో ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిర్వహకులు, పోలీసులు తగు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
బీసీలకు పెద్ద పీట వేసిన పార్టీ తెలుగుదేశం అని కడప పార్లమెంటు కూటమి అభ్యర్థి భూపేశ్ రెడ్డి అన్నారు. ఆదివారం సాయంత్రం ప్రొద్దుటూరులోని స్థానిక పద్మశాలి కళ్యాణ మండపంలో బీసీల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. బీసీల మీద కపట ప్రేమ చూపిస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని రానున్న ఎన్నికల్లో ఇంటికి సాగనంపాలన్నారు. ప్రొద్దుటూరు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజుల రెడ్డి పాల్గొన్నారు.
ప్రొద్దుటూరు నడిబొడ్డులోని శివాలయం సెంటర్లో చంద్రబాబు నాయుడు శనివారం నిర్వహించిన ప్రజా గళం సభ చరిత్రలో ఇంతటి ఘోరమైన సభను చూడలేదని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి విమర్శించారు. ఆదివారం ప్రొద్దుటూరులో ఆయన మాట్లాడుతూ.. సభకు డబ్బులు ఇచ్చి పిలిపించినా 5000 మంది కూడా రాలేదని ఎద్దేవా చేశారు. ఆయన ఈ నియోజకవర్గానికి చేసిన ఒక్క అభివృద్ధిని చెప్పలేదని విమర్శించారు.
కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో కానిస్టేబుల్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. గత కొద్ది నెలల క్రితం పులివెందులలోని జెండా మాను వీధిలో తన భార్యను హత్య చేసిన కేసులో అనుమానితుడిగా కానిస్టేబుల్ ఉన్నాడు. అయితే ఇవాళ ప్రొద్దుటూరులో కానిస్టేబుల్ మృతి చెందడంతో స్థానికుల సమాచారం ద్వారా ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు కేసు నమోదు చేశారు.
ఏప్రిల్ రెండవ తేదీన కడప జిల్లాలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పర్యటిస్తున్నట్లు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు కడపలో తెలిపారు. 28వ తేదీ కడపలో పర్యటించాల్సి ఉండగా అనివార్య కారణాలవల్ల వాయిదా పడగా.. ఏప్రిల్ 2న కడపలో పర్యటిస్తున్నట్లు పేర్కొన్నారు. రంజాన్ పండుగ నేపథ్యంలో ఇఫ్తార్ విందులో ఆమె పాల్గొనడంతో పాటు రాజకీయ కార్యక్రమాల్లో షర్మిల పాల్గొంటున్నట్లు జిల్లా నాయకులు తెలిపారు.
ఉమ్మడి కడప జిల్లాలో TDP వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తుందని, ఆ మేరకే అభ్యర్థుల ఎంపిక జరిగిందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. మరో వైపు సీటు దక్కని నేతలు బహిర్గతంగానే పార్టీపై విమర్శలు చేశారు. రాయచోటి, రాజంపేట, ప్రొద్దుటూరు, బద్వేలు నాయకులు ఆ కోవలోనే ఉన్నారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపునకు వారు ఎంతవరకు సహకరిస్తారో అని చర్చ ఉంది. అయితే ఇప్పటికే అసమ్మతి నేతలకు బుజ్జగింపులు మొదలు పెట్టింది.
జిల్లా రాజకీయాల్లో కడప అసెంబ్లీకి ప్రత్యేక స్థానం ఉంది. 3 దశాబ్దాల నుంచి ముస్లింలకు కంచుకోటగా మారిన కడప నుంచి సిట్టింగ్ MLA అంజాద్ బాషా వైసీపీ నుంచి బరిలో ఉన్నారు. ఇటు కూటమి నుంచి మహిళా అభ్యర్థి మాధవిరెడ్డి మొదటిసారి పోటీ చేస్తున్నారు. కడపలో గెలిచి చరిత్ర సృష్టిస్తానని మాధవిరెడ్డి అంటుంటే, ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ విజయం సాధిస్తానని అంజాద్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఇక్కడ గెలుపు ఎవరిది.?
Sorry, no posts matched your criteria.