India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రొద్దుటూరు ప్రజాగళం సభలో చంద్రబాబు భూపేశ్ రెడ్డి గురించి మాట్లాడారు. ‘బుల్లెట్ లాంటి కుర్రాడు, రాజకీయ కుటుంబానికి చెందిన వ్యక్తి, జమ్మలమడుగు TDPకి ఎవరూ లేనప్పుడు పెద్ద దిక్కుగా నిలబడ్డాడు. పార్టీని నమ్ముకున్నాడు కాబట్టే MP టికెట్ ఇచ్చాను’ అని చెప్పుకొచ్చారు. భూపేశ్కు ప్రత్యర్థిగా వివేకాను హత్య చేసిన వ్యక్తి ఉన్నాడని ఆరోపించారు. భూపేశ్ని గెలిపిస్తే కడపకు స్టీల్ ప్లాంట్ వస్తుందని హామీ ఇచ్చారు.
ట్రాక్టర్ బోల్తా పడి లింగాలకు చెందిన జయరామిరెడ్డి అనే రైతు మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. ఈతాకుల కోసం ట్రాక్టర్లో వెళ్లాడు. తిరుగు పయణంలో అంబకపల్లి మురారిజింతల గ్రామ సరిహద్దుల్లో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడటంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలికి చేరుకొని మృతుడి దగ్గర విలపిస్తున్నారు.
చంద్రబాబు ప్రొద్దుటూరు బహిరంగ సభలో ఉక్కు ప్రవీణ్ గురించి ప్రస్తావించారు. పార్టీ కోసం ప్రవీణ్ చాలా కష్టపడ్డాడని, రెండు సార్లు జైలుకు వెళ్లాడని అతడికి తప్పకుండా న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే సీఎం సురేశ్ పార్టీకి సహకరించారని. ఆయనకు ఈసారి టికెట్ ఇవ్వలేకపోయా తప్పకుండా అతనికి న్యాయం చేస్తానన్నారు. లింగారెడ్డి, ఇతర నాయకులకు పార్టీ అండగా ఉంటుందన్నారు.
కాశినాయన మండలం నరసాపురం సచివాలయం పరిధిలోని 23 మంది వాలంటీర్లు ఉద్యోగాలకు రాజీనామా చేశారు. రాజీనామా పత్రాలను సచివాలయాల పంచాయతీ కార్యదర్శులకు అందజేశారు. రాజీనామా చేసిన వారిలో నరసాపురం, మిద్దెల, మూలపల్లి, నరసన్నపల్లి గ్రామాల వాలంటీర్లు ఉన్నారు. తామంతా వైసీపీ గెలుపు కోసం స్వచ్ఛందంగా రాజీనామా చేశామని వారు తెలిపారు.
ప్రొద్దుటూరు బహిరంగ సభలో చంద్రబాబు ఎమ్మెల్యే రాచమల్లుపై విమర్శలు గుప్పించారు. రాచమల్లు ఒక ముళ్లు అని ప్రజలను గుచ్చుతూనే ఉంటారని ఆరోపించారు. ప్రొద్దుటూరులో మట్కా, జూదం, ఇసుక, సెటిల్ మెంట్ లో, నకిలీ నోట్లు ఇలా అన్నింటిలో అవినీతిలో ఉన్నారని అన్నారు. టెక్నాలజీ దుర్మార్గుడి చేతిలో ఉంటే ప్రజలు ఆగం అవుతారన్నారు. రాజమల్లు రూ.2 వేల కోట్లు అవినీతితో సంపాదించారని ఆరోపించారు.
రాజుపాళెం మండలం తొండలదిన్నె గ్రామానికి చెందిన నొస్సం బాబుషా (17) అనే యువకుడు విద్యుత్ షాక్ తగిలి మృతి చెందాడని ఎస్ఐ తులసీ నాగప్రసాద్ తెలిపారు. నొస్సం సంజీవ్ భూమిని కౌలుకు తీసుకుని వరి పంటను సాగు చేసుకుంటున్నారు. ఆ పొలానికి సాగు నీరు పారించేందుకు కుమారుడు బాబుషా అక్కడికి వెళ్లాడు. నీటిని విడిచే సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ మోటార్ కు విద్యుత్ సరఫరా కావడంతో బాబుషా అక్కడికక్కడే మృతి చెందాడు.
కడప ఎన్టీఆర్ సర్కిల్ వద్ద TDP ఆవిర్భావ దినోత్సవం నిర్వహించడంపై కేసు నమోదైంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పాటించకుండా, అనుమతి లేకుండా TDP నేతలు కేక్ కట్ చేశారని సంబంధిత అధికారుల ఫిర్యాదు మేరకు శుక్రవారం రాత్రి కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిందితులుగా TDP జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసులరెడ్డి, కడప అసెంబ్లీ TDP అభ్యర్థి మాధవరెడ్డి, హరిప్రసాద్, గోవర్ధన్ రెడ్డితోపాటు పలువురు ఉన్నారు.
కడప జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ముందుగా వెలువడిన షెడ్యూల్ ప్రకారం మైదుకూరు, ప్రొద్దుటూరులో పర్యటించాల్సి ఉండగా మైదుకూరు కార్యక్రమాన్ని వాయిదా వేసుకుని కేవలం ప్రొద్దుటూరులో పర్యటించేలా షెడ్యూల్ ఖరారు అయినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. ఉదయం వింజమూరు నుంచి హెలికాప్టర్ ద్వారా ప్రొద్దుటూరు చేరుకొని రోడ్షో ద్వారా శివాలయం సర్కిల్లో బహిరంగ సభ నిర్వహిస్తారు.
రాజంపేట టీడీపీ ఇన్ఛార్జ్ బత్యాల చెంగల్ రాయుడుకు రాజంపేట టీడీపీ టికెట్ రాకపోవడంతో మనస్తాపం చెందిన టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ కార్య నిర్వాహక కార్యదర్శి మందా శ్రీనివాసులు రాజంపేటలో భవనంపై నుంచి దూకుతానని కొద్దిసేపు హల్చల్ చేశారు. తమ నాయకుడికి టికెట్ ఇవ్వాలని, లేని పక్షంలో ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించారు. టీడీపీ నేతలు కొందరు హుటాహుటిన భవనం పైకెక్కి మందా శీనును సముదాయించి కిందికి దించారు.
TDP ప్రభుత్వ హయాంలో 2014 – 2019 వరకు ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిధిలో ఏ అభివృద్ధి చేశారో TDP అధినేత చంద్రబాబునాయుడు చెప్పాలని ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. శుక్రవారం ప్రొద్దుటూరులో ఆయన మాట్లాడుతూ 2014-19 సంవత్సరాల్లో ప్రొద్దుటూరు TDP ఇన్ఛార్జ్గా వరదరాజుల రెడ్డి ఉన్నారన్నారు. ఆ సమయంలో నియోజకవర్గానికి ఏమి అభివృద్ధి చేయలేదని విమర్శించారు.
Sorry, no posts matched your criteria.